అన్వేషించండి

Harish Rana: శాశ్వత నిద్రలోకి హరీష్‌ రాణా! దేశంలోనే తొలి పాసివ్‌ యుథనేసియా మరణం !

Harish Rana: మార్చి 11న సుప్రీంకోర్టు హరీష్ రాణా కేసులో ఒక మైలురాయి వంటి తీర్పు వెల్లడించింది. గౌరవప్రదంగా మరణించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్ రాణా మంగళవారం తుది శ్వాస విడిచారు.
  • 2013లో ప్రమాదం తర్వాత స్పృహ కోల్పోయిన ఆయనకు న్యాయస్థానం అనుమతితో పాసివ్ యుథనేసియా.
  • ఢిల్లీ AIIMSలో వైద్యుల పర్యవేక్షణలో కృత్రిమ జీవనాధార వ్యవస్థలు తొలగించారు.
  • అవయవ దానం చేసి, హరీష్ రాణా మరణంలోనూ మరొకరికి జీవాన్నిచ్చారు.

Harish Rana: భారత్ వైద్య , న్యాయ చరిత్రలో ఒక అత్యంత బాధాకరమైన కీలకమైన అధ్యాయం ముగిసింది. గత 13 ఏళ్లుగా కోమా స్థితిలో మంచానికే పరిమితమైన 31 ఏళ్ల హరీష్ రాణా మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం పాసివ్‌ యుథనేసియాకు అనుమతి ఇచ్చిన మొదటి వ్యక్తిగా హరీష్‌ రాణా చరిత్రలో నిలిచిపోయారు. 

ఘోర ప్రమాదం- ఆ పై 13 ఏళ్ల పోరాటం 

హరీష్ రాణా జీవితం 2013లో ఒక్కసారిగా తలకిందులైంది. అప్పట్లో పంజాబ్ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్న హరీష్‌ చండీగఢ్‌లోని ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహం నాల్గో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు తీవ్ర గాయమైంది. ఇప్పటి నుంచి ఆయన వెజిటేటివ్‌ స్టేట్‌ అంటే స్పృహ లేని స్థితిలోకి వెళ్లిపోయారు. సుదీర్ఘ కాలం పాటు కృత్రిమ శ్వాస కోసం ట్రాకియోస్టమీ ట్యూబ్‌, ఆహారం కోసం గ్యాస్ట్రోజెజునోస్టమీ ట్యూబ్‌ సహాయంతో ప్రాణాలు నిలబెట్టారు. 

ఘజియాబాద్‌లోని తన నివాసంలో తల్లిదండ్రుల ఆయనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అయితే పదేళ్లు గడిచినా ఆయన ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఒక భారమైన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి నరకప్రాయమైన ఈ జీవితం నుంచి విముక్తి ప్రసాదించాలని కోరుతూ వారు న్యాయపోరాటం చేశారు. 

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు 

ఈ మార్చి 11న సుప్రీంకోర్టు హరీష్ రాణా కేసులో ఒక మైలురాయి వంటి తీర్పు వెల్లడించింది. గౌరవప్రదంగా మరణించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. గత 13 ఏళ్లుగా హరీష్‌ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదని వైద్యులు చెబుతున్నారు. చికిత్స కొనసాగించం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హరీష్‌కు పాసివ్‌ యుథనేసియా అమలు చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

AIIMలో చివరి మజిలీ 

కోర్టు ఆదేశాల మేరకు మార్చి 14న హరీష్‌ ఘజియాబాద్‌లోని తన ఇంటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పాలియేటివ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. హరీష్ గౌరవానికి ఎటువంటి భంగం కలగుండా అత్యంత జాగ్రత్తగా చికిత్సను నిలిపివేయాలని కోర్టు సూచించింది. ఇందు కోసం వైద్యులు సీమా మిశ్రా నేతృత్వంలోని అనస్థీసియా, న్యూరో సర్జరీ సైకియాట్రీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 

మార్చి 16 నుంచి వైద్య బృందం పర్యవేక్షణలో కృత్రిమ పోషకాహారం, ఇతర జీవన ఆధారిత వ్యవస్థలను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. చివరకు 11 రోజుల తర్వాత మార్చి 24న సాయంత్రం 4.10 గంటలకు హరీష్‌ ప్రశాంతంగా కన్నుమూశారు. 

మరణంలోనూ మరొకరికి జీవం 

హరీష్ మరణించినా ఆయన అవయవాల ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కుటుంబ సభ్యుల నిర్ణయించారు. హరీష్‌ కళ్లల్లోని కార్నియాలను, గుండె కవాటాలను దానం చేయడం ద్వారా ఆ కుటుంబం సమాజానికి మంచి సందేశం ఇచ్చింది. 

భారత్‌లో పాసివ్ యుథనేసియా ఎప్పుడో మొదలైంది 

భారత్‌లో పాసివ్ యుథనేసియా చట్టబద్ధమైన చర్చ దశాబ్దాల క్రితమే మొదలైంది. 2011లో అరుణా షాన్ బాగ్ కేసులో సుప్రీంకోర్టు పాసివ్ యుథనేసియాను కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. అయితే అప్పట్లో అరుణా షాన్ బాగ్ విషయంలో ఆసుపత్రి సిబ్బంది అభ్యంతరం తెలపడంతో ఆమెకు అది అమలు కాలేదు. హరీష్ కేసు ద్వారా ఇప్పుడు దేశంలోనే మొదటిసారిగా ఒక రోగికి గౌరవప్రదమైన మరణాన్ని పొందే హక్కు ఆచరణలోకి వచ్చింది. ప్రభుత్వం పాసివ్ యుథనేసియాపై స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. 

Frequently Asked Questions

హరీష్ రాణా ఎవరు?

హరీష్ రాణా 31 ఏళ్ల వ్యక్తి, 13 ఏళ్లుగా కోమాలో ఉండి, ఇటీవల తుది శ్వాస విడిచారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పాసివ్ యుథనేసియాకు సుప్రీంకోర్టు అనుమతి పొందిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

హరీష్ రాణాకు ఏమి జరిగింది?

2013లో పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, హరీష్ రాణా ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహం నాలుగో అంతస్తు నుంచి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు తీవ్ర గాయమై, కోమాలోకి వెళ్లారు.

హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి?

సుప్రీంకోర్టు గౌరవప్రదంగా మరణించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని స్పష్టం చేస్తూ, హరీష్ రాణాకు పాసివ్ యుథనేసియా అమలు చేయడానికి అనుమతినిచ్చింది. చికిత్స కొనసాగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని కోర్టు అభిప్రాయపడింది.

పాసివ్ యుథనేసియా అంటే ఏమిటి?

పాసివ్ యుథనేసియా అంటే, ప్రాణాధార చికిత్సను నిలిపివేయడం ద్వారా లేదా ప్రారంభించకుండా ఉండటం ద్వారా రోగి మరణాన్ని అనుమతించడం. హరీష్ రాణా కేసు ద్వారా ఇది భారతదేశంలో మొదటిసారిగా ఆచరణలోకి వచ్చింది.

హరీష్ రాణా మరణం తర్వాత వారి కుటుంబం ఏమి చేసింది?

వారి కుటుంబ సభ్యులు హరీష్ కళ్లల్లోని కార్నియాలను, గుండె కవాటాలను దానం చేశారు. తద్వారా వారి మరణం కూడా మరికొందరి జీవితాల్లో వెలుగు నింపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Abhishek Banerjee Attack Sonarpur: గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
IT Manager turns Auto Driver: ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!
ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget