అన్వేషించండి

NCERT పుస్తకాల్లో ఇండియాకి బదులుగా 'భారత్‌' పేరు, ప్యానెల్ కీలక నిర్ణయం

India Vs Bharat Row: ఇకపై NCERT పుస్తకాల్లో ఇండియాకి బదులుగా 'భారత్‌' పేరు ఉంటుందని ప్యానెల్ వెల్లడించింది.

India Vs Bharat Row:

NCERT కీలక నిర్ణయం 

ఇండియా పేరుని భారత్‌గా మార్చేస్తారంటూ చాలా రోజులుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన G20 సదస్సులోనూ ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న చోట India కి బదులుగా Bharat అని రాసుండటం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఇకపై NCERT పుస్తకాల్లో India అనే పేరుని తొలగించనున్నారు. ఆ స్థానంలో Bharat అని ముద్రించనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసి చర్చించారు. ఆ తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై (National Council of Educational Research and Training) NCERT పుస్తకాల్లో India అనే పేరు కనిపించదు. కొన్ని నెలల క్రితమే ఈ ప్రతిపాదనలు రాగా..ప్యానెల్‌ చర్చలు జరిపింది. ప్యానెల్‌లోని సభ్యులంతా అందుకు ఆమోదం తెలపడం వల్ల అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది NCERT.

G20 సదస్సు సమయంలోనే ఈ చర్చ బాగా జరిగింది. ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ ఆహ్వానంలో President of India కి బదులుగా President of Bharat అని రాసుంది. ఇది రాజకీయంగానూ కాస్త అలజడి రేపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1)లో "India, that is Bharat" అని స్పష్టంగా రాసుంది. అందుకే...కేంద్రం ఇండియాకి బదులుగా భారత్ పేరునే పాలనా వ్యవహారాల్లో వినియోగించాలని యోచిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన సంకేతాలనూ ఇచ్చింది. మరో కీలక విషయం ఏంటంటే...NCERT పుస్తకాల్లో "Hindu Victories" పేరిట ప్రత్యేకంగా ఓ పాఠం చేర్చాలని ప్రతిపాదించింది. అదే విధంగా చరిత్రకు సంబంధించిన పాఠాల్లోనూ మార్పులు చేయాలని తెలిపింది. బ్రిటీష్ వాళ్లు చెప్పిన చరిత్రను పూర్తిగా పక్కన పెట్టేయాలని భావిస్తోంది. వీటితో పాటు సిలబస్‌లో Indian Knowledge System (IKS)ని ప్రవేశపెట్టాలని ప్యానెల్ ప్రతిపాదించింది.

పశ్చిమబెంగాల్‌కి చెందిన బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరు భారత్‌గా కచ్చితంగా మారి తీరుతుందని, ఇది ఇష్టం లేని వాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. ఖరగ్‌పూర్‌లో ఛాయ్‌ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసిన దిలీప్ ఘోష్...భారత్ అనే పేరు పెట్టడాన్ని సమర్థించారు. బెంగాల్‌లో కొందరి విదేశీయుల విగ్రహాలు పెట్టారని, తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ తొలగిస్తామని వెల్లడించారు. మరో సీనియర్‌ నేత రాహుల్ సిన్హా కూడా భారత్‌ అని పేరు మార్చడాన్ని సమర్థించారు. దేశానికి రెండు పేర్లు ఉండడం సరికాదని, భారత్‌ అనే పేరు ఖరారు చేసుకోవడం సబబే అని స్పష్టం చేశారు. G20 సదస్సులో భారత్ పేరుని ప్రమోట్ చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిందని తెలిపారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. దేశంలో ఇన్ని సమస్యలుంటే, పేరు గురించి అనవసరపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: పుల్వామా దాడి తరవాత మోదీ నా నోరు మూయించారు, రాహుల్ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget