By: ABP Desam | Updated at : 16 Apr 2022 06:41 PM (IST)
పంజాబ్లో ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్
అక్కడ కులం చూడరు. మతం చూడరు. మూడు వందల కన్నా ఎక్కువ యూనిట్లు కరెంట్ వాడతారా లేదా అన్నది చూడరు . అంతకు మించి అర్హతల పేరుతో లబ్దిదారులను తగ్గించే స్కీమ్ అసలు ఉండదు. పథకానికి అందరూ అర్హులే. ఆ పథకం ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల కరెంట్ ఉచితం. ఎన్నికల హామీగా ఆమ్ ఆద్మీ ఇచ్చింది. అధికారం చేపట్టిన నెలలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అమలు చేయడం ప్రారంభించారు.
నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ - ఒక్క చోటా గెలవలేదు !
పంజాబ్లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులైన సందర్భంగా ప్రజలకు ఆప్ సర్కారు శుభవార్త వినిపించింది. జులై 1 నుంచి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 92 చోట్ల విజయకేతనాన్ని ఎగురవేసింది. దీంతో మార్చి 16 న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ ! కాంగ్రెస్లో చేరుతారా ? వ్యూహకర్తగా సేవలందిస్తారా ?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ... రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆమ్ ఆద్మీ సర్కారు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తోంది. ఇక, ఎన్నికల్లో మరో ప్రధాన హామీ అయిన డోర్స్టెప్ రేషన్ డెలివరీ పథకాన్ని సిఎం గత నెలలో అమల్లోకి తెచ్చారు.
మహిళల వివాహ వయసు పెంచొద్దు - 95 శాతం మంది అభిప్రాయం ఇదేనా !?
పంజాబ్లో అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఇస్తున్నట్లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఏప్రిల్ 16 న రాష్ట్ర ప్రజలు మంచి వార్త వినబోతున్నారంటూ ఇటీవల ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ముందుగానే ప్రకటించారు. అన్నట్లుగానే ఉచిత విద్యుత్పై నేడు ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో మాన్ ఇటీవల సమావేశమై దీనిపై చర్చించి నిర్ణయించారు. పంజాబ్ విద్యుత్ రంగంలో ఎంతో ముందు ఉంది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి.
Bharat Bandh : సీపీఎస్ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్తో భారత్ బంద్
Qutub Minar Hearing: హిందూ, జైన దేవాలయాల పునరుద్ధరణపై వాదనలు పూర్తి- తీర్పు జూన్9కి వాయిదా వేసిన దిల్లీ కోర్టు
Quad Summit 2022 : విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని ఇస్తుంది: ప్రధాని మోదీ
Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్లో మోదీతో బైడెన్
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్ఫ్లవర్ ఆయిల్ ధరపై..!