అన్వేషించండి

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ

భారత రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, కానీ ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. నేడు వచ్చిన ఎన్నికల ఫలితాలపై శనివారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ఎన్డీయే విజయంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డు లాంటివి రాజ్యాంగంలో లేవన్నారు. కానీ ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, ఒక్కో వర్గానికి అవసరమయ్యేలా నడుచుకునే పాలిటిక్స్‌కు వక్ఫ్ బోర్డు ఉదాహరణ అన్నారు. వాస్తవానికి భారత రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అవినీతి రహిత, పారదర్శక పాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. విభజన శక్తులు, మతాలు, సామాజిక వర్గాల పేరిట రాజకీయాలు చేసే కాంగ్రెస్ లాంటి ఇండి కూటమికి చెంప పెట్టు లాంటిదని మోదీ పేర్కొన్నారు.  మరియు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విభజన శక్తులు, ప్రతికూల రాజకీయాలు మరియు వంశపారంపర్యత ఓడిపోయాయని అన్నారు. సుస్థిరత కోసం ఓటేసిన మహారాష్ట్ర ప్రజలు, ప్రజలను విభజించాలని చూసిన వారికి తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు.

ఐకమత్యంగా ఉంటే మనదే విజయం..

బీజేపీ ప్రధాన కార్యాయలంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశం ఏంటంటే.. మనమంతా ఐకమత్యంగా ఉంటే సురక్షితంగా ఉంటాం. "ఏక్ హై తో సేఫ్ హై" నినాదానికి ప్రజలు ఆమోదం తెలిపారు. తమ నిర్ణయాన్ని వెల్లడించిన జార్ఖండ్‌ ప్రజలకు సైతం నమస్కరిస్తున్నాను. వారి అభివృద్ధికి బీజేపీ మరింతగా పనిచేస్తుంది. 'ఏక్ హై తో సేఫ్ హై' అనేది దేశం మొత్తానికి ఓ నినాదంగా మారింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ, వారి కూటమి కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని భావిస్తుంది. అలాంటి వారికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గొడ్డలిపెట్టు. 

రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. షెడ్యూల్డ్ కులాల వారని, షెడ్యూ్ల్డ్ తెగలవారిని, వెనుకబడిన తరగతుల వారని చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. అలాంటి వారికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి. కానీ ప్రజల ఆలోచన, వారి స్వభావాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు. వారు సీటు కోసం రాజకీయాలు చేస్తారు. కానీ దేశానికి తొలి ప్రాధాన్యమని గుర్తించరు. కాంగ్రెస్ చేసిన అబద్ధపు హామీలు, మోసపూరిత ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో చేసిన మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు. బీఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతం మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది. 

ఆర్టికల్ 370ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది
ఎంతో శ్రమించి జమ్మూకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ఆర్టికల్ 370 ను తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. కాంగ్రెస్, వారి మిత్రపక్షాలే కాదు.. ప్రపంచంలోని ఏ శక్తి సైతం జమ్మూకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదా ఆర్టికల్ ను తిరిగి తీసుకురాలేరు. మన రాజ్యాంగాన్ని అవహేళన చేయలేరు’ అని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget