అన్వేషించండి

జగన్‌తోపాటు వాళ్లు ఇచ్చిన డబ్బుతోనే బిహార్‌లో పాదయాత్ర- స్వయంగా చెప్పిన ప్రశాంత్‌ కిషోర్‌

జన్ సూరాజ్‌ క్యాంపెయిన్‌ పేరుతో చేస్తున్న యాత్ర ఇప్పడు బిహార్‌ రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండో- నేపాల్‌ బోర్డర్‌లోని వాల్మీకి నగర్‌లో కొనసాగుతోంది.

'జన్ సూరాజ్ క్యాంపెయిన్' పేరుతో బిహార్‌లో  యాత్ర చేస్తున్న రాజకీయ వ్యూహకర్త చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. బిహార్‌లో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలని సంకల్పించిన ప్రశాంత్‌ కిషోర్‌ అక్కడ యాత్ర చేస్తున్నారు. తన పార్టీ పూర్తి స్థాయి పార్టీగా ఆవిర్భవించే సరికి రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రజల అవసరాలు తెలుసుకోవాలని లక్ష్యంతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు. 

జన్ సూరాజ్‌ క్యాంపెయిన్‌ పేరుతో చేస్తున్న యాత్ర ఇప్పడు బిహార్‌ రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండో- నేపాల్‌ బోర్డర్‌లోని వాల్మీకి నగర్‌లో కొనసాగుతోంది. అక్కడ మీడియాతో మాట్లాడిన పీకే... పలు ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. తన ఆర్థిక మూలలపై వస్తున్నా ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. 

కిషోర్ అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తున్నారు. తన క్యాంపెయిన్‌ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా పరిణామం చెందకముందే తన సొంత రాష్ట్రంలోని ప్రతి మూలను తాకుతూ 3,500 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు బీజేపీ స్పాన్సర్‌ చేస్తోందని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్ సింగ్ ఆరోపించారు. 

పీకే పాదయాత్రకు ఆర్థికంగా బీజేపీ సహాయపడుతుందని రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన ప్రశాంత్ కిషోర్‌... తన సేవలు వినియోగించుకున్న పాత క్లయింట్లు ఇప్పుడు తనకు సహాయం చేస్తున్నారని అన్నారు. IPAC వ్యవస్థాపకుడిగా తాను పది ఎన్నికలకు పని చేశానని గుర్తు చేశారు. అందులో యూపీ మినహా అన్ని ఎన్నికల్లో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. 
"గత ఒక దశాబ్దంలో, నేను కనీసం 10 ఎన్నికలకు నా సేవలను అందించాను. ఒకదానిలో మినహా అన్నింటిలో విజయం సాధించాను" అని 2017 UP అసెంబ్లీ ఎన్నికలను గుర్తుచేసుకున్నాడు, అందులో తన సలహాలు సరిగా వాడుకోలేదన్నట్టు మాట్టాడారు. 

"నేను గెలవడానికి సహాయం చేసిన కనీసం ఆరుగురు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మీడియా నన్ను నమ్మకపోయినా నేను వారి నుంచి డబ్బు తీసుకోలేదు. కానీ ఇప్పుడు బిహార్‌లో మేము చేస్తున్న ప్రయోగానికి నేను వారి సహాయం కోరుతున్నాను" అని పీకే అన్నారు. 2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి పీకే ఫేమస్‌ అయ్యారు. 

అప్పటి నుంచి చాలా రాష్ట్రాల్లో పార్టీ ఆయన సేవలు వినియోగించుకుంటున్నాయి. ఇప్పటికి కూడా పీకే స్థాపించిన ఐప్యాక్‌ ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు పని చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపులో ప్రశాంత్‌ కిశోర్ చాలా కీలక పాత్ర పోషించారు. పశ్చిమబెంగాల్‌లో మమతు, తమిళనాడులో స్టాలిన్‌ విజయం వెనుక పీకే ఉన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి సంచలన విజయాన్ని అందించిన తర్వాత రాజకీయ కన్సల్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మధ్య టీఆర్‌ఎస్‌తో కూడా IPAC ఒప్పందం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత వాళ్ల మధ్య ఆ బాండ్‌ బ్రేక్ అయిందని కూడా సమాచారం ఉంది కానీ ఇరు వర్గాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Home Birth Tragedy: చచ్చినా ఇన్‌ఫ్లూయన్సర్ల మాటలు నమ్మొద్దు - నమ్మితే చచ్చిపోతారు - ఇదిగో భయంకర ఘటన
చచ్చినా ఇన్‌ఫ్లూయన్సర్ల మాటలు నమ్మొద్దు - నమ్మితే చచ్చిపోతారు - ఇదిగో భయంకర ఘటన
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget