By: ABP Desam | Updated at : 02 May 2023 04:21 PM (IST)
Edited By: jyothi
మరణశిక్ష అమలుకు అనుసరిస్తున్నఉరి విధానంపై కమిటీ ఏర్పాటు
Death Penalty: దేశంలో మరణశిక్ష అమలుకు అనుసరిస్తున్న ఉరితీసే విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ క్రమంలోనే ఈ విధానాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణి సుప్రీం కోర్టుకు వెల్లడించారు. అలాగే మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే విధానం సరైనదేనా, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా అనే అంశాల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు అవసరం అని సుప్రీం కోర్టు సలహా ఇచ్చింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిపాదిత ప్యానెలలో సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి విచారణ తేదీని వేసువి సెలవుల తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
న్యాయవాది రిషి మల్హోత్ర.. మరణశిక్ష అమలులో ఉరితీసే పద్దతికి ఉన్న రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాలో ప్రాణాంతకమైన ఇంజక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు చేస్తుండగా.. మన దేశంలో ఉరిశిక్ష విధానం అనుసరిస్తున్నారు. అయితే దాంతో పోలిస్తే ఉరితీత అనేది చాలా క్రూరమైన, దారుమైన విధానం అని రిషి మల్హోత్ర పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఉరిశిక్ష అమలుకు మానవీయ పద్ధతుల్లో ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాలను పరిశీలించడానికి మరింత అంతర్లీన సమాచారం అవసరం అని కేంద్రానికి సూచించింది. దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి
ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో బీర్ టిన్ ఫొటో పెట్టాడు, బుక్ అయ్యాడు - కాస్త చూసుకోవాలిగా బ్రో
New Parliament Carpet: పార్లమెంట్లోని కార్పెట్ల తయారీకి 10 లక్షల గంటలు, 60 కోట్ల అల్లికలతో డిజైన్
New Rs 75 Coin: కొత్త పార్లమెంట్లో రూ.75 కాయిన్ని విడుదల చేసిన ప్రధాని
Wrestlers Protest: తుపాకులతో కాల్చి చంపేయండి, ఢిల్లీ పోలీసులపై బజ్రంగ్ పునియా ఫైర్
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!