అన్వేషించండి

Covid-19 in India: మరో 2 వారాల పాటు పెరగనున్న కరోనా వ్యాప్తి, తరువాత ఎండెమిక్ దశకు కోవిడ్

త్వరలోనే కొవిడ్ 19 ఎండెమిక్ దశకు చేరుకుంటుందని వైద్య నిపుణులు బుధవారం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఉంటుందన్నారు.

Corona Virus In India: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. అయితే ఒమిక్రాన్ లాంటి వేరియంట్ల కేసులు నమోదవుతున్నప్పటికీ, కొన్ని రోజుల్లో కరోనా తగ్గుముఖం పడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే కొవిడ్ 19 ఎండెమిక్ దశకు చేరుకుంటుందని వైద్య నిపుణులు బుధవారం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఉంటుందన్నారు.

మరో 10 నుంచి 12 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో రెండు వారాల తరువాత దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా మేరకు తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేరియంట్‌ ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణం అన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా జరిగి, కేసులు భారీగా నమోదవుతున్నా ఆందోళన అవసరం లేదన్నారు. ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయని పేర్కొన్నారు.  

కొత్తగా 2,14,242 మందికి పరీక్షలు నిర్వ‌హించ‌గా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ (ministry of health) బుధవారం వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మ‌ళ్లీ 223 రోజుల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 40,215 కు పెరిగింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 16 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య‌ 5,31,016 కు పెరిగింది.

ఢిల్లీ, పంజాబ్, హిమాచల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాలలో ఇద్ద‌రు చొప్పున‌, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. కేర‌ళ‌లో ఐదు వైరస్ సంబంధిత మరణాలు న‌మోదయ్యాయి. మొత్తంగా 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగ‌ళ‌వారం 5,676 న‌మోద‌వ‌గా, బుధ‌వారం 7,830 కేసులు న‌మోదు కావ‌డంతో భారీ పెరుగుద‌ల క‌నిపించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,47,76,002కి చేరుకుంది.

గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మ‌ళ్లీ సుమారు 7 నెల‌ల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. XBB1.16 వేరియంట్‌కు సంబంధించిన 1,774 కేసులు 22 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో గుర్తించారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటా ప్రకారం, వైర‌స్‌ సోకిన వారిలో 230 మందికి పైగా Omicron వేరియంట్‌కు చెందిన సబ్-వేరియంట్ XBB1.16.1 బారిన పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు మొత్తం యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉన్నాయి, అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

ఎండెమిక్‌ దశ అంటే..
కరోనా లాంటి ఏదైనా వ్యాధులు తక్కువ సమయంలో ఎక్కువ నమోదు కావడం, మరణాలు సంభవిస్తే పాండమిక్ లేదా మహమ్మారి అని ప్రకటిస్తారు. కొంతకాలానికి వ్యాప్తి తగ్గుతుంది. ఈ సమయంలో కేవలం కొన్ని ప్రాంతాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కేసులు నమోదైనా ప్రాణ నష్టం సైతం అతి తక్కువగా ఉండే ఈ స్థితిని ఎండెమిక్ స్టేజీ అంటారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, లాంటి వ్యాధులు త్వరగా వ్యాప్తి చెంది చివరకు ఎండెమిక్‌ వ్యాధులుగా గుర్తించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget