అన్వేషించండి

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ

భారత రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, కానీ ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. నేడు వచ్చిన ఎన్నికల ఫలితాలపై శనివారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ఎన్డీయే విజయంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డు లాంటివి రాజ్యాంగంలో లేవన్నారు. కానీ ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, ఒక్కో వర్గానికి అవసరమయ్యేలా నడుచుకునే పాలిటిక్స్‌కు వక్ఫ్ బోర్డు ఉదాహరణ అన్నారు. వాస్తవానికి భారత రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అవినీతి రహిత, పారదర్శక పాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. విభజన శక్తులు, మతాలు, సామాజిక వర్గాల పేరిట రాజకీయాలు చేసే కాంగ్రెస్ లాంటి ఇండి కూటమికి చెంప పెట్టు లాంటిదని మోదీ పేర్కొన్నారు.  మరియు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విభజన శక్తులు, ప్రతికూల రాజకీయాలు మరియు వంశపారంపర్యత ఓడిపోయాయని అన్నారు. సుస్థిరత కోసం ఓటేసిన మహారాష్ట్ర ప్రజలు, ప్రజలను విభజించాలని చూసిన వారికి తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు.

ఐకమత్యంగా ఉంటే మనదే విజయం..

బీజేపీ ప్రధాన కార్యాయలంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశం ఏంటంటే.. మనమంతా ఐకమత్యంగా ఉంటే సురక్షితంగా ఉంటాం. "ఏక్ హై తో సేఫ్ హై" నినాదానికి ప్రజలు ఆమోదం తెలిపారు. తమ నిర్ణయాన్ని వెల్లడించిన జార్ఖండ్‌ ప్రజలకు సైతం నమస్కరిస్తున్నాను. వారి అభివృద్ధికి బీజేపీ మరింతగా పనిచేస్తుంది. 'ఏక్ హై తో సేఫ్ హై' అనేది దేశం మొత్తానికి ఓ నినాదంగా మారింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ, వారి కూటమి కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని భావిస్తుంది. అలాంటి వారికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గొడ్డలిపెట్టు. 

రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. షెడ్యూల్డ్ కులాల వారని, షెడ్యూ్ల్డ్ తెగలవారిని, వెనుకబడిన తరగతుల వారని చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. అలాంటి వారికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి. కానీ ప్రజల ఆలోచన, వారి స్వభావాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు. వారు సీటు కోసం రాజకీయాలు చేస్తారు. కానీ దేశానికి తొలి ప్రాధాన్యమని గుర్తించరు. కాంగ్రెస్ చేసిన అబద్ధపు హామీలు, మోసపూరిత ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో చేసిన మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు. బీఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతం మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది. 

ఆర్టికల్ 370ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది
ఎంతో శ్రమించి జమ్మూకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ఆర్టికల్ 370 ను తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. కాంగ్రెస్, వారి మిత్రపక్షాలే కాదు.. ప్రపంచంలోని ఏ శక్తి సైతం జమ్మూకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదా ఆర్టికల్ ను తిరిగి తీసుకురాలేరు. మన రాజ్యాంగాన్ని అవహేళన చేయలేరు’ అని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ -  దీపాదాస్ మున్షికి ఉద్వాసన
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ - దీపాదాస్ మున్షికి ఉద్వాసన
Revanth Reddy: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan Strong Warning To Chandra Babu: మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
Rahul Gandhi: రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ?  ఇదిగో అసలు నిజం
రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ? ఇదిగో అసలు నిజం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Deputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP DesamPM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP DesamTrump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP DesamCaste Census Re Survey in Telangana |  ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ -  దీపాదాస్ మున్షికి ఉద్వాసన
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ - దీపాదాస్ మున్షికి ఉద్వాసన
Revanth Reddy: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan Strong Warning To Chandra Babu: మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
Rahul Gandhi: రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ?  ఇదిగో అసలు నిజం
రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ? ఇదిగో అసలు నిజం
CM Revanth Reddy: కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
Railways  Not Restored Senior Citizen Concessions : ఆశపడకండి - వృద్ధులకు రైల్వే రాయితీ పునరుద్ధరించడం లేదు - ప్రచారం ఫేక్ !
ఆశపడకండి - వృద్ధులకు రైల్వే రాయితీ పునరుద్ధరించడం లేదు - ప్రచారం ఫేక్ !
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు కోర్టులో భారీ ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు కోర్టులో భారీ ఊరట
Laila Movie Review - లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.