News
News
X

రైలు ప్రయాణికులు ఈ యాప్ వాడితే జాగ్రత్త! డార్క్ వెబ్‌లో అమ్మకానికి డేటా !

రైల్ యాత్రి యాప్ హ్యాకింగ్ తర్వాత యూజర్ల భద్రత ప్రమాదంలో పడింది. యాప్ నుంచి 3.1 మిలియన్ డేటా పాయింట్ల సెట్‌ను హ్యాకర్లు ఆన్ లైన్ సేల్ కోసం ఉంచారు.

FOLLOW US: 
Share:

సైబర్ హ్యాకర్లు రైల్ యాత్రి యాప్ ను టార్గెట్ చేశారు. రైల్ యాత్రి యాప్ యూజర్ల డేటాను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇందులో యూజర్ల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు, వారి లొకేషన్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ డేటాను డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టారు. సైబర్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు చెందిన యాప్ రైల్ యాత్రి. ఇది టికెట్లను బుక్ చేయడానికి, వారి పిఎన్ఆర్ స్టేటస్‌ తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా భారతదేశంలో రైలు ప్రయాణానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు ఈ యాప్‌ను వినియోగదారులు యూజ్ చేస్తుంటారు. 

ఓ అంచనా ప్రకారం... రైల్ యాత్రి నుంచి 3 మిలియన్ల మంది డేటాను చోర చేశారు హ్యాకర్లు. దీన్ని డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉంచారు. ఈ విషయాన్ని ఓ హ్యాకర్ తెలియజేశాడు. డిసెంబర్‌ 3న డేటాను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ పేర్కొన్నాడు. యూనిట్ 1 డేటా పేరుతో డార్క్‌వెబ్‌లో పెట్టిన ఈ లింక్‌ ద్వారా డేటా కొనుగోలుకు తమను సంప్రదించాలని వివరించాడు.  

ముఖ్యంగా ఫోన్ నంబర్ల వంటి డేటా ఇతరుల చేతికి చిక్కితే ప్రమాదమంటున్నారు నిపుణులు. దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు.  పోలీసు అధికారులుగా నటిస్తూ సెక్స్ రాకెట్లు, పార్ట్ టైమ్ పేరుతో మోసాలు, ఆర్థిక మోసాలకు సైబర్‌ నేరగాళ్లు పాల్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఉపయోగించి నకిలీ డాక్యుమెంట్లు కూడా సృష్టించవచ్చని హెచ్చరిస్తున్నారు. .

డేటా పాయింట్ అనేది వినియోగదారుల పేర్లు, ఇమెయిల్ ఐడిలు, చిరునామాలు మరియు ఫోన్ నంబర్లను కలిగి ఉన్న ఓరకమైన డేటా. డేటా లీకేజీపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ రైల్వే అధికారి తెలిపారు. డేటా లీక్ వార్తలను పరిశీలిస్తున్నామన్నారు. గూగుల్ ప్లే స్టోర్ ప్రకారం, ఈ యాప్‌ను ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు.

మొత్తం డేటాలో 12 గిగాబైట్లకుపైగా డేటాను అమ్మకానికి ఉంచారు. మొత్తం 3,10,62,673 డేటా పాయింట్లు ఉన్నాయని ఫోరంలో పోస్ట్ పేర్కొంది. యూనిట్ 12 ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేస్తోందని, ఆగస్టు 33, 82 నుంచి బ్రీచ్ ఫోరంలో సభ్యురాలిగా ఉందని అందులో చెప్పిన బయో ప్రకారం తెలుస్తోంది. 

Published at : 20 Feb 2023 08:31 AM (IST) Tags: Railyatri APP Dark Web Forum Personal Information

సంబంధిత కథనాలు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Watch Video: దీన్నెవరైనా రోడ్డు అంటారా? మరీ అంత జోక్‌గా ఉందా? - రోడ్ కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్ - వైరల్ వీడియో

Watch Video: దీన్నెవరైనా రోడ్డు అంటారా? మరీ అంత జోక్‌గా ఉందా? - రోడ్ కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్ - వైరల్ వీడియో

XBB.1.16 Covid Variant: ఢిల్లీలో కరోనా కలవరం, ఆ వేరియంట్‌ వ్యాప్తితో మళ్లీ గుబులు - కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

XBB.1.16 Covid Variant: ఢిల్లీలో కరోనా కలవరం, ఆ వేరియంట్‌ వ్యాప్తితో మళ్లీ గుబులు - కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

టాప్ స్టోరీస్

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్