By: ABP Desam | Updated at : 06 Oct 2021 08:33 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
కరోనా సమయంలో లాక్ డౌన్ విధించిన వేళ వైరస్ ను సైతం లెక్క చేయకుండా శ్రమించిన అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొవిడ్ వేళ ప్రాణాలకు తెగించి వారు చేసిన సేవలకు గానూ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ను వర్తింపజేయనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఈ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లుగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాతో వెల్లడించారు.
కరోనా వేళ గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ గురించి అవగాహన కల్పించడం, ఆయా ప్రాంతాల్లో ప్రతి ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేయడం వంటి కార్యక్రమాల్లో అంగన్ వాడీ ఉద్యోగులు విశేషమైన సేవలు అందించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే లాక్ డౌన్ వేళ రేషన్ సరకులను ఇంటింటికీ వెళ్లి అంగన్ వాడీ ఉద్యోగులే అందించారు.
Also Read: కేటీఆర్ బినామీనని నమ్మించాడు.. కోట్లు కొల్లగొట్టాడు ! జగిత్యాలలో మహా మోసగాడు !
‘‘అంగన్ వాడీ వర్కర్లు, సహాయకులు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని పొందుతారు. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ బీమా సౌకర్యం కింద కరోనాకు సంబంధించిన డ్యూటీలో ఉండి ఆ జబ్బుతో చనిపోతే రూ.50 లక్షల సొమ్ము కుటుంబానికి వస్తుంది. దేశంలో అంగన్ వాడీ వర్కర్లు దాదాపు 13.29 లక్షల మంది వరకూ ఉన్నారు. అంగన్ వాడీ సహాయకులు 11.79 లక్షల మంది వరరకూ ఉన్నారు.’’ అని కేంద్ర శిశు సంక్షేమ శాఖలోని సీనియర్ అధికారి వెల్లడించారు.
అయితే, ఈ బీమా సౌకర్యానికి అర్హులయ్యే అంగన్ వాడీ ఉద్యోగులు, సహాయకులను గుర్తించే పనిని జిల్లా అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అన్ని రాష్ట్రాలకు ఇచ్చామని అధికారి వివరించారు. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సాయం అందుతుందని వివరించారు.
అంతకుముందు వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ప్రజా ఆరోగ్య సిబ్బంది, కరోనా పేషెంట్లకు నేరుగా సేవలు చేసే వైద్య సిబ్బంది సహా ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి గతంలోనే ఈ రకం బీమా సౌకర్యాన్ని కల్పించారు.
Also Read: 30గంటల నిర్బంధం తర్వాత ప్రియాంకా గాంధీ అరెస్ట్ - యూపీ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు !
Also Read: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..
Viral News: అరే ఏంట్రా ఇదీ ! ఏకంగా రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు - ఇద్దరు ఉద్యోగులపై వేటు !
MLC Kavitha: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి, అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి?: ఎమ్మెల్సీ కవిత
Supreme Court Judges: సుప్రీంకోర్టులో మరో ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణం - 32కు చేరిన జడ్జిల సంఖ్య!
Musharraf News: ముషారఫ్ పై శశిథరూర్ ట్వీట్ - శాంతికోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా చెప్పడంపై దుమారం!
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు, సింగిల్ బెంచ్ నిర్ణయాన్నే సమర్థించిన డివిజన్ బెంచ్
KTR Comments : EV ఇండస్ట్రీలో మూడేళ్లలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులు - తెలంగాణకు రానున్నాయన్న కేటీఆర్ !
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
BRS Mlas Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం - ఎమ్మెల్యే గువ్వల బాలరాజు