అన్వేషించండి

CWC Meeting : కాంగ్రెస్ పగ్గాలు మళ్లీ సోనియాకే, సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం

CWC Meeting :కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇవాళ జరిగిన భేటీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై వాడీ వేడి చర్చ జరిగింది.

CWC Meeting : కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా మళ్లీ సోనియాగాంధీ(Sonia Gandhi)నే ఆ పార్టీ ఎన్నుకుంది. దిల్లీలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Congress Working Committee) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక అంశం చర్చకు రాగా ఎక్కువ మంది నేతలు సోనియా గాంధీ వైపే మొగ్గుచూపారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నట్లు సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌(KC Venugopal) మీడియాకు వెల్లడించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాన చర్చ 

ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలను సీడబ్ల్యూసీలో ప్రధానంగా చర్చించినట్లు కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందని నేతలు అభిప్రాయ పడినట్లు వెల్లడించారు. పంజాబ్‌(Punjab)లో సీఎం మార్పు అనంతరం చర్యల విషయంలో జాప్యం పార్టీ అధికారం కోల్పోడానికి కారణమైందని పేర్కొన్నారు. లోపాలను సరిదిద్దుకొని సాధారణ ఎన్నికలకు సమాయత్తం అవుతామని ఆయన అన్నారు. పార్టీని సోనియా గాంధీ ముందుండి నడపాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పోటీకి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

ముకుల్ వాస్నిక్ ను అధ్యక్షుడు చేయాలంటున్న అసమ్మతి నేతలు 

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, పి. చిదంబరం, ఇతర నేతలు భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై అసహనంతో ఉన్న నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరో ముగ్గురు సీనియర్ నేతలు భేటీకి రాలేకపోయారని కాంగ్రెస్  వర్గాలు తెలిపాయి. ముకుల్‌ వాస్నిక్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు చేయాలని అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో నిరాశతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చాలామంది సీనియర్‌ నేతలు కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
Viral Brother Story: 10 మంది అక్కల ఓ తమ్ముడి కథ - ఇతని కష్టాలు వింటే మీ కష్టాలు చాలా చిన్నవని అనుకుంటారు!
10 మంది అక్కల ఓ తమ్ముడి కథ - ఇతని కష్టాలు వింటే మీ కష్టాలు చాలా చిన్నవని అనుకుంటారు!
Maintenance for wife: భార్యలు ఇంట్లో పనిమనుషులు కాదు - విడాకులు కోరిన భర్తకు షాక్ - ముంబై హైకోర్టు సంచలన తీర్పు.
భార్యలు ఇంట్లో పనిమనుషులు కాదు - విడాకులు కోరిన భర్తకు షాక్ - ముంబై హైకోర్టు సంచలన తీర్పు.

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget