అన్వేషించండి

మణిపూర్ పర్యటనకు 21 మంది విపక్ష ఎంపీలు, రాజకీయం చేయడానికి కాదంటున్న కూటమి

Manipur Violence: ఇండియా కూటమి నుంచి 21 మంది ఎంపీలు మణిపూర్ పర్యటనకు సిద్ధమయ్యారు.

Manipur Violence: 

20 మంది ఎంపీల పర్యటన..

మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంట్‌లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన INDIA కూటమి ఎంపీలు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ, రేపు ( జులై 29,30) అక్కడే పర్యటిస్తారు. ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి అక్కడ చేరుకోనున్నారు. ఈ కూటమిలోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు వెళ్తున్నారు. అక్కడి పరిస్థితులు సమీక్షిస్తారు. కాంగ్రెస్ తరపున అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్ వెళ్తున్నారు. ఆప్ నుంచి సుశీల్ గుప్తా, డీఎమ్‌కే నుంచి కనిమొళి కరుణానిధి వెళ్లనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఈ పర్యటనను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదని, కేవలం మణిపూర్ పౌరుల ఆవేదనను అర్థం చేసుకోడానికే వెళ్తున్నామని ఇప్పటికే INDIA స్పష్టం చేసింది. 

"మణిపూర్‌లో తలెత్తిన సమస్యకు పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని మేం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అక్కడ పరిస్థితిని శాంతిభద్రతల సమస్యగానే చూడలేం. అది రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ. దీని వల్ల పొరుగు రాష్ట్రాల్లోనూ ఆందోళన మొదలైంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. అందుకే...అక్కడి వాస్తవాలేమిటో తెలుసుకోడానికి మేం వెళ్తున్నాం"

- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ

ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..

కాంగ్రెస్ ఎంపీ నజీర్ హుస్సేన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ 20 మంది ఎంపీలు మణిపూర్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆ తరవాత రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయ్‌కేని కలవనున్నారు. ఈ పర్యటన ముగిసిన తరవాత మణిపూర్‌లో  తాము ఏం గమనించారో పార్లమెంట్‌లో చర్చించాలని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రం అందుకు అడ్డుపడితే ప్రత్యేకంగా ప్రెస్‌కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరికీ వివరించాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చించేందుకు బీజేపీ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని మండి పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పర్యటించేందుకు ప్రధానికి సమయం ఉంది కానీ...మణిపూర్‌కి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. మే 3వ తేదీ నుంచి అక్కడ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: CM Siddaramaiah: కారు పార్కింగ్ కోసం సీఎంనే ఆపేసిన వృద్ధుడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
Konda Surekha Vs Revanth Reddy: బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
Raymond Group: అనంతపురంలో  ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
AP Liquor Issue: ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ  లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
Advertisement

వీడియోలు

WWC 2025 | టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే గెలవాల్సింది ఎన్ని మ్యాచులు?
BCCI Rohit Sharma Virat Kohli | రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
Rohit Sharma and Virat Kohli | ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు బాదేస్తాడన్న హర్బజన్ సింగ్
KL Rahul Injury |  విండీస్ రెండో టెస్ట్‌లో గాయపడిన కేఎల్ రాహుల్‌
Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
Konda Surekha Vs Revanth Reddy: బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
Raymond Group: అనంతపురంలో  ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
AP Liquor Issue: ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ  లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
Rural Vehicle Sales India: రైతులతో కిటకిటలాడిన షోరూమ్‌లు - పెరిగిన ఆదాయాలు, తగ్గిన GST రేట్లతో సేల్స్‌ ఊపు
షోరూమ్‌లను ముంచెత్తిన రూరల్‌ ఇండియా - బయ్యర్లలో ఎక్కువ మంది గ్రామీణులే
Commonwealth Games:  అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
Tata Nexon : లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో Tata Nexon వచ్చేస్తోంది! ఈ దీపావళికి బంపర్ ఆఫర్‌!
లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో Tata Nexon వచ్చేస్తోంది! ఈ దీపావళికి బంపర్ ఆఫర్‌!
Mallareddy College Google agreement: గూగుల్‌తో  మల్లారెడ్డి కాలేజీల ఒప్పందం -  డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభం
గూగుల్‌తో మల్లారెడ్డి కాలేజీల ఒప్పందం - డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభం
Embed widget