అన్వేషించండి

WHO on Covid Death: భారత్ లో కరోనా మరణాలు 47 లక్షలకు పైనే, డబ్ల్యూహెచ్ఓ నివేదికను తప్పుబట్టిన కేంద్రం

WHO on Covid Death: భారత్ లో కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 47 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని అంచనా. అయితే ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది.

WHO on Covid Death: దేశంలో కరోనా వైరస్ మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జనవరి 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య భారతదేశం 4.7 మిలియన్ల కన్నా ఎక్కువ కోవిడ్ మరణాలు సంభవించాయని గ్లోబల్ హెల్త్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు అధికారికంగా నమోదైన దాని కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రాణాలను బలిగొందని తెలిపింది. కరోనాతో మొత్తం సుమారు 14.9 మిలియన్ల మరణాలు సంభవించాయని వెల్లడించింది.  

డబ్ల్యూహెచ్వో గణాంకాలపై అభ్యంతరం 

WHO కరోనా మరణాలపై తన నివేదికను విడుదల చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా అదనపు మరణాలను అంచనా వేసిన విధానంపై భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. WHO నివేదికను తప్పుబట్టింది. కరోనా మరణాల అంచనా మోడల్‌, డేటా సేకరణ సందేహాస్పదంగా ఉందని పేర్కొంది. ఈ మోడల్ పద్దతి, ఫలితాలపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, WHO భారతదేశ ఆందోళనలను తగినంతగా పరిష్కరించకుండానే అదనపు మరణాల అంచనాలను విడుదల చేసింది.

Also Read : Driving License In Afghanistan: అఫ్గాన్‌లో మహిళలకు ఇక నో డ్రైవింగ్ లైసెన్స్- తాలిబన్ల షాకింగ్ నిర్ణయం

భారత్ టైర్ II లో ఉండదు 

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) విడుదల చేసిన డేటాను కేంద్రం ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. భారతదేశంలో కరోనా మరణాల సంఖ్యను అంచనా వేయడానికి గణిత నమూనాలను ఉపయోగించరాదని తెలిపింది. "భారతదేశంలో జననాలు, మరణాల నమోదు చాలా పటిష్టమైంది. దశాబ్దాల నాటి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ద్వారా వీటిని నమోదుచేస్తున్నాం" అని కేంద్రం పేర్కొంది. మే 3 నాటికి భారతదేశంలో అధికారికంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 522,676. ప్రపంచ దేశాలను టైర్ I, II కేటగిరీలుగా వర్గీకరించడానికి WHO ఉపయోగించే ప్రమాణాలు సరిగా లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. WHO భారతదేశాన్ని రెండో కేటగిరీలో చేర్చింది. చట్టబద్ధమైన వ్యవస్థ ద్వారా సేకరించిన మరణాల డేటా కచ్చితత్వాన్ని బట్టి, భారతదేశం టైర్ II దేశాలలో ఉండదని కేంద్రం పేర్కొంది. ఆరోగ్య సంస్థకు ఈ విషయాన్ని తెలియజేసింది. భారత్ లేవనెత్తిన వాదనపై WHO స్పందించలేదని ప్రభుత్వం తెలిపింది. 

Also Read : sex ratio in the country : లద్దాఖ్‌లో ఎక్కువ - మణిపూర్‌లో తక్కువ ! లింగనిష్పత్తి రిపోర్ట్‌లో కీలక అంశాలు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget