అన్వేషించండి

Mallikarjun Kharge: ఎర్రకోట వేడుకకు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరు, ఖాళీ కుర్చీల ఫొటోలు పోస్టు చేసిన కాంగ్రెస్

Mallikarjun Kharge: ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రతిపక్ష నాయకులు హాజరు కాలేదు. ఖర్గే కోసం వేసిన కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది.

Mallikarjun Kharge: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎర్రకోట వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున్ ఖర్గే ఈ వేడుకలకు హాజరు కాలేదు. ఆయన కోసం వేసిన కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. ఓ వీడియో మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్టు  చేసిన ఖర్గే.. గత ప్రధానులు దేశాన్ని తీర్చిదిద్దిన వైనాన్ని వెల్లడించారు.

ఆరోగ్యం బాలేకపోవడంతో ఎర్రకోటలో జరిగిన వేడుకలకు హాజరు కాలేకపోయినట్లు చెప్పిన ఖర్గే.. తమ వీడియో సందేశంలో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నేతాజీ, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజిని నాయుడు, అంబేద్కర్ కు నివాళి అర్పించారు. అలాగే దేశ తొలి ప్రధాని నెహ్రూ, ఇతర కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అలాగే బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిల పాత్రను ఖర్గే తన వీడియో సందేశంలో కొనియాడారు. దేశానికి సేవ చేసిన ప్రతి ప్రధాన మంత్రి దేశ ప్రగతికి దోహదపడ్డారని, గత కొన్నేళ్లలో భారత్ పురోగమిసుందని ఈ రోజు కొందరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని మోదీపై పరోక్షంగా ఖర్గే విమర్శలు గుప్పించారు. 

వాజ్ పేయి సహా ఇతర ప్రధాన మంత్రులు అందరూ దేశం కోసం ఎంతో కృషి చేశారని, దేశాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. ప్రస్తుతం మాత్రం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయని బాధగా చెబుతున్నట్లు ఖర్గే తన సందేశంలో వెల్లడించారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులతో దాడులు చేయించడమే కాకుండా, ఎన్నికల కమిషన్ ను కూడా నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. మైక్ లు కట్ చేస్తున్నారని, ప్రసంగాలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. 

Also Read: Women Freedom Struggle: స్వాతంత్య్ర పోరాటంలో తెగించి కొట్లాడిన ధీర వనితలు, ఒక్కొక్కరి జీవితం స్ఫూర్తిదాయకం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఎయిమ్స్, అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) వంటివి నెహ్రూ హయాంలోనే జరిగాయని చెప్పుకొచ్చారు. స్వతంత్ర భారత్ లో కళ, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రోత్సహించారని ఖర్గే అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ విధానాలు ప్రధాని మోదీ కీలక మంత్రాల్లో ఒకటైన ఆత్మనిర్భర్ భారత్ గా మారడానికి దోహదపడ్డాయని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మహానాయకులు కొత్త చరిత్ర సృష్టించడానికి గత చరిత్రను చెరిపివేయరని, వీళ్లు మాత్రం ప్రతిదాన్ని పేరు మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఖర్గే అన్నారు. గత పథకాలు, తమ నియంతృత్వ మార్గాలతో ప్రజాస్వామ్యాన్ని చీల్చుతున్నారని ఆరోపించారు. 

ఇలా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇలా ప్రధానమంత్రిపై విమర్శలు చేయడం చాలా అరుదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేయకుండా ఉండటం ఇప్పటి వరకు ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే ఖర్గే ఆ సంప్రదాయాన్ని పటాపంచలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రిని పరోక్షంగా విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
US Woman Liz Shocked Indian Medicine Prices Cancer: అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget