అన్వేషించండి

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ

భారత రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, కానీ ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. నేడు వచ్చిన ఎన్నికల ఫలితాలపై శనివారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ఎన్డీయే విజయంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డు లాంటివి రాజ్యాంగంలో లేవన్నారు. కానీ ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, ఒక్కో వర్గానికి అవసరమయ్యేలా నడుచుకునే పాలిటిక్స్‌కు వక్ఫ్ బోర్డు ఉదాహరణ అన్నారు. వాస్తవానికి భారత రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అవినీతి రహిత, పారదర్శక పాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. విభజన శక్తులు, మతాలు, సామాజిక వర్గాల పేరిట రాజకీయాలు చేసే కాంగ్రెస్ లాంటి ఇండి కూటమికి చెంప పెట్టు లాంటిదని మోదీ పేర్కొన్నారు.  మరియు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విభజన శక్తులు, ప్రతికూల రాజకీయాలు మరియు వంశపారంపర్యత ఓడిపోయాయని అన్నారు. సుస్థిరత కోసం ఓటేసిన మహారాష్ట్ర ప్రజలు, ప్రజలను విభజించాలని చూసిన వారికి తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు.

ఐకమత్యంగా ఉంటే మనదే విజయం..

బీజేపీ ప్రధాన కార్యాయలంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశం ఏంటంటే.. మనమంతా ఐకమత్యంగా ఉంటే సురక్షితంగా ఉంటాం. "ఏక్ హై తో సేఫ్ హై" నినాదానికి ప్రజలు ఆమోదం తెలిపారు. తమ నిర్ణయాన్ని వెల్లడించిన జార్ఖండ్‌ ప్రజలకు సైతం నమస్కరిస్తున్నాను. వారి అభివృద్ధికి బీజేపీ మరింతగా పనిచేస్తుంది. 'ఏక్ హై తో సేఫ్ హై' అనేది దేశం మొత్తానికి ఓ నినాదంగా మారింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ, వారి కూటమి కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని భావిస్తుంది. అలాంటి వారికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గొడ్డలిపెట్టు. 

రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. షెడ్యూల్డ్ కులాల వారని, షెడ్యూ్ల్డ్ తెగలవారిని, వెనుకబడిన తరగతుల వారని చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. అలాంటి వారికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి. కానీ ప్రజల ఆలోచన, వారి స్వభావాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు. వారు సీటు కోసం రాజకీయాలు చేస్తారు. కానీ దేశానికి తొలి ప్రాధాన్యమని గుర్తించరు. కాంగ్రెస్ చేసిన అబద్ధపు హామీలు, మోసపూరిత ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో చేసిన మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు. బీఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతం మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది. 

ఆర్టికల్ 370ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది
ఎంతో శ్రమించి జమ్మూకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ఆర్టికల్ 370 ను తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. కాంగ్రెస్, వారి మిత్రపక్షాలే కాదు.. ప్రపంచంలోని ఏ శక్తి సైతం జమ్మూకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదా ఆర్టికల్ ను తిరిగి తీసుకురాలేరు. మన రాజ్యాంగాన్ని అవహేళన చేయలేరు’ అని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Babili water Release: బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Samsung A56: భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
Ind Vs NZ Odi Update:  స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
Embed widget