అన్వేషించండి

Supreme Court: ఎన్నికల వేళ పార్టీల మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Election Manifesto: రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.

Election Manifestos By Political Parties: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు (Political Parties) ప్రకటించే మేనిఫెస్టోపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఎన్నికల చట్టాల (Election Laws) ప్రకారం మేనిఫెస్టోలోని పథకాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్నికల వేళ మేనిఫెస్టో ప్రకటించడం అవినీతి చేయడంతో సమానమని పిటిషనర్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది. జస్టిస్‌ సూర్యకాంత్ (Justice Surya Kant), జస్టిస్‌ వీకే విశ్వనాథన్‌ (Justice VK Viswanathan)లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ వాదన విచిత్రంగా ఉందని అభిప్రాయపడింది. తగిన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. 

కర్ణాటక హైకోర్టులో పిటిషన్
కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చామరాజనగర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ గెలుపొందారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తన మ్యానిఫెస్టోలో అనేక హామీలు ప్రకటించింది. దీనిపై శశాకం జె శ్రీధర అనే వ్యక్తి స్థానిక హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు అవినీతి కిందకే వస్తాయని పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన జమీర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ శశాంక శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు.

రాజకీయ పార్టీలు అధికారం చేపట్టేందుకు అలవిగాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. వీటి కారణంగా ప్రజలు ప్రలోభాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇష్టారీతిన మేనిఫెస్టోలు, హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత వాటిని విస్మరిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కారణంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు కూడా అవినీతికి కిందకే వస్తాయని, వీటిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని  కోరారు.

తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది. తాము అమలు చేయాలనుకుంటున్న విధానాల గురించి ఏదైనా పార్టీ ప్రకటించడాన్ని అవినీతిగా పరిగణించలేమని పేర్కొంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 కింద మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని తెలిపింది. వాటిని సంక్షేమ విధానాలుగానే చూడాలని, ఆర్థికపరంగా అవి సరైనవేనా కాదా అనేది వేరే విషయమని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో శశాంక దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారని ప్రశ్నించింది. మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని పిల్‌ను తోసిపుచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget