By: ABP Desam | Updated at : 16 Apr 2022 07:01 PM (IST)
Prime Minister Narendra Modi unveils a 108 ft statue of Lord Hanuman in Gujarat. (Video Screenshots: YouTube/BJP)
మేకిన్ ఇండియా అనే కార్యక్రమం చేపట్టి దిగుమతలు పూర్తిగా తగ్గించుకుని ఇండియాకు అవసరమైన వస్తువుల్ని ఇండియాలోనే ఉత్పత్తి చేయాలనే ఆలోచనను ప్రధాని మోదీ ఎప్పుడో అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అందులో ఎంత వరకు సక్సెస్ అయ్యామో స్పష్టత లేదు కానీ దాని వల్ల చాలా లాభాలుంటాయని ప్రధాని మోదీ చెబుతున్నారు. తాజాగా మరోసారి అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గుజరాత్లోని మోర్బిలో 108 అడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. అందులో యువత.. నిరుద్యోగితపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ - అందరూ అర్హులే ! ఆ రాష్ట్ర ప్రజలకు పండగే
మన ప్రజలు తయారు చేసిన వస్తువులనే మన ఇళ్లల్లో ఉపయోగిస్తే.. అప్పుడు ఎంత ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందో ఊహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ ఉత్పత్తులనే మనం ఎక్కువగా ఇష్టపడొచ్చు. కానీ, ఆ వస్తువుల్లో మన మాతృభూమి పరిమళాలు ఉండవన్నారు. వచ్చే 25 ఏళ్లలో మనం గనుక కేవలం స్థానిక ఉత్పత్తులనే వినియోగిస్తే.. దేశంలో నిరుద్యోగం అనేదే ఉండదని స్పష్టం చేశారు. ప్రపంచం అంతా ఆత్మనిర్భరత వైపు చూస్తోందని.. బారత్ కూడా అన్ని అంశాల్లోనూ స్వావలంబ కోసం ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం దేశ ప్రజలందరి సహకారం అవసరమన్నారు. ప్రజలంతా స్థానికంగా తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశంలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.
నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ - ఒక్క చోటా గెలవలేదు !
మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ముందుకు సాగాలని మోదీ అన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సాధువులు హాజరు కావడంతో వారికీ మోదీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సాధువులను కోరుకునేది ఒక్కటేనని కేవలం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు బోధించండని సూచించారు. దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటారు. కేవలం స్వదేశీ వస్తువులే కొనుగోలు చేస్తే ప్రజలందరికీ ఉపాధి లభిస్తుందని... లెక్కలతో సహా చెబుతూ ఉంటారు. ప్రధాని మోదీ ఇదే విషయాన్ని చెప్పినట్లుగా ఉన్నారు.
సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ ! కాంగ్రెస్లో చేరుతారా ? వ్యూహకర్తగా సేవలందిస్తారా ?
అయితే బారత ప్రభుత్వం ఎంత ఆత్మనిర్భరత ప్రచారం చేసినా దిగుమతులు మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి . అదే సమయంలో భారత్లో తయారీ కూడా ఉద్యమంలా మారుతోంది. కానీ పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్లుగా పెరగడం లేదు.
Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ
Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
Russia Ukraine War : ఉక్రెయిన్పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు