అన్వేషించండి

G20 Summit: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు

G20 Summit: జీ 20 సమ్మిట్‌ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడపనుంది.

G20 Summit: జీ 20 సమ్మిట్‌కు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సమ్మిట్ జరగనుంది. ఢిల్లీ, నోయిడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడపనుంది. ఈ మేరకు బుధవారం DMRC ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే G-20 సమ్మిట్ నేపథ్యంలో 8 తేదీ నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీ మెట్రో రైలు సేవలు 04:00 AM నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

మూడు రోజుల పాటు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 6 వరకు 30 నిమిషాల వ్యవధిలో అన్ని లైన్లలో మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొంది. దాని తరువాత రోజువారి సాధారణ టైం టేబుల్ ప్రకారం మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపింది. అలాగే సెప్టెంబరు 9, 10 తేదీల్లో సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ మూసివేయబడుతుందని DMRC తెలిపింది. సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ మినహా సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అన్ని మెట్రో స్టేషన్లు సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంటాయని వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా సెప్టెంబర్ 09, 10 తేదీల్లో సుప్రీంకోర్టు స్టేషన్‌ మూసివేస్తున్నామని, ప్రయాణికులను ఎక్కడానికి / దిగడానికి అనుమతి లేదన్నారు. 

VVIP ప్రతినిధి బృందాల కోసం కొన్ని స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను కొంత సమయం పాటు నియంత్రించేలా భద్రతా ఏజెన్సీలను ఆదేశించవచ్చని DMRC పేర్కొంది. అలాగే సుప్రీం కోర్ట్, పటేల్ చౌక్, రామ కృష్ణ ఆశ్రమ మార్గ్ మెట్రో స్టేషన్లలో  మినహా, అన్ని స్టేషన్లలో పార్కింగ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మెట్రో సర్వీసులు సజావుగా సాగేందుకు ప్రయాణికులు సహకరించాలని, స్టేషన్ సిబ్బంది సూచనలను పాటించాలని డీఎంఆర్‌సీ కోరింది.

దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 25 దేశాలకు చెందిన లీడర్లతో సహా వివిధ ప్రపంచస్థాయి సంస్థల నాయకులు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్‌లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు.

మెట్రోను వినియోగించుకోండి
గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా, ఢిల్లీ మధ్య ప్రయాణించేటప్పుడు ప్రజలు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. నోయిడా ట్రాఫిక్ పోలీస్ 99710 09001, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ 1095/011-25844444 నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు తక్షణ సాయం అందించడానికి వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్ 87508 71493ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సూచనల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే ప్రజలకు తెలియజేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఢిల్లీ ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షల గురించి పలు సూచనలు ఇచ్చారు. పలు రూళ్లలో వాహనాల రాకపోకలను నిషేధించారు. కొన్నింటిని దారి మళ్లించారు. నోయిడా సరిహద్దు నుంచి ఢిల్లీకి భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాల ప్రవేశంపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామగ్రి రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Embed widget