అన్వేషించండి

టార్గెట్‌ 2024 కాదు 2047, మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోదీ కీలక సూచన

సమావేశం తరువాత ఈ సమావేశ ఫొటోలాను మోదీ తన ట్విటర్‌లో షేర్ చేశారు. మంత్రి మండలితో ఫలవంతమైన సమావేశం జరిగిందని, తాము విభిన్న అంశాలు, సమస్యలపై చర్చించామని చెప్పుకొచ్చారు.

2047 నాటికి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దానిపైనే ఫోకస్ చేయాలని మంత్రివర్గ సహచరులకు ప్రధాని సూచించారు.  2024 నుంచి దృష్టిని మరల్చాలని 2047 నాటికి వృద్ధి సాధించాల్సిన రంగాలపై ఫోకస్‌ పెంచాలని అన్నారు. భారతదేశ వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన మంత్రి మండలిని కోరారు. ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.

2047 వరకు ఉన్న కాలాన్ని దేశానికి "అమృత్ కాల్"గా పిఎం మోడీ అభివర్ణించారు. రాబోయే 25 సంవత్సరాలలో 2047 నాటికి చాలా మార్పులు వస్తాయని, భారతదేశం ఉన్నత విద్యావంతులైన శ్రామిక శక్తితో  నిండి ఉంటుందని అన్నారు. వివిధ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చూడొచ్చన్నారు. ఈ సమావేశంలో విదేశీ, రక్షణ, రైల్వే సహా వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు కార్యదర్శులు మాట్లాడారు. రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం సాధించాల్సిన అభివృద్ధిపై అన్ని మంత్రిత్వ శాఖలు తమ ప్రజెంటేషన్ ఇచ్చాయి.

సమావేశం తరువాత ఈ సమావేశ ఫొటోలాను మోదీ తన ట్విటర్‌లో షేర్ చేశారు. మంత్రి మండలితో ఫలవంతమైన సమావేశం జరిగిందని, తాము విభిన్న అంశాలు, సమస్యలపై చర్చించామని చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని, ఆ పనుల గురించి ప్రజలకు తెలియజేసేందుకు మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.  వచ్చే తొమ్మిది నెలల్లో అంతా జనంలోనే ఉండాలని ఆదేశించారు. తొమ్మిదేళ్ల అభివృద్ధిని తొమ్మిది నిమిషాల వీడియో ద్వారా ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలన్నారు. మంత్రులు సాధించిన ప్రధాన విజయాలు, పథకాలతో క్యాలెండర్ తయారు చేయాలన్నారు. ఆ విజయంలో భాగస్వాములైన వారిని ప్రోత్సహించాలని సూచించారు. 

అధికార బీజేపీ అగ్రనేతల వరుస సమావేశాల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు వచ్చాయి. మార్కులు తథ్యమన్న టైంలో ఈ సమావేశం జరిగింది. జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

Also Read: కేదార్‌నాథ్ ఆలయంలో లవ్ ప్రపోజల్, యువతిపై భక్తుల ఆగ్రహం - వైరల్ వీడియో

Also Read: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఏపీలో మరో వందేభారత్ ఈ నెల 7 నుంచి పరుగులు

                                       Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
Telangana Congress: మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
300 Kg Drugs Seized: గుజరాత్ తీరంలో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం, వాటి విలువ ఎంతో తెలుసా ?
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Embed widget