అన్వేషించండి

India Pakistan Attack News Live: ఉల్లంఘనలపై పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పండి, ఆర్మీకి కేంద్రం ఆదేశాలు

India Pakistan Attack News Live:శుక్రవారం నాడు, పాకిస్తాన్ మరోసారి భారతదేశంలోని వివిధ నగరాల్లో డ్రోన్ దాడులకు ప్రయత్నించింది, కానీ భారత సైన్యం ఆ డ్రోన్ దాడులను భగ్నం చేసింది.

Key Events
operation sindoor live update india pakistan attack s 400 pm modi shahbaz sharif PAHALGAM ATTACK India Pakistan Attack News Live: ఉల్లంఘనలపై పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పండి, ఆర్మీకి కేంద్రం ఆదేశాలు
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
Source : ABP Desam

Background

India Pakistan Attack News Live:ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమై, 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనలో ఉంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌లో చిందిన ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించారు. అదే సమయంలో, పాకిస్తాన్ సైన్యానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఇంటర్-సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డిజి అన్నారు.

ఇంతలో, గురువారం (మే 8, 2025)న, పాకిస్తాన్ సైన్యం అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్‌తో సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుని, PAK సైన్యం చేసిన అన్ని ప్రయత్నాలను విఫలం చేసింది.

భారత సైన్యం S-400 సుదర్శన్ చక్ర వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ ప్రణాళికలను భగ్నం చేసింది. సుదర్శన్ చక్ర వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ , భారత్‌ ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్ వాయు రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.

గురువారం రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం విఫలమైనందున, ఇస్లామాబాద్ లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రదేశాలలో 300 నుంచి 400 టర్కిష్ డ్రోన్‌లను ప్రయోగించిందని ప్రభుత్వం తెలిపింది.

శుక్రవారం రాత్రి, శ్రీనగర్ విమానాశ్రయంతో సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 26 ప్రదేశాల‌్లో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడిని భారతదేశం తిప్పికొట్టింది. వరుసగా మూడవ రాత్రి, పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈసారి, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది.

శ్రీనగర్‌లోని రక్షణ అధికారులు, దక్షిణ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయం, అవంతిపోరా వైమానిక స్థావరం సహా అనేక స్థావరాలపై డ్రోన్ దాడులను శుక్రవారం రాత్రి ఆలస్యంగా తిప్పికొట్టారని, జమ్మూ, దక్షిణ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపారు.

పాకిస్తాన్ నుంచి వైమానిక బెదిరింపులను ఊహించి సైరన్లు మోగించడం ప్రారంభించడంతో అనేక సరిహద్దు జిల్లాల స్థానికులకు ఇది వరుసగా రెండో భయానక రాత్రిగా మారింది, వీటిని సాయుధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.

శ్రీనగర్, జమ్మూ నుంచి పంజాబ్‌లోని అనేక జిల్లాలు , రాజస్థాన్‌లోని జైసల్మేర్, జోధ్‌పూర్ వరకు, సరిహద్దు ప్రాంతాలలోని పెద్ద ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి.. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు తమ ఇళ్లలో లైట్లు ఆపివేయాలని అధికారులు బహిరంగ ప్రకటనలు జారీచేశారు.

జమ్మూ, సాంబా జిల్లాల సుచేత్‌గఢ్, రామ్‌గఢ్ సెక్టార్లలో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్‌ బారీగా దాడులకు యత్నించింది. కాల్పులకు తెగబడింది.  అదే సమయంలో భారతదేశం కూడా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌కు చెందిన నాలుగు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వాటిపై దాడి చేసినట్టు పాకిస్థాన్‌ సైన్యం కూడా అంగీకరించింది. సరిహద్దుల్లో పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్ సైన్యానికి గట్టిగానే ఇండియన్ ఆర్మీ బుద్ది చెబుతోంది. 

23:18 PM (IST)  •  10 May 2025

India Pakistan Attack News Live: 'సైన్యానికి పూర్తి స్వేచ్ఛ' విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి సంచలన ప్రకటన  

India Pakistan Attack News Live: పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని, ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి అన్నారు. కఠినమైన చర్య తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు. దీనిపై ఇది నిఘా ఉంచుతోందన్నారు.

23:17 PM (IST)  •  10 May 2025

India Pakistan Attack News Live: ఉల్లంఘనలపై పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పండి, ఆర్మీకి కేంద్రం ఆదేశాలు  

India Pakistan Attack News Live: "గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారతదేశం, పాకిస్తాన్ DGMOల మధ్య ఒక అవగాహన కుదిరింది. గత కొన్ని గంటలుగా, ఈ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. భారత సైన్యం ఈ సరిహద్దు చొరబాటుకు ప్రతీకారం తీర్చుకుంటోంది.ఈ చొరబాటు ఖండించదగినది. దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాలి. ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని ఇలాంచి చర్యలను ఆపడానికి వెంటనే తగిన చర్య పాకిస్తాన్ ఈ తీసుకుంటుందదని విశ్వసిస్తున్నాము" అని మిస్రి అన్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget