అన్వేషించండి

Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !

Manoj: మంచు విష్ణు, వినయ్ నుంచి ప్రామహాని ఉందని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మొత్తం ఏడు పేజీలతో ఆయన చేసిన ఫిర్యాదులో సంచలన విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Manchu Manoj Police complaint: మంచు వారసుల మధ్య నిప్పులు చల్లారడం లేదు. ఎవరు వారి మధ్య పచ్చగడ్డి వేస్తున్నారో కానీ ఎప్పటికప్పుుడు భగ్గుమంటూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణుతో పాటు వినయ్ మహేశ్వరి తన ప్రాణాలకు హాని తలపెట్టేలా కుట్రలు చేస్తున్నారని .. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు ఇచ్చారు. 

పోలీసులకు ఏడు పేజీల ఫిర్యాదు లేఖ ఇచ్చిన మనోజ్                 

ఈ ఏడు పేజీల ఫిర్యాదులో  మంచు విష్ణు తనపై చేసిన దాడులు, కుట్రలకు సంబంధించిన వివరాలన్నీ పొందు పరిచినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తాను కుటుబంతో సహా ఇంట్లో ఉన్న సమయంలో ఇంటికి విద్యుత్ ను నియంత్రించే ఇన్వర్టర్ జనరేటర్ లో  పంచదారు పోశారని తద్వారా షార్ట్ సర్క్యూట్ వంటి ఘటనలు జరిగి మొత్తం కుటుంబానికి హాని చేసే ప్రయత్నం చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. అయితే ఆయన తర్వాత రోజు తన భార్య మౌనిక తల్లి శోభానాగిరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆళ్లగడ్డ వెళ్లారు. అప్పుడు ఫిర్యాదు చేయలేదు. 

Also Read:  ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !

మనోజ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులకు మంచు నిర్మల లేఖ                  

ఆయన ఆళ్లగడ్డలో ఉన్న సమయంలోనే మంచు మనోజ్ తల్లి నిర్మల పోలీసులకు ఓ లేఖ రాశారు. మంచు మనోజ్ చేసిన ఫిర్యాదు తప్పుడుదని.. మంచు విష్ణు అలాంటి పంచదార ఏదీ ఇంటికి తీసుకు రాలేదన్నారు. తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేయడానికి కేకును మాత్రమే తీసుకు వచ్చాడని తెలిపారు. ఆ ఇంట్లోకి రావడానికి మనోజ్ కు ఎంత హక్కు ఉందో.. విష్ణుకుకూడా అంతే ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అప్పటికీ మంచు మనోజ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఆ లేఖ విషయాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. 

Also Read: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?

అరెస్టు భయంతో ఆజ్ఞాతంలో మంచు మోహన్ బాబు          

తాజాగా మంచు మనోజ్ చేసిన ఫిర్యాదు హైలెట్ అవనుంది. విష్ణుతో పాటు ఆయన వ్యాపార భాగస్వామిగా ఉన్న వినయ్ మహేశ్వరి పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మరింది. మోహన్ బాబు అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఇరవై నాలుగో తేదీ తర్వాత ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న ఉద్దేశంతో ఆయన ఆజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆయన పిల్లలు మాత్రం ఇలా పోలీసులకు ఫిర్యాదులు చేసుకుటూ పోరాటం కొనసాగిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget