అన్వేషించండి

IRCTC Good News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, ఇకపై వెయిటింగ్ టికెట్ కన్ఫర్మేషన్‌పై రైల్వే కొత్త రూల్!

New rule for waiting ticket passengers IRCTC : రైల్వే వెయిటింగ్ టికెట్ నిబంధనలు త్వరలో మారనున్నాయి. ప్రయాణికులకు 4 గంటల ముందే తెలిసే స్టేటస్, చాలా ముందుగానే బుక్ చేసిన వారికి తెలియనుంది.

Indian Railways : భారతదేశంలో సామాన్యుడి వాహనంగా ప్రయాణాలలో రైళ్లను ప్రిఫర్ చేస్తుంటారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తారు. ఈ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ వేలాది రైళ్లను, కుంభమేళా, తీర్థయాత్రలు లాంటి సందర్భాలలో, సమ్మర్ స్పెషల్ రైళ్లను సందర్భాన్ని బట్టి  నడుపుతోంది. రైలులో ప్రయాణించేవారు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని ప్రయాణించాలని భావిస్తారు. రిజర్వేషన్ కోచ్‌లలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది. అసలే రైల్వేశాఖ టికెట్ బుకింగ్ కోసం జులై 1 నుంచి కొత్త రూల్స్ ప్రకటించింది.  

రైలు ప్రయాణాల కోసం కొన్నిసార్లు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత టికెట్ కన్ఫామ్ కాదు. చాలా మంది ప్రయాణికుల టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటాయి. దాంతో ప్రయాణికులు తమ టికెట్ కన్ఫామ్ కోసం ఎదురు చూస్తుంటారు. టికెట్ కన్ఫర్మేషన్ రైలు ఫైనల్ సీట్ చార్ట్ తయారు చేసిన తర్వాత, అంటే రైలు బయలుదేరే 4 గంటల ముందు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు రైల్వే వెయిటింగ్ టికెట్ రూల్స్‌లో మార్పులు చేయబోతోంది. దాంతో నాలుగు గంటల ముందు కాదు, చాలా ముందుగానే మీకు వెయిటింగ్ టికెట్ స్టేటన్ తెలిసిపోతుంది..

24 గంటల ముందు వెయిటింగ్ టికెట్ స్థితి తెలుస్తుంది

ప్రస్తుతం రైలులో ప్రయాణించే ప్రయాణికులు రైలు బయలుదేరే 4 గంటల ముందు తమ టికెట్ స్టేటస్ తెలుసుకుంటారు. దీనివల్ల చాలా మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాన్ని ఎంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో ముందే తెలిస్తే, ప్రయాణికులు బస్సు లేదా ఇతర వాహనాలలో జర్నీ చేయడానికి వీలుంటుంది.  

Also Read: తత్కాల్ టికెట్ బుక్ చేస్తుంటారా! జూలై 1 నుంచి అమలులోకి IRCTC కొత్త రూల్స్

వెయిటింగ్ టికెట్ రూల్స్ కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చనున్నారు. రైల్వే శాఖ త్వరలో వెయిటింగ్ టికెట్ స్టేటస్ ముందుగానే ప్యాసింజర్‌కు తెలిసేలా రూల్స్ మార్చుతున్నారు. భారత రైల్వే నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఇకపై 4 గంటల ముందు కాదు, ప్రయాణికులకు 24 గంటల ముందే టికెట్ వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ గురించి సమాచారం అందుతుంది. దీనివల్ల ప్రయాణికులు టికెట్ కన్ఫామ్ అవ్వకపోతే ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాన్ని ఎంచుకోవడానికి సమయం దొరుకుతుంది. దాంతో వారికి ఏ ఇబ్బంది ఉండదు. 

ట్రయల్ పూర్తి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఈ కొత్త రూల్ అమలు చేయడానికి ఇటీవల బికనీర్ రైల్వే డివిజన్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. రైల్వే శాఖ చేసిన ట్రయల్ సక్సెస్ అయింది. త్వరలో ఈ రూల్ దేశంలోని అన్ని రైల్వే జోన్లలో అమలు చేయనున్నారు. అయితే, ఈ కొత్త రూల్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రైల్వే శాఖ అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే, ఢిల్లీ, ముంబైతో సహా దేశంలోని అనేక ప్రధాన రైలు మార్గాల్లో త్వరలో వెయిటింగ్ టికెట్ కొత్త రూల్ అమలు చేయబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

Also Read: Tatkal Ticket Booking: ఐఆర్‌సీటీసీ ఖాతా రద్దు కావచ్చు! తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం రైల్వే కొత్త రూల్, ఆధార్‌ వెరిఫికేషన్ అవసరం

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Embed widget