అన్వేషించండి

Indian Railways Zero-Refund Rule: ట్రైన్ టికెట్ బుక్ చేసిన క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగిరానట్టే! జీరో-రీఫండ్ రూల్ అమలు!

Indian Railways Zero-Refund Rule:ఆఖరి నిమిషంలో చాలా మంది ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తుంటారు. ఇలా చేస్తే కొంత అమౌంట్ తిరిగి వస్తుంది. కానీ ఇప్పుడు అలా చేస్తే ఒక్క పైసా కూడా తిరిగి రాదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల రద్దు నియమాలు కఠినతరం.
  • బయలుదేరే 8 గంటల్లోపు రద్దు చేస్తే డబ్బులు తిరిగి రావు.
  • ముందుగా రద్దు చేస్తే 25% నుండి 50% ఛార్జీలు వర్తిస్తాయి.
  • చివరి నిమిషంలో రద్దులు తగ్గించి, సీట్ల వినియోగాన్ని పెంచడం లక్ష్యం.

Zero-Refund Rule in Indian Railways : భారతీయ రైల్వేలు తన ప్రీమియం వందే భారత్, అమృత్ భారత్ రైలు సేవలకు టిక్కెట్ రద్దు, రీఫండ్ నియమాలను మరింత కఠినతరం చేసింది. ఇది బుకింగ్‌ కన్ఫామ్ అయిన ప్రయాణికులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం, షెడ్యూల్ చేసిన తర్వాత ట్రైన్ బయల్దేరడానికి ఎనిమిది గంటలలోపు టికెట్స్ రద్దు చేస్తే అలాంటి ప్రయాణికులకు ఒక్క పైసా కూడా వెనక్కి ఇవ్వరు. ఇప్పటి వరకు ఈ రూల్‌ ఏ ట్రైన్స్‌లో లేదు. ఆఖరి నిమిషం వరకు కూడా ట్రైన్ టికెట్స్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ట్రైన్ బయల్దేరడానికి ఉన్న సమయాన్ని బట్టి డబ్బులు తిరిగి ఇచ్చే వాళ్లు. ఇప్పుడు  ఈ రూల్‌లో చాలా మార్పులు చేశారు. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సేవలకు మాత్రమే ఈ రిఫండ్‌ రూల్ వర్తిస్తుంది. మిగతా ప్రీమియం ట్రైన్స్‌కు ఈ రిఫండ్ రూల్ వర్తించదని రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫై  చేసింది. చివరి నిమిషంలో రద్దులను తగ్గించడం, సీట్ల వినియోగాన్ని మెరుగుపరచడం, అధిక డిమాండ్ ఉన్న ఈ మార్గాల్లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.  

అప్‌డేట్ చేసిన రూల్స్ ప్రకారం, వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ II రైళ్లలో టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత ప్రయాణీకులు రైలు షెడ్యూల్ ప్రకారం బయలుదేరడానికి ఎనిమిది గంటల కంటే తక్కువ సమయంలో తమ టిక్కెట్లను రద్దు చేసుకుంటే వారికి ఎటువంటి వాపసు లభించదు. ఇది సాధారణ రైళ్లలోని వాపసు విండోకి పూర్తి విరుద్దమైన రూల్. ఇప్పటి వరకు ప్రయాణీకులు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు వరకు పాక్షిక వాపసులను క్లెయిమ్ చేయవచ్చు, అయినప్పటికీ రద్దు ఛార్జీలు తగ్గిస్తారు. . ఎనిమిది గంటల నియమం ఈ ప్రీమియం సేవలలోని అన్ని తరగతులకు ఒకే విధంగా వర్తిస్తుంది, అంటే ఆలస్యంగా రద్దు చేయడం వలన మొత్తం ఛార్జీలు రైల్వే శాఖ తీసుకుంటుంది.  

బయలుదేరడానికి 72 గంటల కంటే ముందు టికెట్స్‌ రద్దు చేసుకుంటే 25 శాతం రద్దు ఛార్జీ వర్తిస్తుంది. బయలుదేరడానికి 72 నుంచి ఎనిమిది గంటల ముందు వరకు రద్ చేసుకుంటే 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీ వసూలు చేస్తారు. మిగిలినది తిరిగి చెల్లిస్తారు.  

నియమాలు ఎందుకు మారాయి

బుకింగ్ సమయంలో బెర్త్‌లు కన్ఫామ్ అయిన వారు ఆఖరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికలను మార్చకుండా చేస్తుంది.  అలాంటి ఆలోచన ఉన్న వాళ్లు టికెట్లు బుక్ చేయడానికి వెనుకాడతారని అందుకే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్ (RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ ఆప్షన్‌లను ఇచ్చే నార్మల్‌ రైళ్ల మాదిరిగా కాకుండా, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ II రైళ్లు బుకింగ్ సమయంలో ప్రతి ప్రయాణీకుడికి టికెట్ కన్ఫామ్ చేస్తున్నారు. అంటే ఈ ట్రైన్స్‌లో వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీలు సౌకర్యాలు ఉండవు. ఈ హై-యుటిలిటీ సేవలపై ఆదాయాన్ని పొందడానికి, సీట్లు సమర్థవంతంగా ఉపయోగంలోకి వస్తాయని కఠినమైన రద్దు నియమాలు తీసుకొచ్చారు. 

ప్రయాణీకులు ఈ ట్రైన్స్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు వారి టూర్ ప్లాన్‌ కచ్చితంగా ఖరారు చేసుకోవాలని, నిర్ణీత టికెట్ ట్రైన్ బయలుదేరడానికి ముందు క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి రావనే విషయాన్ని గుర్తుంచుకొని టికెట్ బుక్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

వందే భారత్, అమృత్ భారత్ రైళ్లలో టికెట్ రద్దుపై కొత్త నియమాలు ఏమిటి?

వందే భారత్, అమృత్ భారత్ రైళ్లలో టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత, రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటలలోపు రద్దు చేస్తే డబ్బులు వాపసు రావు.

ఈ కొత్త నియమాలు ఏ రైళ్లకు వర్తిస్తాయి?

ఈ కొత్త నియమాలు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ II రైళ్లకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్తించవు.

రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే ముందు టికెట్లు రద్దు చేస్తే ఏమి జరుగుతుంది?

రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందు రద్దు చేస్తే 25% ఛార్జీ, 72 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50% ఛార్జీ వర్తిస్తుంది. మిగిలిన మొత్తం వాపసు వస్తుంది.

ఈ మార్పుల వెనుక కారణం ఏమిటి?

చివరి నిమిషంలో టికెట్ల రద్దును తగ్గించడం, సీట్ల వినియోగాన్ని మెరుగుపరచడం, అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం ఈ మార్పుల లక్ష్యం.

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Cockroach Janta Party Jantar Mantar: ఆఫ్‌లైన్‌లో తేలిపోయిన కాక్రోచ్ జనతా పార్టీ - జంతర్ మంతర్‌లో అంతంతమాత్రంగానే నిరసన
ఆఫ్‌లైన్‌లో తేలిపోయిన కాక్రోచ్ జనతా పార్టీ - జంతర్ మంతర్‌లో అంతంతమాత్రంగానే నిరసన
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget