అన్వేషించండి

WHO on Covid Death: భారత్ లో కరోనా మరణాలు 47 లక్షలకు పైనే, డబ్ల్యూహెచ్ఓ నివేదికను తప్పుబట్టిన కేంద్రం

WHO on Covid Death: భారత్ లో కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 47 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని అంచనా. అయితే ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది.

WHO on Covid Death: దేశంలో కరోనా వైరస్ మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జనవరి 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య భారతదేశం 4.7 మిలియన్ల కన్నా ఎక్కువ కోవిడ్ మరణాలు సంభవించాయని గ్లోబల్ హెల్త్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు అధికారికంగా నమోదైన దాని కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రాణాలను బలిగొందని తెలిపింది. కరోనాతో మొత్తం సుమారు 14.9 మిలియన్ల మరణాలు సంభవించాయని వెల్లడించింది.  

డబ్ల్యూహెచ్వో గణాంకాలపై అభ్యంతరం 

WHO కరోనా మరణాలపై తన నివేదికను విడుదల చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా అదనపు మరణాలను అంచనా వేసిన విధానంపై భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. WHO నివేదికను తప్పుబట్టింది. కరోనా మరణాల అంచనా మోడల్‌, డేటా సేకరణ సందేహాస్పదంగా ఉందని పేర్కొంది. ఈ మోడల్ పద్దతి, ఫలితాలపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, WHO భారతదేశ ఆందోళనలను తగినంతగా పరిష్కరించకుండానే అదనపు మరణాల అంచనాలను విడుదల చేసింది.

Also Read : Driving License In Afghanistan: అఫ్గాన్‌లో మహిళలకు ఇక నో డ్రైవింగ్ లైసెన్స్- తాలిబన్ల షాకింగ్ నిర్ణయం

భారత్ టైర్ II లో ఉండదు 

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) విడుదల చేసిన డేటాను కేంద్రం ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. భారతదేశంలో కరోనా మరణాల సంఖ్యను అంచనా వేయడానికి గణిత నమూనాలను ఉపయోగించరాదని తెలిపింది. "భారతదేశంలో జననాలు, మరణాల నమోదు చాలా పటిష్టమైంది. దశాబ్దాల నాటి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ద్వారా వీటిని నమోదుచేస్తున్నాం" అని కేంద్రం పేర్కొంది. మే 3 నాటికి భారతదేశంలో అధికారికంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 522,676. ప్రపంచ దేశాలను టైర్ I, II కేటగిరీలుగా వర్గీకరించడానికి WHO ఉపయోగించే ప్రమాణాలు సరిగా లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. WHO భారతదేశాన్ని రెండో కేటగిరీలో చేర్చింది. చట్టబద్ధమైన వ్యవస్థ ద్వారా సేకరించిన మరణాల డేటా కచ్చితత్వాన్ని బట్టి, భారతదేశం టైర్ II దేశాలలో ఉండదని కేంద్రం పేర్కొంది. ఆరోగ్య సంస్థకు ఈ విషయాన్ని తెలియజేసింది. భారత్ లేవనెత్తిన వాదనపై WHO స్పందించలేదని ప్రభుత్వం తెలిపింది. 

Also Read : sex ratio in the country : లద్దాఖ్‌లో ఎక్కువ - మణిపూర్‌లో తక్కువ ! లింగనిష్పత్తి రిపోర్ట్‌లో కీలక అంశాలు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh CM Chandra Babu: ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
Telangana Latest News: మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
Ashika Ranganath: చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
BRS MLC Kavitha : ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

People Digging Asirgarh Fort Chhaava Viral Video | సినిమాలో చూపించినట్లు గుప్త నిధులున్నాయనే ఆశతో | ABP DesamNTR Fan Koushik Passed Away | ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆకస్మిక మృతి | ABP DesamYS Viveka Case Witness Deaths | ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ? | ABP DesamRashmika Karnataka Government Controversy | రష్మికపై ఫైర్ అవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh CM Chandra Babu: ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
Telangana Latest News: మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
Ashika Ranganath: చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
BRS MLC Kavitha : ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
Borugadda Anil: నాకేం జరిగినా చంద్రబాబు,లోకేష్‌దే బాధ్యత - జగనే నా తండ్రి - ఆజ్ఞాతం నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో
నాకేం జరిగినా చంద్రబాబు,లోకేష్‌దే బాధ్యత - జగనే నా తండ్రి - ఆజ్ఞాతం నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో
Nani: ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
Viral Video: ఆ అమ్మాయి మీద పగబట్టిన కుక్కలు - గ్యాంగ్ ఎటాక్ -  ఈ వీడియో చూస్తే భయపడిపోతారు!
ఆ అమ్మాయి మీద పగబట్టిన కుక్కలు - గ్యాంగ్ ఎటాక్ - ఈ వీడియో చూస్తే భయపడిపోతారు!
Telangana News: 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 18 ఏళ్ల లోపు బాలికలతో సంఘాలు- తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన
60 ఏళ్లు దాటిన వృద్ధులు, 18 ఏళ్లలోపు బాలికలతో సంఘాలు- తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన
Embed widget