Operation Sindoor Kills Terrorists: భారత ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతం!
భారత ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఉగ్రవాదుల స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి తరువాత పాకిస్తాన్, పీఓకేలోని 9 జేషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేయడం తెలిసిందే. జేషే మహ్మద్ గ్రూపునకు చెందిన కీలక ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు దాడి చేసి నాశనం చేశాయి.
యూరీ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జరిపి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. నియంత్రంణ రేఖ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ ఆర్మీ జరిపిన తాజా కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందారు. పాక్ సైన్యం కాల్పులను గమనించిన ఇండియన్ ఆర్మీ వెంటనే ప్రతిఘటించి ఎదురుకాల్పులు జరిపింది. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతిచెందినట్లు సమాచారం.
10 గంటలకు ఆపరేషన్ సింధూరపై వివరాలు వెల్లడించనున్నారు.
#OperationSindoor | Of the nine targets successfully hit by the Indian forces, four are in Pakistan and five in Pakistan-occupied Kashmir. The targets in Pakistan include Bahawalpur, Muridke and Sialkot. Special precision munitions were used to target the terror camps. The three… pic.twitter.com/8tEwuI9w77
— ANI (@ANI) May 6, 2025






















