అన్వేషించండి

PM Viksit Bharat Rozgar Yojana: ప్రధాని మోదీ కొత్త పథకం: ఉద్యోగం పొందిన వారికి, కంపెనీలకు భారీ లబ్ధి!

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభమైందంటూ ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రకటన చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతతో పాటు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది.

PM VBRY Eligibility : ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభమైందంటూ ప్రధాని మోదీ 79వ స్వాతంత్ర్య వేడుక సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రకటన చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతతో పాటు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది. అయితే, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అర్హతలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అర్హతలు ఇవే...

ఈ పథకం అటు కొత్తగా ఉద్యోగం పొందిన వారికి, ఇటు కొత్తగా ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు వర్తిస్తుంది.

ఉద్యోగులు లబ్ధి పొందడానికి కావాల్సిన అర్హతలు

  1. ప్రైవేట్ రంగంలో మొదటిసారిగా ఉద్యోగం పొందాలి.

  2. నెలవారీ జీతం రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.

  3. ఉద్యోగం పొందిన సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.

  4. 2025 ఆగస్టు 1 లేదా ఆ తర్వాత EPFOలో మొదటిసారిగా ఉద్యోగం పొందిన వ్యక్తి సభ్యుడిగా చేరి ఉండాలి.

పై అర్హతలు ఉన్న ఉద్యోగికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకం కింద గరిష్టంగా రూ. 15,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.

కొత్తగా ఉద్యోగాలను కల్పించే ప్రైవేట్ కంపెనీలకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకం వర్తిస్తుంది.

కంపెనీలకు ఉండాల్సిన అర్హతలు ఇవే

  1. 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరు కొత్త ఉద్యోగులను నియమించుకోవాలి. అప్పుడే ఈ పథకం వర్తిస్తుంది.

  2. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురు కొత్త ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుంది.

కంపెనీలకు పై అర్హతలు ఉంటేనే ఈ పథకం కింద ప్రతి కొత్త ఉద్యోగి పేరున నెలకు రూ. 3,000 వరకు ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకానికి అర్హులైన వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటికే ఉన్న EPFO వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. పై అర్హతలు ఉన్న ఉద్యోగి, ఈ పథకం వర్తించే కంపెనీలో ఉద్యోగిగా చేరితే, మీరు ఆ పథకానికి అర్హులా కాదా అనేది ఆటోమేటిక్‌గా నిర్ణయం జరిగిపోతుంది. అర్హత ఉన్న ఉద్యోగులకు ప్రకటించిన ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది. బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానించబడి ఉండాల్సి ఉంటుంది. అదే రీతిలో, కంపెనీలు తమ ఉద్యోగుల వివరాలను EPFO పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివరాల తనిఖీ అనంతరం, ఈ పథకం ద్వారా లభించే ప్రోత్సాహక మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ఈ పథకం ద్వారా యువతలో ఉపాధిని పెంచడం కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి ఈ పథకం ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. రానున్న రెండేళ్లలో ఈ పథకం ద్వారా 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలన్న లక్ష్యంతో ఉంది.  అంతే కాకుండా కంపెనీలు కొత్త ఉద్యోగులకు అవకాశాలు కల్పించడాన్ని ప్రోత్సహించేలా ఈ పథకం రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget