By: ABP Desam | Updated at : 22 Apr 2022 01:09 PM (IST)
Edited By: Murali Krishna
యూకే ప్రధానితో మోదీ భేటీ
UK PM Boris Johnson India Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన యూకే ప్రధాని బోరిస్ జాన్సన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్కు బోరిస్ను సాదరంగా మోదీ ఆహ్వానించారు.
ద్వైపాక్షిక భేటీ
#WATCH | Delegation-level talks between PM Modi and British PM Boris Johnson are underway at Hyderabad House in Delhi pic.twitter.com/UyM3SqsV0A
— ANI (@ANI) April 22, 2022
ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ హౌస్లో ఇద్దరూ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉక్రెయిన్ తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు సమాచారం.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు సహా భారత్లో పెట్టుబడులు, బ్రిటన్లోని భారతీయులకు వీసాల సడలింపు వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
భారత్లో ఆర్ధిక నేరాలకు పాల్పడి పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారిని అప్పగించడంపై కూడా చర్చ జరిగిందని సమాచారం.
#WATCH Prime Minister Narendra Modi and British PM Boris Johnson hold talks at Delhi's Hyderabad House
— ANI (@ANI) April 22, 2022
(Source: DD) pic.twitter.com/AlMBrLLB1f
విదేశాంగ మంత్రితో
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా సమావేశమయ్యారు. అంతకుముందు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాష్ట్రపతి భవన్లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు అద్భుత స్వాగతం పలికినందుకు మోదీకి బ్రిటన్ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
"భారత్- యూకే మధ్య పరిస్థితులు ఇంతకముందు కంటే ఇప్పుడు మరింత బలంగా ఉన్నాయి" అని బోరిస్ జాన్సన్ అన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైందని బ్రిటన్ ప్రధాని అభిప్రాయపడ్డారు.
Also Read: Covid Tally: దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి- కొత్తగా 2451 కేసులు
Also Read: Gujrat Drugs: గుజరాత్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం! విలువ ఏకంగా రూ.2 వేల కోట్లు
కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్, డిగ్రీ అర్హతతో 444 ఉద్యోగాల భర్తీ
Article 370: అసలేంటీ 'ఆర్టికల్ 370' - ఎందుకు రద్దు చేశారు.?, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏం జరిగిందంటే.?
Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ నియామకం, ఉత్కంఠకు తెర
Metro Ticket For 5 Rupees: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - రూ.5కే మెట్రో టికెట్
Article 370 Abrogation: ఆర్టికల్ 370 రద్దుపై 'సుప్రీం' తీర్పు - చారిత్రాత్మకమంటూ ప్రధాని మోదీ హర్షం
Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు
YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్కు బాధ్యతలు !
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన
Highest Selling Hatchback Cars: నవంబర్లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్బాక్లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!
/body>