అన్వేషించండి

Journalist Rana Ayyub: జర్నలిస్టు రానా ఆయుబ్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు - ముంబయి ఎయిర్‌పోర్టులో అడ్డగింత

Journalist Rana Ayyub: రానా ఆయుబ్ లండన్ వెళ్తుండగా ముంబయి విమానాశ్రయంలో అధికారులు నిలిపివేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల వల్ల ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

Journalist Rana Ayyub: ప్రముఖ జర్నలిస్టు రానా ఆయుబ్‌ను ముంబయి ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకోవడం చర్చనీయాంశం అయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన వేళ.. రానా ఆయుబ్ లండన్ వెళ్తుండగా ముంబయి విమానాశ్రయంలో  అధికారులు నిలిపివేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల వల్ల ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. 

‘‘జర్నలిస్టులకు బెదిరింపులు అనే అంశంపై మాట్లాడేందుకు లండన్ వెళ్తుండగా ముంబయిలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై మాట్లాడేందుకు నేను ఇటలీకి కూడా వెళ్లాల్సి ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని Doughty Street International అండ్ జర్నలిజం ఫెస్టివల్ కోసం డాక్టర్ జూలీ పోసెట్టి ప్లాన్ చేశారు. నా సోషల్ మీడియా అకౌంట్లలో కూడా చాలా రోజుల నుంచి దీని గురించి చెప్తున్నాను. కానీ, ముంబయి ఎయిర్ పోర్టులో నన్ను ఆపేసిన తర్వాత ఈడీ నుంచి నాకు మెయిల్ ద్వారా సమన్లు అందాయి’’ అని రానా ఆయుబ్ ట్వీట్ చేశారు. 

గత ఫిబ్రవరిలో ఈడీ రానా ఆయూబ్‌కు చెందిన రూ.1.77 కోట్లను సీజ్ చేసింది. ఆమె చేపట్టిన మూడు సహాయ కార్యక్రమాలకు వచ్చిన విరాళాన్ని ఆమె సరైన ప్రయోజనం కోసం ఉపయోగించలేదని ఈడీ అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకుంది. హిందూ ఐటీ సెల్‌ అనే ఎన్జీవోకు చెందిన వికాస్ సాంక్రుత్యన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు పెట్టారు. 

పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. మురికివాడలు, రైతుల కోసం ఏప్రిల్-మే 2020లో విరాళాలు సేకరణ చేపట్టారు. జూన్ - సెప్టెంబరు 2020 కాలంలో అసోం, బిహార్, మహారాష్ట్రల్లో సహాయ కార్యక్రమాల కోసం విరాళాలకు పిలుపునిచ్చారు. 2021 మే, జూన్ సమయంలో కరోనా ప్రభావిత వ్యక్తులకు సాయం చేసేందుకు కూడా నిధులు సేకరించారు. ‘‘ఈ మొత్తం జమ అయిన రూ.2,69,44,680 లను Ketto అనే క్రౌడ్ ఫండ్ రైజింగ్ లేదా మెడికల్ ఫండ్ రైజింగ్ సంస్థ ద్వారా సేకరించారు. ఈ నిధులను రానా ఆయూబ్ తన సోదరి, తండ్రి బ్యాంకు ఖాతాల ద్వారా బయటకు తీశారు. వీటిలో రూ.72,01,786 సొమ్మును సొంత బ్యాంకు ఖాతా ద్వారానే విత్ డ్రా చేశారు. మరో రూ.37,15,072 నిధులను తన సోదరి ఇఫ్ఫత్ షేక్ అకౌంట్ నుంచి డ్రా చేశారు. తండ్రి మహ్మద్ ఆయూబ్ వాకీఫ్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.1,60,27,822 డబ్బులు డ్రా చేశారు.’’ అని ఎఫ్ఐఆర్‌లో ఉంది.

ఈ నిధులను సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లుగా రానా ఆయూబ్ కొన్ని సంస్థల పేరిట నకిలీ బిల్లులు సృష్టించారని ఎఫ్ఐఆర్‌లో ఉంది. వ్యక్తిగతంగా చేసిన పర్యటనలను కూడా సహాయ కార్యక్రమాల ఖర్చులో లెక్కగట్టారని ఎఫ్ఐఆర్‌లో వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Guntakal TDP MLA Candidate Gummanur Jayaram Intevriew | ఎమ్మెల్యేగానే ఉండాలని ఉంది అందుకే పార్టీ మారాHardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
IMD: దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్
దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Thota Trimurtulu : తోట త్రిమూర్తులు జైలు శిక్షపై స్టేకు హైకోర్టు నిరాకరణ - పోటీ చేయడానికి అర్హత ఉంటుందా ?
తోట త్రిమూర్తులు జైలు శిక్షపై స్టేకు హైకోర్టు నిరాకరణ - పోటీ చేయడానికి అర్హత ఉంటుందా ?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Embed widget