![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Corona Cases: దేశంలో మళ్లీ కరోనా టెర్రర్- కొత్తగా 8582 కొవిడ్ కేసులు
Corona Cases: దేశంలో కొత్తగా 8,582 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు.
![Corona Cases: దేశంలో మళ్లీ కరోనా టెర్రర్- కొత్తగా 8582 కొవిడ్ కేసులు India records 8582 fresh COVID-19 cases in last 24 hours Corona Cases: దేశంలో మళ్లీ కరోనా టెర్రర్- కొత్తగా 8582 కొవిడ్ కేసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/4a7f475eac0fca3619b5bab10a0f7528_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Corona Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. కొత్తగా 8,582 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. కొత్తగా 4,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports 8,582 fresh COVID19 cases today; Active cases rise to 44,513 pic.twitter.com/iwzoAyS784
— ANI (@ANI) June 12, 2022
రికవరీ రేటు 98.69 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.1 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.71 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.02 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,214,777
- మొత్తం మరణాలు: 5,24,761
- యాక్టివ్ కేసులు: 44,513
- మొత్తం రికవరీలు: 4,26,52,743
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 13,04,427 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,07,08,541 చేరింది. మరో 3,16,179 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, కర్ణాటకల్లోనే ఎక్కువ కేసులు ఉండటంతో గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫెక్లన్లను తగ్గించడమే లక్ష్యంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్భూషణ్ లేఖ రాశారు.
వైరస్ను ముందుగా గుర్తించి వ్యాప్తిని నిరోధించడంలో టెస్టింగ్లదే కీలక పాత్ర అని ఆయన అన్నారు. అందువల్ల విస్తృత స్థాయిలో టెస్టులు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సిన్, కొవిడ్ నిబంధనలు పాటించడం అనే ఐదంచెల వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్ కట్టడికి ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
Also Read: Arunachal Pradesh: ఉన్నట్టుండి మాయమైన సైనికులు, భారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)