అన్వేషించండి

Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు

Siddaramaia In MUDA Case : మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ6న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Karnataka Muda scam Case: బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన ముడా స్కాం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah)కు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు. నవంబర్‌ 6న సిద్ధారామయ్య విచారణకు హాజరుకావాలని సోమవారం జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు. తనకు లోకాయుక్త నుంచి నోటీసులు వచ్చాయని సీఎం సిద్ధారామయ్య సైతం తెలిపారు. నవంబర్ 6న విచారణకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.

సిద్ధరామయ్య భార్యను విచారించిన పోలీసులు

సిద్ధరామయ్య సతీమణి పార్వతీని లోకాయుక్త పోలీసులు అక్టోబర్‌ 25న ప్రశ్నించారు. ముడా భూములకు సంబంధించి విచారణ జరిపారు. రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను సైతం కేసులోకి లాగారని సిద్ధరామయ్య ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి కొంతకాలం సైలెంట్ గా ఉంది. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. ఆగస్టు 16 న సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు సైతం జారీ చేశారు. కానీ తనపై విచారణ జరిపించాలని గవర్నర్ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సీఎం సిద్ధరామయ్య పిటిషన్ ను సెప్టెంబరు 24న హైకోర్టు తోసిపుచ్చింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి చెల్లుబాటు అవుతుందని, వ్యక్తిగత ఫిర్యాదుతో కేసు నమోదుకు అనుమతి ఇచ్చే అధికారం ఉందని స్పష్టం చేసింది. దాంతో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన అనుమతి చెల్లుబాటు అయింది. 

అక్రమంగా ముడా ప్లాట్లు పొందారని  సిద్దారమయ్యపై ఆరోపణలు

మైసూర్ అర్బన్  డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) మైనసూరులో డెలవప్ చేసిన ఓ వెంచర్ లో సిద్ధరామయ్య భార్య పార్వతికి సైతం ప్లాట్లు కేటాయించారు. సిద్ధరామయ్య స్వగ్రామంలో ఆయన భార్యకు చెందిన భూమిని కూడా డెవలప్ మెంట్ కోసం ముడా తీసుకుంది. ఆ భూమికి ప్రతిఫలంగా అత్యంత విలువైన భూములు సిద్దరామయ్య భార్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన భూములు సీఎం సిద్ధరామయ్య ఫ్యామిలీ పొందినట్లు గవర్నర్ కు ఫిర్యాదులు రాగా, విచారణకు ఆదేశించారు. ముడా భూముల స్కాంపై సిద్ధరామయ్యను లోకాయక్త పోలీసులు విచారించేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన 

తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని, తన భార్యను సైతం వేధించాలని కేసులు నమోదు చేసే కుట్ర జరిగిందని కోర్టును ఆశ్రయించారు. కానీ వ్యక్తిగత ఫిర్యాదుతో విచారణకు ఆదేశించే హక్కు గవర్నర్ కు ఉందని హైకోర్టు స్పష్టం చేయడంతో సిద్ధరామయ్యకు చిక్కులు తప్పడం లేదు. ఈ క్రమంలో లోకాయుక్త పోలీసులు నవంబర్ 6న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సిద్ధరామయ్యకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి.

Also Read: Muda Case: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Home Birth Tragedy: చచ్చినా ఇన్‌ఫ్లూయన్సర్ల మాటలు నమ్మొద్దు - నమ్మితే చచ్చిపోతారు - ఇదిగో భయంకర ఘటన
చచ్చినా ఇన్‌ఫ్లూయన్సర్ల మాటలు నమ్మొద్దు - నమ్మితే చచ్చిపోతారు - ఇదిగో భయంకర ఘటన
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget