అన్వేషించండి

ఇకపై అయోధ్య మందిర నిర్మాణానికి NRIల విరాళాలు, కేంద్రం కీలక నిర్ణయం

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇకపై NRIలు విరాళాలు పంపేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Ayodhya Ram Mandir Funds:

విదేశీ విరాళాలు..

అయోధ్య రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తైంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి అయోధ్య రాముడు దర్శనమిస్తాడని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ( Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. అయితే...ఇందుకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకూ దేశంలో నలుమూలల నుంచి వచ్చిన విరాళాలను మాత్రమే తీసుకుంది ట్రస్ట్. ఇకపై విదేశాల నుంచీ విరాళాలు సేకరించేందుకు లైన్ క్లియర్ అయింది. Foreign Contribution Regulation Act (FCRA) 2010 కింద విదేశాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు వీలవుతుంది. ఇన్నాళ్లూ అందుకు కేంద్ర హోం శాఖ దీనిపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు వాటిని ఎత్తివేసింది. ఇదే విషయాన్ని ట్విటర్‌లో ట్రస్ట్ వెల్లడించింది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు హోం మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చినట్టు తెలిపింది. 

"రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఇకపై విదేశాల నుంచి కూడా విరాళాలు సేకరించుకునేందుకు కేంద్ర హోం శాఖ వెసులుబాటునిచ్చింది. ఈ విరాళాలన్నీ ఒకే అకౌంట్‌లో ఉండేలా ఏర్పాట్లు చేస్తాం. ఆ అకౌంట్‌లో తప్ప మరే అకౌంట్‌కీ బదిలీ కావు"

- రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌

2020 నుంచి సేకరణ..

FCRA సెక్షన్ కింద ఓ స్వచ్ఛంద సంస్థ అకౌంట్ ఓపెన్ చేస్తే తప్ప విదేశాల నుంచి విరాళాలు తీసుకోడానికి అవకాశముండదు. ఈ ఏడాది జూన్‌లో FCRA లైసెన్స్ కోసం అప్లై చేసింది ట్రస్ట్. దాదాపు 2020 నుంచి ట్రస్ట్ ఈ విరాళాలు సేకరిస్తోంది. భక్తులు, ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి వీటిని తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 21-24 మధ్యలో రామ మందిరం తెరుచుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 

అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ ఉండవచ్చని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఏ రోజు అయినా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఈ భవ్య మందిరాన్ని మూడంతస్తుల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అవుతుందని నిర్మాణ కమిటీ ఛైర్‌ పర్సన్ తెలియజేశారు. రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి...వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పించింది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు. ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. 

Also Read: ఫ్యుయెల్ కొనుక్కోడానికి డబ్బుల్లేక ఆగిన ఫ్లైట్‌లు, పాపం పాకిస్థాన్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
Embed widget