అన్వేషించండి

తమిళనాడు మంత్రిని అరెస్టు చేసిన ఈడీ- గుక్కపెట్టిన ఏడ్చేసిన సెంథిల్ బాలాజీ

తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ నివాసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం నుంచి దాడులు నిర్వహించింది.

తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ నివాసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం నుంచి దాడులు నిర్వహించింది. దాదాపు 17 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. అనంతరం తెల్లవారుజామున 2 గంటల సమయంలో వారిని చెన్నై నుంగంబాక్కంలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. సెంథిల్ బాలాజీని విచారణ కోసం తీసుకెళ్లారా లేక అరెస్టు చేశారా అనే దానిపై సందిగ్ధత నెలకొనగా, ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

సెంథిల్ బాలాజీని అధికారులు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను ఒమందురార్ ప్రభుత్వాసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించారు. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఏడుస్తూ కనిపించారు. ఆయన అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే డీఎంకే మద్దతుదారులు ఆసుపత్రి వద్ద గుమిగూడి ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు.

ప్రతిపక్షాల ఆగ్రహం 

నిన్న తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ ఇంటిపై ఈడీ దాడులు చేసిన తర్వాత ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు ప్రధాన ప్రతిపక్ష నేతలు ఈ దాడులను ఖండించారు.

ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న ప్రభుత్వాల మంత్రులపై ఈడీ చర్యలు కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సెంథిల్ బాలాజీ కార్యాలయంపై దాడితో అప్రజాస్వామిక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే నేతలే లక్ష్యంతో ఈడీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చేరువైందన్నారు. 

తమిళనాడు సీఎం ఏమన్నారంటే.

మంత్రి సెంథిల్ బాలాజీ సెక్రటేరియట్ కార్యాలయంపై ఈడీ దాడులు ఫెడరల్ వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ అనుసరిస్తున్న బ్యాక్ డోర్ వ్యూహం సత్ఫలితాలను ఇవ్వదు. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలను గమనిస్తున్న ప్రజల మౌనాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇది 2024 తుఫాను ముందు ఉన్న శాంతి తప్ప మరేమీ కాదని, ఇది బీజేపీని తుడిచేస్తుందని అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడి ఆగ్రహం

తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి కార్యాలయం సోదాల్లో ఈడీని దుర్వినియోగం చేయడాన్ని తమ పార్టీ ఖండిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ ప్రభుత్వం వేధింపులకు, బెదిరింపులకు చేస్తున్న ప్రయత్నాలు. రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మోదీ ప్రభుత్వ లక్షణం. ప్రతిపక్షాలను అణగదొక్కడంలో ఈ ఎత్తుగడలు సఫలం కావు అని అన్నారు. 

కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్

ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 'ప్రతిపక్షాలను వేధించడానికి, భయపెట్టడానికి బీజేపీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ కక్షసాధింపు చర్యలతో బీజేపీ ప్రజాస్వామ్యానికి కోలుకోలేని నష్టం చేస్తోందన్నారు.

'కేంద్ర సంస్థల దుర్వినియోగం నిరాటంకంగా కొనసాగుతోంది'

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ దాడులపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు. డీఎంకేపై బీజేపీ చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నామన్నారు. కేంద్ర సంస్థల దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. తమిళనాడు మంత్రి రాష్ట్ర సచివాలయం, ఆయన అధికారిక నివాసంపై ఈడీ దాడులు ఆమోదయోగ్యం కాదు. ఇది బీజేపీ హేయమైన చర్య అన్నారు.

మంత్రి బాలాజీ ఏమన్నారంటే.

కరూర్ జిల్లాకు చెందిన డీఎంకే సీనియర్ నేత బాలాజీ మాట్లాడుతూ అధికారులు తన కార్యాలయానికి ఏం వెతుక్కుంటూ వచ్చారో తనకు తెలియదని అన్నారు. దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. గతంలో అన్నాడీఎంకేలో ఉన్న బాలాజీ దివంగత జయలలిత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) నిబంధనల ప్రకారం ఈడీ చర్యలు తీసుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సెంథిల్ బాలాజీ నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ఈరోడ్‌తో పాటు బాలాజీ సొంత జిల్లా కరూర్‌లో కూడా సోదాలు నిర్వహించారు. సచివాలయంలోని బాలాజీ కార్యాలయ గదిలో కూడా సోదాలు చేశారు. అనంతరం ఆయన్ని రాత్రి 2 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. 

గత నెలలో రాష్ట్రంలో బాలాజీకి సన్నిహితుల నివాసాల్లో కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. గత నెలలో కరూర్ లోని బాలాజీకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లిన ఆదాయపు పన్ను శాఖ అధికారులపై దాడి జరిగింది. అందుకే ఈసారి ఈడీ అధికారుల వెంట కేంద్ర పారామిలటరీ బలగాల సిబ్బంది ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget