అన్వేషించండి

Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి

Telugu States CMs: మాజీ ప్రధాని మన్మోహన్ పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. దేశం ఓ గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Chandrababu And Revanth Reddy Final Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు (CM Chandrababu), రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆయన మృతితో దేశం ఓ గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మన్మోహన్ మరణం బాధాకరమని.. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని.. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి.. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు.

అటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం మన్మోహన్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. బెళగావి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి మన్మోహన్ నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు ఎంపీలు, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

మన్మోహన్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు

అటు, మన్మోహన్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించనున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని.. ఆయనతో తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకూ మన్మోహన్ అందించిన సహకారం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సమయంలో ప్రతీ సందర్భంలోనూ మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో ఆయన అందించిన సహకారం మరువలేనిది. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్‌కు బీఆర్ఎస్ తరఫున ఘన నివాళులు.' అని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read: Manmohan Singh: 10 గంటల సర్జరీ తర్వాత మన్మోహన్ తొలి ప్రశ్న? - దేశం పట్ల అంకిత భావానికి నిదర్శనం ఇదే!, ఈ విషయాలు తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget