అన్వేషించండి

Dharmendra Political Career: ప్రభుత్వం నా మాట వినకపోతే పార్లమెంటు బిల్డింగ్ పైనుంచి దూకుతా.. అప్పట్లో ధర్మేంద్ర సంచలనం

Dharmendra Death News: లోక్ సభకు వెళ్ళాక పరిస్థితులు మారాయని ధర్మేంద్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ బికనీర్ నుంచి భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఇటీవల  ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు, నవంబర్ 12న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోసం ఇంట్లో ఐసియు వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. బాలీవుడ్ హీ మ్యాన్‌గా పేరుగాంచిన ధర్మేంద్ర కన్నుమూశారన్న వార్త సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. 

ధర్మేంద్ర జీవితానికి సంబంధించి, ముఖ్యంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన ఒక సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయింది. 2004 లోక్ సభ ఎన్నికల్లో భారత రాజకీయాల్లో షోలే చిత్రం ఛాయలు కనిపించాయి. ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ 'హీ మ్యాన్' ధర్మేంద్ర ఉత్సాహంగా మాట్లాడుతూ - 'ఒకవేళ ప్రభుత్వం నా మాట వినకపోతే, నేను పార్లమెంటు బిల్డింగ్ పైనుంచి దూకుతాను!' అని వ్యాఖ్యానించారు.  ధర్మేంద్ర ఈ సినిమా తరహా వార్నింగ్ ఎన్నికల సమయంలో దుమారం రేపింది. కానీ రీల్ లైఫ్ లాంటి ఫలితాలు రాజకీయాల్లో కనిపించలేదు. ఘన విజయంతో పార్లమెంటుకు వెళ్లిన ధర్మేంద్ర కొన్ని సంవత్సరాలలోనే రాజకీయాలతో విసిగిపోయి పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పారు. 

బిజెపికి ప్రచారంతో రాజకీయాల్లోకి ప్రవేశం
2004లో బిజెపి షైనింగ్ ఇండియా ప్రచారం ధర్మేంద్రను బాగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఆయన శతృఘ్న సిన్హాతో కలిసి లాల్ కృష్ణ అద్వానీ (LK Advani)ని కలిశారు. ఇక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. బిజెపి ధర్మేంద్రను రాజస్థాన్ లోని బికనీర్ సీటు నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. ప్రజాదరణ ఉన్న ధర్మేంద్ర కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్వర్ లాల్ దూడిని దాదాపు 60 వేల ఓట్ల తేడాతో ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టారు.

ఎన్నికల బరిలో షోలే స్టైల్
ఎన్నికల సమయంలో ధర్మేంద్ర తన షోలే సినిమాలోని డైలాగ్స్ చెబుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. 'ప్రభుత్వం నా మాట వినకపోతే, నేను పార్లమెంటు పైనుంచి దూకుతాను!' అని చెప్పడంతో అప్పట్లో సంచలనం. ఇది విన్న మద్దతుదారుల్లో రాజకీయాల్లో ఆయన గట్టిగా నిలబడతారని ఉత్సాహం కనిపించింది. 

విజయం తర్వాత ఆరోపణలు 
లోక్ సభకు చేరుకున్న ఆయన రాజకీయాలను తట్టుకోలేకపోయారు. ధర్మేంద్ర బికనీర్ లో ప్రజలను కలవడానికి తక్కువగా వెళ్తున్నారని, పార్లమెంటులో హాజరుశాతం చాలా తక్కువగా ఉందని, సినిమాల షూటింగ్ లేదా ఫామ్‌హౌస్‌లో బిజీగా ఉంటారని ఆరోపణలు రావడంతో నొచ్చుకున్నారు. కొంతమంది ఆయనను సమర్థిస్తూ, ఆయన ప్రత్యక్షంగా రాకపోయినా, వెనుక నుంచి పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నారని సపోర్ట్ చేశారు. మొత్తంమీద ఆయన ఇన్ యాక్టివ్ ఎంపీగా విమర్శలు ఎదుర్కొన్నారు.

రాజకీయాలపై విరక్తి
2009లో పదవీకాలం ముగియగానే ధర్మేంద్ర రాజకీయాలను స్వస్తి పలికారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. రాజకీయాలు తనకి సరైన వేదిక కాదని అంగీకరించారు. 'నేను పని చేసేవాడిని, క్రెడిట్ మరొకరు తీసుకునేవారు. బహుశా పాలిటిక్స్ నాకు సరికాదు.. అన్నారు. ఆయన కుమారుడు సన్నీ డియోల్ కూడా తండ్రికి రాజకీయాలు నచ్చలేదని, ఎన్నికల్లో పోటీ చేయడంపై పశ్చాత్తాపం ఉందన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget