అన్వేషించండి

Drone War: ఇక ఆయుధాలు మాయం.. అంతా 'డ్రోన్ల' మయం

జమ్ముకశ్మీర్ లో ఇటీవల డ్రోన్ల దాడి తీవ్ర కలకలకం సృష్టించింది. ఇది మన రక్షణ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్లను గుర్తించి, నాశనం చేసే వ్యవస్థ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

" "నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికి వస్తా.. నీ మూతిమీద మొలిసింది నిజమైన మీసమే అయితే.. రారా చూసుకుందాం కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా" "
-

ఇది ఓ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్. అయితే మరి ఇప్పుడు యుద్ధాలకి కత్తులు వద్దు, తుపాకీలు కాదు.. అంతకుమించి"

సరిహద్దుల మాట అటుంచి.. కనీసం గడప కూడా దాటక్కర్లేదు. ఎక్కడో నుంచొని ఆపరేట్ చేస్తే పక్క దేశాన్ని పేల్చేయొచ్చు. ఇది నేటి మోడ్రన్ వార్.. 'డ్రోన్ల' యుద్ధం.

వరుసగా..

జమ్మూలోని వైమానిక దళం స్థావరంపై ఇటీవల డేగల వంటి అజ్ఞాత డ్రోన్లు పేలుడు పదార్థాలను జారవిడవడం భద్రతా దళాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భారత్‌ అత్యాధునిక యుద్ధసామర్థ్యాలకు ఇది పరీక్ష. డ్రోన్‌ ను ముందే పసిగట్టడం లేదా కూల్చివేయడం సంగతి పక్కన పెడితే, కనీసం అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వెంటనే గుర్తించలేకపోయారు. ఆ తరవాత పలు డ్రోన్లు వివిధ సైనిక స్థావరాల సమీపంలో దర్శనమిచ్చాయి. భారత్‌ వేగంగా మేలుకోకపోతే వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పాక్‌, దాని ఉగ్రసంస్థలకు అప్పనంగా అప్పజెప్పినట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొంతకాలంగా కశ్మీర్‌లో భారత సైన్యం వ్యూహాత్మకంగా ముందడుగు వేయడం వల్ల స్థానికులు ఉగ్రవాదం వైపు మళ్లడం కొంత తగ్గింది. ఫలితంగా పాక్‌ ఇప్పుడు డ్రోన్లపై దృష్టి పెట్టింది. భూమికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల వీటి ఆచూకీ గుర్తించడం రాడార్లకు కష్టం. చౌకగా లభించే వాణిజ్యశ్రేణి క్వాడ్‌కాప్టర్లు సైతం.. సరిహద్దుల్లోని గగనతల రక్షణ వ్యవస్థ రాడార్లు, కమ్యూనికేషన్‌ కేంద్రాలు, రాకెట్‌ లాంఛర్లను దెబ్బతీయగలవు. ఇలాంటి పరిస్థితినే అజర్‌బైజాన్‌తో యుద్ధంలో అర్మీనియా ఎదుర్కొంది.

డ్రోన్ల మయం..

2018లో వేలమంది దేశ సైనికుల ఎదుటే వెనెజువెలా అధ్యక్షుడు మడురోపై డ్రోన్‌తో హత్యాయత్నం జరిగింది. చైనా, పాక్‌, టర్కీలు డ్రోన్ల వినియోగంలో ఇప్పటికే మనకంటే చాలా ముందున్నాయి. చైనా, టర్కీ ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి డ్రోన్లను ఎగుమతి చేస్తున్నాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్‌ అల్లుడు బేరక్తర్‌ కుటుంబానికి చెందిన 'బేకర్‌' కంపెనీ డ్రోన్లు సిరియా, అర్మీనియా, లిబియాల్లో అరాచకం సృష్టించాయి. భారత స్థావరాలపై నిఘాకు ఇప్పటికే చైనా భారీ ఎత్తున డ్రోన్లను మోహరించింది. డ్రాగన్‌ అమ్ములపొదిలో చిన్నపాటి నానో డ్రోన్ల నుంచి సుదీర్ఘ సమయం గాలిలో ఎగురుతూ లక్ష్యాలను గుర్తించి దాడిచేసే లాయిటర్‌ మ్యూనిషన్ల వరకు ఉన్నాయి. 2011 ముందు కేవలం అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ మాత్రమే సాయుధ డ్రోన్లు వినియోగించాయి. పాక్‌ వద్ద సొంతంగా అభివృద్ధి చేసిన నెస్‌కామ్‌ బుర్రాక్‌ డ్రోన్‌ ఉన్నా, చైనా నుంచి వింగ్‌లూంగ్‌ శ్రేణి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది.

మనుషుల్ని మోస్తే..

  • ప్రస్తుతం డ్రోన్లను రకరకాల వ్యాపారాలకు, భద్రతకు ఇలా ఎన్నో వాటికి ఉపయోగిస్తున్నారు.
  • అమెజాన్ వంటి ఆన్ లైన్ దిగ్గజ సంస్థలు డ్రోన్లతో వస్తువలను డెలవరీ చేస్తున్నాయి.
  • చాలా దేశాల్లో లాక్ డౌన్ సమయంలో కరోనా సోకిన వారి ఇంటికి మందులను డ్రోన్లతో డెలవరీ చేశారు.
  • లాక్ డౌన్ ఆంక్షలను, భద్రతా విషయాల్లోనూ డ్రోన్లను వినియోగిస్తున్నారు.
  • అయితే డ్రోన్ల సాయంతో పక్క దేశాల్లోని రహస్య స్థావరాలు, ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడం ఆందోళన కలిగించే విషయం. పాకిస్థాన్ ఇప్పటికే ఇలాంటి పనులు చేస్తుంది. అయితే భారీ బరువులను మోసే డ్రోన్ల సాయంతో మనుషులను సరిహద్దులు దాటించే అవకాశం కూడా ఈ రోజుల్లో ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అలాంటిదే జరిగితే భద్రత పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఎంత బరువు మోయగలవు..

ప్రొఫెషనల్ డ్రోన్లు లేదా హెవీ లిఫ్టింగ్ డ్రోన్లు దాదాపు 40 lbs (18 కేజీ)ల బరువు మోయగలవు. అయితే 2017లో గ్రిఫ్ ఏవియేషన్ అనే డ్రోన్ల కంపెనీ గ్రిఫ్ 300 మోడల్ యూఏవీ డ్రోన్ ను తయారు చేసింది. ఇది దాదాపు 500 lbs (226 కేజీ)ల బరువున్న పేలోడ్ ను మోసుకెళ్లగలదు. ఈ నేపథ్యంలో భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. డ్రోన్ల తయారీ, కొనుగోలుపై ఎక్కవ దృష్టి పెట్టాలని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే మోడ్రన్ యుద్ధంలో భారత్ వెనుకబడిపోయే ప్రమాదం లేకపోలేదు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Capsized Vietnam: వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget