అన్వేషించండి

Odisha Train Accident Report: ఒడిశా రైలు ప్రమాదానికి కారణాలు చెప్పేసిన కేంద్రం- కుట్ర కోణంపై క్లారిటీ

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన అత్యంత విషాదకర ఘటనకు కారణాలను కేంద్రం తొలిసారి వెల్లడించింది.  సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక వివరాలను విడుదల చేసింది.

గత జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన అత్యంత విషాదకర ఘటనకు కారణాలను కేంద్రం తొలిసారి వెల్లడించింది.  సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని వివరిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక వివరాలను విడుదల చేసింది. రాజ్యసభలో ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ప్రమాదం గురించి అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇస్తూ నివేదిక వివరాలు వెల్లడించింది. స్టేషన్‌ వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్ లోపాలను నివేదికలో పొందుపరిచారు. "గతంలో నార్త్ సిగ్నల్ గూమ్టీ స్టేషన్ వద్ద సిగ్నలింగ్-సర్క్యూట్-మార్పులో లోపాలు తలెత్తాయి. లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్. 94 వద్ద ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్‌ మార్పులు, సిగ్నలింగ్ పనులు చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని నివేదికలో కేంద్రం పేర్కొంది.

సాంకేతికతలో లోపాల కారణంగా రాంగ్ లైన్‌‌లో గ్రీన్ సిగ్నల్ పడిందని, ఫలితంగా ఆగి ఉన్న గూడ్స్ రైలు, మరో రైలు ఢీకొట్టిందని వెల్లడించింది. ఈ ప్రమాదం రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.  ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలభై ఒక్క మంది ప్రయాణికులను ఇంకా గుర్తించలేదని ప్రభుత్వం వెల్లడించింది. MP జాన్ బ్రిట్టాస్ రైలు ప్రమాదాల మీద ప్రశ్నించినా గత మూడు సంవత్సరాలలో ఇలాంటి సిగ్నల్ వైఫల్యాలపై ప్రభుత్వం వివరాలను అందించలేదు. కేవలం వైఫల్యాలు ఉన్నాయని మాత్రమే చెబుతోంది. కానీ ఏదీ బాలాసోర్‌లో జరిగినంత తీవ్రమైన సంఘటనకు దారితీయలేదు.

జులై ప్రారంభంలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ప్రమాదానికి సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులు అరుణ్ కుమార్ మహంత, మహమ్మద్ అమీర్ ఖాన్, పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది. హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, కుట్ర పూరిత హత్యా నేర అభియోగాలు వారిపై మోపారు. జూలై 15న రిమాండ్ కాలం ముగిసిన తర్వాత నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తదుపరి కేసు విచారణ జూలై 27కి వాయిదా వేశారు.

సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లోని బ్యాంక్‌రనాయబాజ్ స్టేషన్‌లో మే 16, 2022న వైరింగ్, కేబుల్ లోపం కారణంగా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. సరైన చర్యలు తీసుకోవడం ద్వారా బాలాసోర్ లాంటి విషాదాన్ని నివారించవచ్చని CRS నివేదిక పేర్కొంది.

CRS నివేదికపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. రైల్వే భద్రత, ప్రయాణికుల సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా రాజీపడిందని విమర్శించింది. ఈ మానవ తప్పిదం రాజకీయ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషాద సంఘటన తరువాత, సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అర్చన జోషిని ఆమె పదవి నుంచి తొలగించారు. ఆమె స్థానంలో అనిల్ కుమార్ మిశ్రాను నియమించారు.

బాలాసోర్‌‌లో సిగ్నలింగ్ లోపంలో కోల్‌కతా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 293 మంది మరణించగా, సుమారు 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒడిశా ప్రమాదం ఒకటి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengal BJP Manifesto 2026: యువత మహిళలకు నగదు బదిలీ హామీలు - వరాల వర్షం కురిపించిన బీజేపీ - బెంగాల్‌పైనే గురి!
యువత మహిళలకు నగదు బదిలీ హామీలు - వరాల వర్షం కురిపించిన బీజేపీ - బెంగాల్‌పైనే గురి!
Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Assam Assembly Elections: అస్సాంలో ఎన్నికల ఎజెండా సీఎం హిమంతనే - ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా?
అస్సాంలో ఎన్నికల ఎజెండా సీఎం హిమంతనే - ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా?
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Dacoit OTT : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Hyderabad Drug Tests: హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Danam Nagender: జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
DA for RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదల, జనవరి 1 నుంచి అమల్లోకి
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదల, జనవరి 1 నుంచి అమల్లోకి
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
Embed widget