అన్వేషించండి

Independence Day 2025: స్వాతంత్ర సమరంలో గాంధీజీని కదిలించిన ఘటన ఏదీ?

Independence Day 2025: ఆగస్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. హింస కారణంగా గాంధీజీ మనసు మారింది. దీంతో ఉద్యామాన్ని మరో దిశగా తీసుకెళ్లారు.

Independence Day 2025: దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు, ఉద్యమాలు జరిగాయి. కానీ ఒక ఉద్యమం మాత్రం ఆంగ్ల ప్రభుత్వాన్ని కదిలించింది. 8 ఆగస్టు 1942న మహాత్మా గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భారతీయులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమయంలో చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు రహస్యంగా పోరాడారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు పెద్ద ర్యాలీలు నిర్వహించారు. 

ఉద్యమ వేడిని చూసిన ఆంగ్లేయులు తమను దేశం నుంచి వెళ్లగొట్టడం ఖాయమని భావించారు. క్విట్‌ ఇండియా  ఉద్యమం సమయంలో ఎక్కడ హింస జరిగింది. ఏ సంఘటన గాంధీజీ మనసు మార్చిందో తెలుసుకుందాం. 

ప్రజలు రాళ్లు ఎత్తారు

9ఆగస్టు 1942న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మహాత్మా గాంధీ ఆంగ్లేయులను భారతదేశం విడిచి వెళ్ళమని కోరారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత శక్తివంతమైన ఉద్యమం అయిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో గాంధీజీ 'డూ ఆర్ డై' నినాదం ఇవ్వగా, ఆంగ్ల ప్రభుత్వం దానిని తీవ్రమైన అణచివేతతో ప్రతిస్పందించింది. ఈ ఉద్యమం సమయంలో ప్రజలు కూడా నడుం బిగించారు. ప్రజలపై 'డూ ఆర్ డై' నినాదం బాగా పని చేసింది. మొదటి రెండు రోజులు ఈ ఉద్యమం శాంతియుతంగా జరిగింది, కాని బ్రిటిష్ ప్రభుత్వం వారిపై లాఠీఛార్జ్ చేసి కాల్పులు జరిపినప్పుడు, ప్రజలు కూడా రాళ్లు రువ్వారు. 

లక్షల మంది గాయపడ్డారు

క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయడానికి, ఆంగ్ల ప్రభుత్వం మార్ష్ స్మిత్, నీడర్సోల్ నాయకత్వంలో సైన్యాన్ని పంపింది. ఆ సమయంలో అక్రమ దోపిడీ, అగ్నిప్రమాదాలు, మహిళలపై దాడులతో అణచివేతలో చాలా మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. లక్షల ఆస్తులను దోచుకుని వేలం వేశారు. ఈ ఉద్యమం సమయంలో మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌లో హింస చెలరేగింది. చాలా మంది మరణించారు. ఈ సమయంలో ఒక ఘటన గాంధీజీ మనసు మార్చివేసింది. 

ఏ ఘటన గాంధీజీ మనసు మార్చింది

క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం హింసాత్మకంగా  ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ప్రజలపై కాల్పులు జరిపారు, లాఠీఛార్జ్ చేశారు. గ్రామాలను తగలబెట్టారు. భారీ జరిమానాలు విధించారు. ఈ సమయంలో లక్ష మందికిపైగా అరెస్టు అయ్యారు. ఈ ఉద్యమంలో హింస, విధ్వంసం జరిగినప్పుడు, గాంధీజీ దీనిని తీవ్రంగా ఖండించారు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ అహింస, సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించడానికి మద్దతు ఇచ్చారు. ఈ ఉద్యమంలో జరిగిన హింస ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకం. 

హింసను వ్యతిరేకించారు

గాంధీజీ ఎల్లప్పుడూ హింసను వ్యతిరేకించారు, 1942లో ఉద్యమం సమయంలో జరిగిన హింస సందర్భంగా, హింసను ప్రోత్సహించే దేనికీ  మద్దతు ఇవ్వనని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ లక్ష్యం హింస లేకుండా ఆంగ్లేయులను భారతదేశం విడిచి వెళ్ళేలా చేయడం అని కూడా ఆయన అన్నారు.                              

టాప్ హెడ్ లైన్స్

India Hockey Jersey: హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget