అన్వేషించండి

Odisha Train Accident Report: ఒడిశా రైలు ప్రమాదానికి కారణాలు చెప్పేసిన కేంద్రం- కుట్ర కోణంపై క్లారిటీ

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన అత్యంత విషాదకర ఘటనకు కారణాలను కేంద్రం తొలిసారి వెల్లడించింది.  సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక వివరాలను విడుదల చేసింది.

గత జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన అత్యంత విషాదకర ఘటనకు కారణాలను కేంద్రం తొలిసారి వెల్లడించింది.  సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని వివరిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక వివరాలను విడుదల చేసింది. రాజ్యసభలో ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ప్రమాదం గురించి అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇస్తూ నివేదిక వివరాలు వెల్లడించింది. స్టేషన్‌ వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్ లోపాలను నివేదికలో పొందుపరిచారు. "గతంలో నార్త్ సిగ్నల్ గూమ్టీ స్టేషన్ వద్ద సిగ్నలింగ్-సర్క్యూట్-మార్పులో లోపాలు తలెత్తాయి. లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్. 94 వద్ద ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్‌ మార్పులు, సిగ్నలింగ్ పనులు చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని నివేదికలో కేంద్రం పేర్కొంది.

సాంకేతికతలో లోపాల కారణంగా రాంగ్ లైన్‌‌లో గ్రీన్ సిగ్నల్ పడిందని, ఫలితంగా ఆగి ఉన్న గూడ్స్ రైలు, మరో రైలు ఢీకొట్టిందని వెల్లడించింది. ఈ ప్రమాదం రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.  ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలభై ఒక్క మంది ప్రయాణికులను ఇంకా గుర్తించలేదని ప్రభుత్వం వెల్లడించింది. MP జాన్ బ్రిట్టాస్ రైలు ప్రమాదాల మీద ప్రశ్నించినా గత మూడు సంవత్సరాలలో ఇలాంటి సిగ్నల్ వైఫల్యాలపై ప్రభుత్వం వివరాలను అందించలేదు. కేవలం వైఫల్యాలు ఉన్నాయని మాత్రమే చెబుతోంది. కానీ ఏదీ బాలాసోర్‌లో జరిగినంత తీవ్రమైన సంఘటనకు దారితీయలేదు.

జులై ప్రారంభంలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ప్రమాదానికి సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులు అరుణ్ కుమార్ మహంత, మహమ్మద్ అమీర్ ఖాన్, పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది. హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, కుట్ర పూరిత హత్యా నేర అభియోగాలు వారిపై మోపారు. జూలై 15న రిమాండ్ కాలం ముగిసిన తర్వాత నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తదుపరి కేసు విచారణ జూలై 27కి వాయిదా వేశారు.

సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లోని బ్యాంక్‌రనాయబాజ్ స్టేషన్‌లో మే 16, 2022న వైరింగ్, కేబుల్ లోపం కారణంగా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. సరైన చర్యలు తీసుకోవడం ద్వారా బాలాసోర్ లాంటి విషాదాన్ని నివారించవచ్చని CRS నివేదిక పేర్కొంది.

CRS నివేదికపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. రైల్వే భద్రత, ప్రయాణికుల సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా రాజీపడిందని విమర్శించింది. ఈ మానవ తప్పిదం రాజకీయ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషాద సంఘటన తరువాత, సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అర్చన జోషిని ఆమె పదవి నుంచి తొలగించారు. ఆమె స్థానంలో అనిల్ కుమార్ మిశ్రాను నియమించారు.

బాలాసోర్‌‌లో సిగ్నలింగ్ లోపంలో కోల్‌కతా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 293 మంది మరణించగా, సుమారు 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒడిశా ప్రమాదం ఒకటి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Assam Congress troubles: అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
Israel-Iran War: దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
Tamil Nadu Assembly Elections 2026:విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
Iran War Updates: సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?
సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget 2026-27: 3 లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మల్లు భట్టివిక్రమార్క
3 లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మల్లు భట్టివిక్రమార్క
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Ustaad Bhagat Singh Collection Day 1 : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... వారికి నెలకు 2 వేలు - తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే!
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... వారికి నెలకు 2 వేలు - తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే!
Dhurandhar 2 Collections : ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ - బెస్ట్ మూమెంట్స్... ఈవెంట్ హైలెట్స్
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ - బెస్ట్ మూమెంట్స్... ఈవెంట్ హైలెట్స్
Eid ul-Fitr 2026: ఈద్-ఉల్-ఫితర్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు!
ఈద్-ఉల్-ఫితర్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు!
Assam Congress troubles: అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
Embed widget