అన్వేషించండి

Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!

Priyanka Gandhi Journey: కేరళ వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రికార్డు విజయాన్ని అందుకున్నారు. 2019 నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టిన ఆమె ప్రజల మనసు గెలిచారు.

Priyanka Gandhi Political Journey: 2 దశాబ్దాల క్రితం గాంధీ - నెహ్రూ కుటుంబం వారసురాలిగా పాలిటిక్స్‌కు పరిచయమైన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి రికార్డు విజయం అందుకున్నారు. కేరళ వయనాడ్ (Wayanad) లోక్‌సభ ఉప ఎన్నికలో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి చరిత్ర సృష్టించారు. ప్రచారంలో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ 'తానో ఫైటర్' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బలంగా నిలిచాయి. 'ప్రజా ప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్తేమో కానీ.. ప్రజల తరఫున పోరాటం నాకు కొత్త కాదు. 30 ఏళ్లు గృహిణిగా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని నేను.. ఇప్పుడు మీ సమస్యలపైనా అలాగే పోరాడుతాను. నేనో ఫైటర్.. మీ తరఫున బలమైన గొంతుకనవుతా..' అని ఆమె చేసిన వ్యాఖ్యలే ప్రజలను ఆమె దగ్గరకు చేర్చాయి.

పొలిటికల్ జర్నీ సాగిందిలా..

  • 1998 జనవరి 26న తన తల్లి సోనియాగాంధీతో కలిసి తమిళనాడులోని ఓ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొన్నారు. 'అందరూ కాంగ్రెస్‌కు ఓటెయ్యండి.' అంటూ తమిళంలో మాట్లాడిన ఒక్క వ్యాఖ్యమైనా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. తల్లి సోనియాకు అడ్వైజర్‌గా ఉంటూ తల్లికి రాజకీయ ప్రసంగాల్లో సాయం చేశారు.
  • 2004లో తొలిసారిగా ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. యూపీ వెలుపల కొన్ని చోట్ల ర్యాలీల్లోనూ కనిపించారు.
  • అయితే, ఆమె యాక్టివ్ పాలిటిక్స్‌లోకి మాత్రం 2019లోనే అడుగుపెట్టారు. ఆ ఏడాది జనవరిలో ఆమె యూపీ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది మొత్తం యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2019లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలగగా.. ఆ టైంలో ప్రియాంక బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు వినిపించాయి. అయితే, వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. అనంతరం 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు.
  • యూపీలో కాంగ్రెస్ ఓటమి తర్వాత 2022 చివర్లో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంక యావత్ దేశం దృష్టినే ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో తెరవెనుక ఆమె అన్నీ తానై పార్టీని నడిపించి విజయాన్ని అందించారు.

బలమైన నేతగా..

2024, సార్వత్రిక ఎన్నికల ముందు సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించగా.. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల అరంగేట్రం చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, అనూహ్యంగా అక్కడి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. 2024 ఎన్నికల నాటికి మోదీకి దీటుగా సమాధానం ఇవ్వగల బలమైన నేతగా ప్రియాంక మారారు. మాటల మాంత్రికురాలిగా, వ్యూహకర్తగా, ప్రజలను ఆకర్షించే ప్రసంగాలతో ప్రచారంలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే కేరళ వయనాడ్‌లో తన సోదరుడు రాహుల్ గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు.

Also Read: Maharastra Elections: ఆసలైన శివసేన, ఎన్సీపీలు ఏవో తేల్చేసిన మహారాష్ట్ర ప్రజలు - ఇక థాక్రే, పవార్‌లకు రాజకీయ సన్యాసమేనా ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget