అన్వేషించండి

Supreme Court: ఎన్నికల వేళ పార్టీల మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Election Manifesto: రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.

Election Manifestos By Political Parties: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు (Political Parties) ప్రకటించే మేనిఫెస్టోపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఎన్నికల చట్టాల (Election Laws) ప్రకారం మేనిఫెస్టోలోని పథకాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్నికల వేళ మేనిఫెస్టో ప్రకటించడం అవినీతి చేయడంతో సమానమని పిటిషనర్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది. జస్టిస్‌ సూర్యకాంత్ (Justice Surya Kant), జస్టిస్‌ వీకే విశ్వనాథన్‌ (Justice VK Viswanathan)లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ వాదన విచిత్రంగా ఉందని అభిప్రాయపడింది. తగిన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. 

కర్ణాటక హైకోర్టులో పిటిషన్
కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చామరాజనగర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ గెలుపొందారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తన మ్యానిఫెస్టోలో అనేక హామీలు ప్రకటించింది. దీనిపై శశాకం జె శ్రీధర అనే వ్యక్తి స్థానిక హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు అవినీతి కిందకే వస్తాయని పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన జమీర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ శశాంక శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు.

రాజకీయ పార్టీలు అధికారం చేపట్టేందుకు అలవిగాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. వీటి కారణంగా ప్రజలు ప్రలోభాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇష్టారీతిన మేనిఫెస్టోలు, హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత వాటిని విస్మరిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కారణంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు కూడా అవినీతికి కిందకే వస్తాయని, వీటిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని  కోరారు.

తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది. తాము అమలు చేయాలనుకుంటున్న విధానాల గురించి ఏదైనా పార్టీ ప్రకటించడాన్ని అవినీతిగా పరిగణించలేమని పేర్కొంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 కింద మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని తెలిపింది. వాటిని సంక్షేమ విధానాలుగానే చూడాలని, ఆర్థికపరంగా అవి సరైనవేనా కాదా అనేది వేరే విషయమని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో శశాంక దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారని ప్రశ్నించింది. మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని పిల్‌ను తోసిపుచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget