అన్వేషించండి

Viral Video: పోతారు! మొత్తం పోతారు! ప్రమాదకరమైన కొండపై వందల మంది ట్రెక్కింగ్ వీడియో వైరల్‌

Viral Video: మహారాష్ట్రంలోని ఓ కొండపై ట్రెక్కింగ్ కోసం వందల మంది క్యూ కట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: మహారాష్ట్రలోని హరిహర్ కోట చాలా ఫేమస్‌ ట్రెక్కింగ్ ప్లేస్‌. నిటారుగా, ఇరుకైన రాతి మెట్లపై నుంచి శిఖరానికి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈసారి పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో జనం ఈ ట్రెక్కింగ్‌కు వచ్చారు. వారంతా ప్రమాదకర రీతిలో ట్రెక్కింగ్ కోసం ఎగబడుతున్న జనం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

మాహారాష్ట్రలోని హరిహర్‌ కోట భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ ప్రదేశాలలో ఒకటి. అలాంటి ప్రమాదకరమైన ప్రదేశానికి ఈస్థాయిలో జనం తరలి రావడం భద్రతాలోపాన్ని ఎత్తిచూపుతోంది. పొరపాటున తొక్కిసలాంటిది జరిగితే పరిస్థితి ఏంటనేది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

వోక్ ఎమినెంట్ అనే X యూజర్‌ షేర్ చేసిన వీడియో చూస్తే చాలా మంది భయపడిపోతున్నారు. 3,676 అడుగుల ఎత్తులో క్యూకట్టిన జనసందోహాన్ని చూస్తున్న వారంతా హడలిపోతున్నారు. 60–70 డిగ్రీల నిటారుగా ఉన్న ప్రమాదకరమైన 200 అడుగుల రాతి మెట్లు ఎక్కుతున్న సందర్శకులు కనిపిస్తున్నారు. ఇరుకైన స్థలం వెళ్లేందుకు దారి లేకపోయినా, పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ జనం మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. శిఖరంపైకి వెళ్లేందుకు పోటీపడుతున్న వీడియో మాత్రం చూసే వాళ్లకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది.  

కొండపై ఉన్న వారిలో చాలా మందికి నిలబడే స్థలం కూడా లేదు. చివరి అంచున నిలబడి పడిపోతామేమోనన్న భయం వీరిలో ఏ మాత్రం కనిపించడం లేదు. ఏదైనా తొక్కిసలాట లేదా ఇంకా ఏదైనా జరిగితే మాత్రం చాలా మంది ప్రాణాలు పోతాయని నెటిజన్లు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఈ హరిహర్ ఫోర్ట్‌కు వారాంతంలో భారీగా జనం వస్తుంటారు. ఇంకో ప్రమాదం జరగకుండా నియంత్రించాలని నెటిజన్లు రిక్వస్ట్ చేస్తున్నారు. లేకుంటే చిన్న తొక్కిసలాట లేదా ఎవరైనా బ్యాలెన్స్‌ కోల్పోతే మాత్రం పెను ప్రమాదానికి దారి తీయొచ్చని అంటున్నారు.  వందలాది మంది చనిపోతారు. అని టైటిల్‌తో వీడియో పోస్టు చేశారు.  

ఇంత ప్రమాదకర రీతిలో జనాలను ఎలా అనుమతించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "నాసిక్‌లోని అటవీ శాఖ దీనిని నియంత్రిస్తుంది. ఫీజు వసూలు చేస్తున్నారు. వారు రోజుకు 300 మందినే పంపించారు. కానీ అది వాస్తవంగా అమలు కావడం లేదు. ఇప్పుడు, వీడియో వైరల్ అవ్వడంతో పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేసినట్లు చెప్పారు. అది కూడా అమలుకావడం లేదని తేలింది. ఇప్పుడు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

మరొక నెటిజన్ ఇలా రాశాడు "అధికారులు ప్రతి విషయంలో జోక్యం చేసుకోలేరు. ప్రజలకు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్వయం నియంత్రణ ఉండొద్దా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి ప్రమాదాన్ని కాపాడుతుందని ఆశించడం మమ్మల్ని మూర్ఖులను చేస్తుంది." అని చెప్పుకొచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget