అన్వేషించండి

మూడోసారి ప్రధాన మంత్రిగా మోడీనే, మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ధీమా

Maharashtra News: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Devendra Fadnavis On PM Modi: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ముచ్చటగా మూడోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దీపావళి పండగను పురస్కరించుకొని తన నివాసంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించి, మూడోసారి మోడీ ప్రధాన మంత్రి పదవి చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని దేశ ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రజల నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. వచ్చేఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. వచ్చే ఏడాది జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పుర్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. 

డిసెంబర్‌లో నిర్వహించబోయే శీతాకాల సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు రాష్ట్రం నుంచి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మహారాష్ట్ర భవన్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అక్కడి ప్రభుత్వం భూమి కూడా కేటాయించిందని వెల్లడించారు.  నిర్మాణాలు, రవాణా, పారిశ్రామిక వ్యర్థాలను పెద్దమొత్తంలో విడుదల చేయడం వల్లే ముంబైలో వాయుకాలుష్యం పెరిగిపోతోందన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఎప్పుడు?
శివసేనలోని రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునే విషయంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తుది అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే పై అనర్హత వేటు పడదని అన్నారు. ఒకవేళ పడినా ఎమ్మెల్సీగా ఆయన తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపడతారని తెలిపారు. సీఎం శిందే సహా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌పై సుప్రీం కోర్టు గత నెలలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ల పరిష్కారానికి నిర్ణీత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని సెప్టెంబరు 18న ఆదేశించింది. ఈ క్రమంలోనే అక్టోబరు 17న మరోసారి విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను స్పీకర్‌ ధిక్కరించలేరని స్పష్టం చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

TMC symbol frozen : మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
Sumitra Vs IOC Case: ఉద్యోగం కోసం 38 ఏళ్ల పాటు పోరాడిన మహిళ.. IOC వర్సెస్ సుమిత్ర కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఉద్యోగం కోసం 38 ఏళ్ల పాటు పోరాడిన మహిళ.. IOC వర్సెస్ సుమిత్ర కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Tamil Nadu Assembly by election: తమిళనాడు ఉపఎన్నికల రగడ - విజయ్‌కి షాకిచ్చిన కమ్యూనిస్టులు! తిరుచ్చి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?
తమిళనాడు ఉపఎన్నికల రగడ - విజయ్‌కి షాకిచ్చిన కమ్యూనిస్టులు! తిరుచ్చి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
Embed widget