అన్వేషించండి

Delhi Assembly Election : ఢిల్లీ ఎన్నికలు - ఓటెయ్యండి - 50% డిస్కౌంట్ పొందండి - ఓటర్లకు సెలూన్లు, బ్యూటీ పార్లర్ల ఆఫర్లు

Delhi Assembly Election : ఢిల్లీలో ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి, ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ (CTI) ఓటు వేసిన ఎవరైనా తమ సర్వీస్ లో తగ్గింపు పొందవచ్చని ప్రకటించింది.

Delhi Assembly Election : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే నగరంలో ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి పలు వ్యాపార సంస్థలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. ఓటు అందరి హక్కు, దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేస్తూ పలు వాణిజ్య సంస్థలు కొత్త ప్రచారం మొదలుపెట్టాయి. తమ సర్వీసుల్లో తగ్గింపులు ప్రకటిస్తున్నారు. ఓటు వేసిన తర్వాత వచ్చే వారికి సేవలపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ (CTI) సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ కౌన్సిల్ ప్రకటించింది.

సెలూన్లు, బ్యూటీ పార్లలో డిస్కౌంట్లు

ఢిల్లీలో ఎన్నికలను పురస్కరించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచడానికి పలు మార్కెట్ సంఘాలు, వాణిజ్య సంస్థలు ముందుకొచ్చాయి. ఇందుకు నగరంలోని 500 కి పైగా సెలూన్లు, బ్యూటీ పార్లర్లు ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ విషయంపై స్పందించిన సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఓటు వేయమని ప్రోత్సహించడానికి, అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, ధాబాలు, మాల్స్ కూడా 10 నుండి 50 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయన్నారు. ఇందులో సెలూన్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు కూడా ఉన్నారని చెప్పారు. 

అయితే మరి ఈ డిస్కౌంట్ పొందాలంటే ఎవరు అర్హులు అన్న విషయానికొస్తే.. ఫిబ్రవరి 6న ఎవరైనా సెలూన్ లేదా బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వేలిపై ఉన్న ఓటు సిరాను చూపిస్తే, వారికి డిస్కౌంట్ లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. హెయిర్ కట్, షేవింగ్, ఫేషియల్, మసాజ్, డిటాన్ ప్యాక్ వంటి అనేక సర్వీసులపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ప్రచారంలో పాల్గొంటున్న మహిళా పారిశ్రామికవేత్తలు

నగరంలో ఓటింగ్ ను పెంచేందుకు పూనుకున్న చొరవలో చాలా మంది మహిళా పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొంటున్నారని సీటీఐ మహిళా మండలి ప్రధాన కార్యదర్శి ప్రియాంక సక్సేనా అన్నారు. వందన రావు, రష్మి ఛబ్రా, బబిత, రీనా కల్రా, సోనియా నాగ్‌పాల్, కీర్తి సింగ్, ఉషా గాంధీ, అంజు వర్మ, కుసుమ్ గోయల్, మంజు తన్వర్, నిషా రంజన్, దివ్య, ఉమా సిద్ధిఖీ, నందని గులాటి, హేమ, అనితా శర్మ వంటి ఎంతో మంది మహిళలు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో సెలూన్లు నడుపుతున్నారని, వారి కస్టమర్లకు డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. 

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు

ఢిల్లీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో (2020), దాదాపు 62.59% మంది ఓటు వేశారు. అంతకుముందు 2015లో ఈ సంఖ్య 67.47%, 2013లో 66% ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఓటర్లను ప్రోత్సహించేందుకు, ఇలాంటి చిన్న ప్రోత్సాహకాలు ప్రజలను ఓటు వేయడానికి ప్రేరేపిస్తాయని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ చెప్పారు. వారికి అవగాహన కల్పించేందుకు, పోలింగ్ బూత్‌కు తీసుకురావడంలో సహాయకరంగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ వేటు వేయాలని పిలుపునిచ్చారు. 

అంతకుముందు కూడా పోలింగ్ రోజున ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఆఫర్లు ప్రకటించారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ఓటింగ్ రోజున పలువురు దుకాణదారులు, కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపులను ఇచ్చారు. గతంలో ఢిల్లీలో కూడా రెస్టారెంట్లు, మాల్స్‌లోనూ ఓటర్లకు ఈ తరహా డిస్కౌంట్లు ఇచ్చాయి. ఇప్పుడు సెలూన్లు, బ్యూటీ పార్లర్లు కూడా ఈ ప్రచారంలో చేరడం చెప్పుకోదగిన విషయం.

Also Read : Delhi Elections 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget