అన్వేషించండి

Minister VK Singh: విశాఖపట్నం నుంచి సీ ప్లేన్ సేవలు సాధ్యమే: కేంద్ర మంత్రి

Minister VK Singh: విశాఖపట్నం నుండి సీప్లేన్ సేవలు సాధ్యమేనని పౌర విమానయాన శాఖ మంత్రి వీకే సింఘ్ సమాధానం ఇచ్చారు. విశాఖపట్నం నుంచి భీమవరం, కాకినాడలకు సీప్లేన్‌ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తామని చెప్పారు. 

Minister VK Singh: విశాఖపట్నం నుండి సీప్లేన్ సేవలు సాధ్యమేనని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు పౌర విమానయాన శాఖ మంత్రి  సమాధానం ఇచ్చారు. విశాఖపట్నం నుంచి భీమవరం, కాకినాడలకు సీప్లేన్‌ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా సీప్లేన్ మార్గాన్ని మంజూ రు చేసినట్లు వివరించారు. అయితే మారుమూల ప్రాంతాలకు వైమానిక కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు ప్రయాణాన్ని సరసమైనదిగా చేయడం కోసం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉడాన్ పథకం కింద 28 సీప్లేన్ మార్గాలను మంజూరు చేసింది.

287 కోట్లతో 14 వాటర్ ఏరో డ్రోమ్ ల నిర్మాణం..

ఇందుకోసం ఆరు రాష్ట్రాలు/యూటీలలో రూ.287 కోట్లతో 14 వాటర్ ఏరో డ్రోమ్‌లను నిర్మిస్తున్నారు. ఇలా నిర్మిస్తున్న 14 వాటర్ ఏరోడ్రోమ్‌ల జాబితాలో ఆంధ్రప్రదేశ్ (విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ), తెలంగాణలో (నాగార్జునసాగర్ రిజర్వాయర్) ఒక్కొక్కటి 20 కోట్ల ఖర్చుతో నిర్మించబడుతున్నాయి. ఈ విషయాన్ని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.  

UDAN సీప్లేన్ ఆపరేషన్ల కోసం ప్రతిపాదనలు పరిశీలిస్తాం..

కొత్త విశాఖపట్నం క్రూయిజ్ టెర్మినల్ నుండి UDAN సీప్లేన్ మరియు హెలికాప్టర్ ఆపరేషన్ల కోసం ప్రతిపాదనలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి సానుకూలంగా సమాధానం ఇచ్చారు. విమానయాన ఆపరేటర్లు కొత్త మార్గాల కోసం బిడ్డింగ్ యొక్క భవిష్యత్తు రౌండ్లలో UDAN పథకం కింద ప్రతిపాదనలు సమర్పిస్తే వాటిని పరిశీలించడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 

ఆపరేట్లను ఆహ్వానించి, రాయితీలను ఇవ్వాలి.. 

ఈ అంశంపై మాట్లాడుతూ.. విశాఖపట్నం నుండి సీప్లేన్ మరియు హెలికాప్టర్ సేవల కోసం వేలం వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానయాన ఆపరేటర్లను ఆహ్వానించి, రాయితీలను అందించాలని రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖపట్నం నుంచి క్రూయిజ్ టూరిజంకు ఇప్పటికే సానుకూల స్పందన లభించినందున, ప్రాంతీయ కనెక్టివిటీ మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సీప్లేన్ మరియు హెలికాప్టర్ సేవలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 

భీమవరం, కాకినాడ వంటి ప్రాంతాలకు సీప్లేన్ సేవలు కనెక్టివిటీని బాగా మెరుగుపరుస్తాయని మరియు వ్యాపార పర్యాటకాన్ని పెద్ద ఎత్తున పెంచుతాయని ఎంపీ శ్రీ జీవీఎల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి చర్చిస్తానని ఆయన తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget