అన్వేషించండి

G20 Summit: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు

G20 Summit: జీ 20 సమ్మిట్‌ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడపనుంది.

G20 Summit: జీ 20 సమ్మిట్‌కు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సమ్మిట్ జరగనుంది. ఢిల్లీ, నోయిడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడపనుంది. ఈ మేరకు బుధవారం DMRC ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే G-20 సమ్మిట్ నేపథ్యంలో 8 తేదీ నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీ మెట్రో రైలు సేవలు 04:00 AM నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

మూడు రోజుల పాటు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 6 వరకు 30 నిమిషాల వ్యవధిలో అన్ని లైన్లలో మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొంది. దాని తరువాత రోజువారి సాధారణ టైం టేబుల్ ప్రకారం మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపింది. అలాగే సెప్టెంబరు 9, 10 తేదీల్లో సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ మూసివేయబడుతుందని DMRC తెలిపింది. సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ మినహా సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అన్ని మెట్రో స్టేషన్లు సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంటాయని వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా సెప్టెంబర్ 09, 10 తేదీల్లో సుప్రీంకోర్టు స్టేషన్‌ మూసివేస్తున్నామని, ప్రయాణికులను ఎక్కడానికి / దిగడానికి అనుమతి లేదన్నారు. 

VVIP ప్రతినిధి బృందాల కోసం కొన్ని స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను కొంత సమయం పాటు నియంత్రించేలా భద్రతా ఏజెన్సీలను ఆదేశించవచ్చని DMRC పేర్కొంది. అలాగే సుప్రీం కోర్ట్, పటేల్ చౌక్, రామ కృష్ణ ఆశ్రమ మార్గ్ మెట్రో స్టేషన్లలో  మినహా, అన్ని స్టేషన్లలో పార్కింగ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మెట్రో సర్వీసులు సజావుగా సాగేందుకు ప్రయాణికులు సహకరించాలని, స్టేషన్ సిబ్బంది సూచనలను పాటించాలని డీఎంఆర్‌సీ కోరింది.

దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 25 దేశాలకు చెందిన లీడర్లతో సహా వివిధ ప్రపంచస్థాయి సంస్థల నాయకులు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్‌లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు.

మెట్రోను వినియోగించుకోండి
గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా, ఢిల్లీ మధ్య ప్రయాణించేటప్పుడు ప్రజలు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. నోయిడా ట్రాఫిక్ పోలీస్ 99710 09001, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ 1095/011-25844444 నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు తక్షణ సాయం అందించడానికి వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్ 87508 71493ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సూచనల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే ప్రజలకు తెలియజేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఢిల్లీ ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షల గురించి పలు సూచనలు ఇచ్చారు. పలు రూళ్లలో వాహనాల రాకపోకలను నిషేధించారు. కొన్నింటిని దారి మళ్లించారు. నోయిడా సరిహద్దు నుంచి ఢిల్లీకి భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాల ప్రవేశంపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామగ్రి రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trisha Vijay Krishnan: TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 
TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 
CM Chandrababu Naidu Delhi Tour: ప్రధాని మోదీ ఏడు సూత్రాలు ఒక జాతీయ మిషన్ .. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రధాని మోదీ ఏడు సూత్రాలు ఒక జాతీయ మిషన్ .. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Maleesha Kharwa Success Story: ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
Vijay Family: పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా  దూరం పెట్టారా...?
పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా  దూరం పెట్టారా...?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Revanth Friendship With Modi: రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Kadapa Tipu Sultan Row: కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
Embed widget