అన్వేషించండి

Delhi Election: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 - వేదికపై బీజేపీ అభ్యర్థి పాదాలను 3 సార్లు తాకిన ప్రధాని - వీడియో వైరల్

Delhi Election: ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కరవాల్ నగర్ స్థానంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ అభ్యర్థి, మోదీ పాదాలను తాకారు. ఆ తర్వాత మోదీ 3 సార్లు అతని పాదాలను తాకిన వీజియో వైరల్ గా మారింది.

Delhi Election: ఢిల్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. కరవాల్ నగర్ స్థానంలో ర్యాలీ నిర్వహించిన ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ర్యాలీలో భాగంగా హాజరైన ప్రధాని వేదికపైకి రాగానే, పట్‌పర్‌గంజ్ స్థానం నుంచి పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి మోదీ పాదాలను తాకారు. ఆ తర్వాత ప్రధాని, రవీంద్ర నేగి పాదాలను మూడుసార్లు తాకారు. నిజానికి ఈ ఘటనతో అక్కడున్న నేతలు ఆశ్చర్యపోయారు. దీంతో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నేగి కాస్త అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

రవీంద్ర సింగ్ నేగి ఎవరంటే..

బీజేపీకి చెందిన రవీంద్ర సింగ్ నేగి ఢిల్లీలో జరిగిన గత ఎన్నికల్లో పట్‌పట్‌గంజ్ సీటు కోసం పోటీ చేశారు. ఈ స్థానంలో ఆప్ పార్టీ నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియాకు గట్టి పోటీ ఇచ్చారు. అతికష్టం మీద మనీష్ సిసోడియా ఈ స్థానాన్ని గెలుచుకోగలిగారు. ఈ సారి ఆప్ నుంచి విద్యావేత్త అవధ్ ఓజాకు ఈ స్థానం నుంచి టిక్కెట్టు ఇవ్వగా.. నేగి జంగ్‌పురా ఆయనపై పోటీ చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రవీంద్ర సింగ్ నేగి ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా.. వినోద్ నగర్ వార్డు-198కి చెందిన కౌన్సిలర్ గా ఉన్నారు. వినోద్ నగర్ వార్డు పట్‌పట్‌గంజ్ అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన నేగి..  సిసోడియా గట్టి పోటీ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఆర్ఆర్ఆర్ లోనూ నేగికి మంచి పట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఆయన విస్తారక్ వంటి అనేక ముఖ్యమైన పదవులకు బాధ్యతలు వహించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం

ఢిల్లీలోని ఘోండా నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్‌ సర్కారు పోయి, బీజేపీ సర్కారు వస్తుందని, తానొక్కడే కాదు యావత్‌ ఢిల్లీ ప్రజానికం కూడా అదే అంటున్నారన్నారు.గత 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని మోదీ విమర్శించారు. అబద్దపు హామీలను ఇప్పుడు ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పారు. ఈ క్రమంలోనే బీజేపీ విడుదల చేసిన మేనిఫోస్టోను మోదీ మెచ్చుకున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా మేనిఫెస్టో ఉందని చెప్పారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్

ఢిల్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పాటు, మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సాయం ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు ఇచ్చే పెన్షన్ ను రూ.5వేలకు పెంచుతామని చెప్పింది. యువత కోసం ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఒక ఏడాది అప్రెంటిస్ షిప్, నెలకు రూ.8,500 స్టైఫండ్ ఇస్తామని మేనిఫెస్టో లో తెలిపింది.

Also Read : Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!

టాప్ హెడ్ లైన్స్

IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Noida Mamura Village Fire: చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
E20 Petrol Problems: E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్త వ్యతిరేకత - కేంద్రం తొందరపడిందా?
E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్త వ్యతిరేకత - కేంద్రం తొందరపడిందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget