అన్వేషించండి

మూడోసారి ప్రధాన మంత్రిగా మోడీనే, మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ధీమా

Maharashtra News: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Devendra Fadnavis On PM Modi: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ముచ్చటగా మూడోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దీపావళి పండగను పురస్కరించుకొని తన నివాసంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించి, మూడోసారి మోడీ ప్రధాన మంత్రి పదవి చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని దేశ ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రజల నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. వచ్చేఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. వచ్చే ఏడాది జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పుర్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. 

డిసెంబర్‌లో నిర్వహించబోయే శీతాకాల సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు రాష్ట్రం నుంచి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మహారాష్ట్ర భవన్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అక్కడి ప్రభుత్వం భూమి కూడా కేటాయించిందని వెల్లడించారు.  నిర్మాణాలు, రవాణా, పారిశ్రామిక వ్యర్థాలను పెద్దమొత్తంలో విడుదల చేయడం వల్లే ముంబైలో వాయుకాలుష్యం పెరిగిపోతోందన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఎప్పుడు?
శివసేనలోని రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునే విషయంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తుది అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే పై అనర్హత వేటు పడదని అన్నారు. ఒకవేళ పడినా ఎమ్మెల్సీగా ఆయన తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపడతారని తెలిపారు. సీఎం శిందే సహా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌పై సుప్రీం కోర్టు గత నెలలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ల పరిష్కారానికి నిర్ణీత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని సెప్టెంబరు 18న ఆదేశించింది. ఈ క్రమంలోనే అక్టోబరు 17న మరోసారి విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను స్పీకర్‌ ధిక్కరించలేరని స్పష్టం చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Israel Strike On Iran: ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
Iran America War Gold Prices Effect: ఉఫ్.. ఇక బంగారం ధరలకు పట్టపగ్గాలుండవు - ఎంత పని చేశావు ట్రంప్ !
ఉఫ్.. ఇక బంగారం ధరలకు పట్టపగ్గాలుండవు - ఎంత పని చేశావు ట్రంప్ !
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
India first LGBTQ MP: దేశ పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న తొలి LGBTQ+ ఎంపీ - మేనకా గురుస్వామికి మమతా బెనర్జీ చాన్స్
దేశ పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న తొలి LGBTQ+ ఎంపీ - మేనకా గురుస్వామికి మమతా బెనర్జీ చాన్స్

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget