అన్వేషించండి

ATM Facility On Moving Train: కదిలే రైళ్లలో ఏటీఎం సేవలు, ప్రయోగాత్మకంగా ఆ ట్రైన్‌లో సర్వీస్ ప్రారంభించిన రైల్వేశాఖ

ATM Facility On Moving Train: కదిలే ట్రైన్‌లో ఏటీఎం సౌకర్యాన్ని తీసుకొచ్చింది ఇండియన్ రైల్వేశాఖ. ప్రజల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా 'పంచవటి 'ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది.

ATM Facility On Moving Train: ప్రయాణికు సౌకర్యాలు మెరుగుపరుస్తున్న రైల్వే శాఖ స్టేషన్ మాత్రమే కాకుండా బోగీలను కూడా ఆధునీకరిస్తోంది. ఇప్పుడు కొత్తగా భారతీయ రైల్వేల్లో ఐటీఎం సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూనే ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.  

రైల్వే ప్రయాణ సమయాల్లో చాలా మంది క్యాష్‌ను క్యారీ చేయరు. భద్రత విషయంతోపాటు పెరిగిపోతున్న డిజిటల్ టాన్షాక్షన్‌తో చాలా మంది జేబుల్లో క్యాష్ కంటే కార్డులే ఉంటున్నాయి. అయితే అత్యవసరంలో డబ్బులు అవసరమైతే వాళ్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర రైల్వేశాఖ ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 

రైల్వేల ఆధునీకరణలో భాగంగా ప్రయాణికులకు కొత్త కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది ఇండియన్ రైల్వే శాఖ. ఆలా తీసుకొచ్చిన లేటెస్ట్ ఫెసిలిటీ ట్రైన్‌లోనే ATM సేవలు. డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ కావడంతో క్యాష్‌ను ప్రయాణంలో క్యారీ చేయడం తగ్గిపోయింది. అయితే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రయాణ మధ్యలో క్యాష్‌ లభించడం కష్టం అవుతుంది. కాబట్టి రైల్వేస్ కొన్ని ట్రైన్లలో ప్రయోగాత్మకంగా ATMలను ఏర్పాటు చేస్తోంది. 

ముందుగా ఈ ట్రైన్ నుంచే  ప్రారంభం  
ఈ ప్రయోగాన్ని ముందుగా ముంబై నుంచి మన్మాడ్ వరకూ ప్రయాణించే 'పంచవటి ' ఎక్స్‌ప్రెస్‌లో ఏటీఎం ఏర్పాటు చేశారు. సెంట్రల్ రైల్వే (CR) నిర్వహించే 12110 నెంబర్ గల పంచవటి ఎక్స్ ప్రెస్ ప్రతీ రోజు ఉదయం 6:02కి మన్మాడ్‌లో బయలుదేరి అదే రోజు ఉదయం 10:45కి CSMT ముంబై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6:15కి ముంబైలో బయల్దేరి రాత్రి 10:50కి మన్మాడ్ చేరుకుంటుంది. ముంబై నుంచి షిరిడి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ ట్రైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ ట్రైన్ లోనే ఏటీఎం ఏర్పాటు చేశారు.

A/C చైర్‌కార్‌లో ATM  
'పంచవటి' ఎక్స్‌ప్రెస్‌లోని A/C చైర్‌కార్‌లో ATM ఏర్పాటు చేయాలనే రైల్వేస్ ఆలోచనకు మద్దతు ఇస్తూ బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర ఈ ATM ఏర్పాటు చేసినట్టు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా తెలిపారు. A/C చైర్‌కార్‌లో ఏర్పాటు చేసిన ATM రక్షణ కోసం ఒక షట్టర్ డోర్ ఏర్పాటు చేసినట్టు రైల్వే తెలిపింది. దీనికి లభించే ప్రజాదరణను బట్టి రానున్న రోజుల్లో మరికొన్ని ట్రైన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే రెడీగా ఉంది.    

తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ట్రైన్లు అనుకూలం  
మన తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట తిరిగే డైలీ ట్రైన్లకి కూడా ఇలాంటి సౌకర్యం అవసరం ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. శాతవాహన ఎక్స్ప్రెస్, పినాకిని, రత్నాచల్, సింహాద్రి, జన్మభూమి, జన శతాబ్ది లాంటి ట్రైన్లు కూడా ఇలాంటి ప్రయోగానికి అనుకూలంగా ఉంటాయి. ఈ ట్రైన్లలో తరిగే వాళ్లు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా ట్రైన్లలో ఏటీఎం సేవలు అందుబాటులో తీసుకొస్తారేమో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టాక్సిక్ మూవీ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు
టాక్సిక్ మూవీ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు
PM Narendra Modi BJP Meeting: ప్రధాని మోదీతో భేటీ అరుదైన ఘట్టం - బీజేపీ నూతన పదాధికారులకు నరేంద్ర మోదీ మార్గనిర్దేశం!
ప్రధాని మోదీతో భేటీ అరుదైన ఘట్టం - బీజేపీ నూతన పదాధికారులకు నరేంద్ర మోదీ మార్గనిర్దేశం!
Rahul Gandhi: మనుస్మృతిలో మహిళల గురించి ఏం రాశారు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?
మనుస్మృతిలో మహిళల గురించి ఏం రాశారు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?
Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget