అన్వేషించండి

PM Viksit Bharat Rozgar Yojana: ప్రధాని మోదీ కొత్త పథకం: ఉద్యోగం పొందిన వారికి, కంపెనీలకు భారీ లబ్ధి!

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభమైందంటూ ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రకటన చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతతో పాటు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది.

PM VBRY Eligibility : ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభమైందంటూ ప్రధాని మోదీ 79వ స్వాతంత్ర్య వేడుక సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రకటన చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతతో పాటు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది. అయితే, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అర్హతలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అర్హతలు ఇవే...

ఈ పథకం అటు కొత్తగా ఉద్యోగం పొందిన వారికి, ఇటు కొత్తగా ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు వర్తిస్తుంది.

ఉద్యోగులు లబ్ధి పొందడానికి కావాల్సిన అర్హతలు

  1. ప్రైవేట్ రంగంలో మొదటిసారిగా ఉద్యోగం పొందాలి.

  2. నెలవారీ జీతం రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.

  3. ఉద్యోగం పొందిన సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.

  4. 2025 ఆగస్టు 1 లేదా ఆ తర్వాత EPFOలో మొదటిసారిగా ఉద్యోగం పొందిన వ్యక్తి సభ్యుడిగా చేరి ఉండాలి.

పై అర్హతలు ఉన్న ఉద్యోగికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకం కింద గరిష్టంగా రూ. 15,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.

కొత్తగా ఉద్యోగాలను కల్పించే ప్రైవేట్ కంపెనీలకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకం వర్తిస్తుంది.

కంపెనీలకు ఉండాల్సిన అర్హతలు ఇవే

  1. 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరు కొత్త ఉద్యోగులను నియమించుకోవాలి. అప్పుడే ఈ పథకం వర్తిస్తుంది.

  2. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురు కొత్త ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుంది.

కంపెనీలకు పై అర్హతలు ఉంటేనే ఈ పథకం కింద ప్రతి కొత్త ఉద్యోగి పేరున నెలకు రూ. 3,000 వరకు ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకానికి అర్హులైన వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటికే ఉన్న EPFO వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. పై అర్హతలు ఉన్న ఉద్యోగి, ఈ పథకం వర్తించే కంపెనీలో ఉద్యోగిగా చేరితే, మీరు ఆ పథకానికి అర్హులా కాదా అనేది ఆటోమేటిక్‌గా నిర్ణయం జరిగిపోతుంది. అర్హత ఉన్న ఉద్యోగులకు ప్రకటించిన ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది. బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానించబడి ఉండాల్సి ఉంటుంది. అదే రీతిలో, కంపెనీలు తమ ఉద్యోగుల వివరాలను EPFO పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివరాల తనిఖీ అనంతరం, ఈ పథకం ద్వారా లభించే ప్రోత్సాహక మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ఈ పథకం ద్వారా యువతలో ఉపాధిని పెంచడం కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి ఈ పథకం ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. రానున్న రెండేళ్లలో ఈ పథకం ద్వారా 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలన్న లక్ష్యంతో ఉంది.  అంతే కాకుండా కంపెనీలు కొత్త ఉద్యోగులకు అవకాశాలు కల్పించడాన్ని ప్రోత్సహించేలా ఈ పథకం రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
Sonam Wangchuk: సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
Raghav Chadha On Menstrual Health: మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget