అన్వేషించండి

Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు

Siddaramaia In MUDA Case : మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ6న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Karnataka Muda scam Case: బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన ముడా స్కాం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah)కు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు. నవంబర్‌ 6న సిద్ధారామయ్య విచారణకు హాజరుకావాలని సోమవారం జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు. తనకు లోకాయుక్త నుంచి నోటీసులు వచ్చాయని సీఎం సిద్ధారామయ్య సైతం తెలిపారు. నవంబర్ 6న విచారణకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.

సిద్ధరామయ్య భార్యను విచారించిన పోలీసులు

సిద్ధరామయ్య సతీమణి పార్వతీని లోకాయుక్త పోలీసులు అక్టోబర్‌ 25న ప్రశ్నించారు. ముడా భూములకు సంబంధించి విచారణ జరిపారు. రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను సైతం కేసులోకి లాగారని సిద్ధరామయ్య ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి కొంతకాలం సైలెంట్ గా ఉంది. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. ఆగస్టు 16 న సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు సైతం జారీ చేశారు. కానీ తనపై విచారణ జరిపించాలని గవర్నర్ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సీఎం సిద్ధరామయ్య పిటిషన్ ను సెప్టెంబరు 24న హైకోర్టు తోసిపుచ్చింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి చెల్లుబాటు అవుతుందని, వ్యక్తిగత ఫిర్యాదుతో కేసు నమోదుకు అనుమతి ఇచ్చే అధికారం ఉందని స్పష్టం చేసింది. దాంతో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన అనుమతి చెల్లుబాటు అయింది. 

అక్రమంగా ముడా ప్లాట్లు పొందారని  సిద్దారమయ్యపై ఆరోపణలు

మైసూర్ అర్బన్  డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) మైనసూరులో డెలవప్ చేసిన ఓ వెంచర్ లో సిద్ధరామయ్య భార్య పార్వతికి సైతం ప్లాట్లు కేటాయించారు. సిద్ధరామయ్య స్వగ్రామంలో ఆయన భార్యకు చెందిన భూమిని కూడా డెవలప్ మెంట్ కోసం ముడా తీసుకుంది. ఆ భూమికి ప్రతిఫలంగా అత్యంత విలువైన భూములు సిద్దరామయ్య భార్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన భూములు సీఎం సిద్ధరామయ్య ఫ్యామిలీ పొందినట్లు గవర్నర్ కు ఫిర్యాదులు రాగా, విచారణకు ఆదేశించారు. ముడా భూముల స్కాంపై సిద్ధరామయ్యను లోకాయక్త పోలీసులు విచారించేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన 

తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని, తన భార్యను సైతం వేధించాలని కేసులు నమోదు చేసే కుట్ర జరిగిందని కోర్టును ఆశ్రయించారు. కానీ వ్యక్తిగత ఫిర్యాదుతో విచారణకు ఆదేశించే హక్కు గవర్నర్ కు ఉందని హైకోర్టు స్పష్టం చేయడంతో సిద్ధరామయ్యకు చిక్కులు తప్పడం లేదు. ఈ క్రమంలో లోకాయుక్త పోలీసులు నవంబర్ 6న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సిద్ధరామయ్యకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి.

Also Read: Muda Case: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget