అన్వేషించండి

Delhi Elections 2025: నామినేషన్ వేసిన ఢిల్లీ సీఎం అతిషి - రేసులో రమేష్ బిధూరి! ఈసారి కళ్కాజీలో హోరాహోరీ తప్పదా?

Delhi CM Atishi Files Nomination From Kalkaji | ఢిల్లీ సీఎం అతీషి కళ్కాజి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

Delhi Assembly Elections 2025 | ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ వేశారు. కళ్కాజీ నియోజకవర్గం నుంచి  స్థానం నుండి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం వేయాల్సిన నామినేషన్ ను నేటికి వాయిదా వేసుకున్న అతీషి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌తో కలిసి ఎన్నికల కమిషన్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు.

ఆప్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు గిరి నగర్‌లోని కళ్కాజీ ఆలయంలో పూజలు చేసిన అతీషి, అనంతరం  గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. పార్టీ శ్రేణులతో రోడ్‌షో నిర్వహించిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ఆఫీసుకు వెళ్లి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రోడ్‌షో ఆలస్యం అయిన కారణంగా, ఆమె నామినేషన్  దాఖలు చేయకుండానే ఎన్నికల కమిషన్ ఆఫీసుకు వెళ్లారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే వీలుంటుంది.. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ సీఎం అతీషి కళ్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 

కళ్కాజీ నుంచి హోరాహోరీ..
కళ్యాజీ నియోజకవర్గంలో భారీ పోటీ నెలకొంది. కళ్కాజీ నుంచి ఆప్ అభ్యర్థిగా సీఎం అతిషి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ బిధురి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి  అల్కా లాంబాపై పోటీ చేస్తున్నారు. ‘గత ఐదేళ్లుగా నా నియోజకవర్గంలో విశ్రాంతి లేకుండా పనిచేశాను. కళ్యాజీ ప్రజలు నా కుటుంబం లాంటివారు. ఇక్కడి ప్రజలు నన్ను వారి బిడ్డగా, సోదరిగా చూస్తారు. నేను కేవలం వారికి ప్రతినిధిని మాత్రమే కాదు, వారి జీవితాల్లో భాగమే’ అని సీఎం అతీషి అన్నారు. పేదల విరోధి బీజేపీని ఓడించేందుకు తన నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అతిషి పేర్కొన్నారు. ఆప్ పేదల కోసం ఎంతో చేసింది, సామాన్యుడి పార్టీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ మురికివాడల నుంచి వెళ్లగొట్టిన వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు వారిపై కేసులు ఉపసంహరించుకుంటే తాను ఎన్నికల్లో పోటీ చేయనని కేంద్ర మంత్రి అమిత్ షాకు మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు.

ఢిల్లీలో ఎన్నికలు ఎప్పుడు..
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈసారి కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండనుంది. అయితే తాము సైతం రేసులో ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వరుస ఎన్నికల్లో ఢిల్లీలో సంచలన ఫలితాలు నమోదు చేసిన ఆప్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎలక్షన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం ఓటర్లలో 83.49 లక్షల మంది పురుషులు, 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,261 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 2.08 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీలో 85 ఏళ్లు పైబడిన వారు 1.09 లక్షల మంది ఓటర్లు ఉండగా, వందేళ్లు నిండిన వారు 830 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లకు ఎన్నికల అధికారులు అవగాహనా కల్పిస్తున్నారు. ఈ మేరకు అధికారులను ఈసీ ఆదేశించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Bandh: శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
Viran News: ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై  మహిళ ప్రసవానికి యువకుడి సాయం- డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మహిళ ప్రసవానికి యువకుడి సాయం - డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
No More ORS Drinks: చక్కెర పానీయాలకు 'ORS' లేబుల్ నిషేధం - ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం
చక్కెర పానీయాలకు 'ORS' లేబుల్ నిషేధం - ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం
Advertisement

వీడియోలు

Virat Kohli Tweet | India vs Australia | విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్
India vs Australia ODI | Virat Records | ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ సచిన్‌ను అధిగమిస్తాడా ?
Priyank Kharge vs Nara Lokesh on Google | పెట్టుబడులపై పెద్దయుద్ధం..వైజాగ్ vs బెంగుళూరు | ABP Desam
Haryana IPS officer Puran Kumar Mystery | ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ కేసులో ట్విస్ట్ | ABP Desam
కాంట్రాక్ట్‌పై సైన్ చేయని కోహ్లీ.. ఆర్సీబీని వదిలేస్తున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Bandh: శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
Viran News: ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై  మహిళ ప్రసవానికి యువకుడి సాయం- డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మహిళ ప్రసవానికి యువకుడి సాయం - డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
No More ORS Drinks: చక్కెర పానీయాలకు 'ORS' లేబుల్ నిషేధం - ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం
చక్కెర పానీయాలకు 'ORS' లేబుల్ నిషేధం - ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం
Sena tho Senani: సేనానితో కలిసి సేవలు చేసే సేనలో భాగం అవ్వాలనుకుంటున్నారా ? - ఇదిగో మీకో చాన్స్
సేనానితో కలిసి సేవలు చేసే సేనలో భాగం అవ్వాలనుకుంటున్నారా ? - ఇదిగో మీకో చాన్స్
Gujarat Jains: కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ప్లాన్ పాటిస్తే లక్షలు ఆదా - గుజరాతీలు 186 కార్లు కొని రూ.21 కోట్లు మిగుల్చుకున్నారు !
కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ప్లాన్ పాటిస్తే లక్షలు ఆదా - గుజరాతీలు 186 కార్లు కొని రూ.21 కోట్లు మిగుల్చుకున్నారు !
Chhattisgarh Naxals surrender: చత్తీస్‌ఘడ్‌లో  ఆశన్నతో సహా 208 మంది నక్సలైట్ల సరెండర్ - మావోయిస్టుల ఉనికి మరింత పతనం !
చత్తీస్‌ఘడ్‌లో ఆశన్నతో సహా 208 మంది నక్సలైట్ల సరెండర్ - మావోయిస్టుల ఉనికి మరింత పతనం !
Bigg Boss Telugu Today Promo : నిఖిల్ vs గౌరవ్.. నెక్స్ట్​ లెవెల్​లో కెప్టెన్సీ టాస్క్ పెట్టేసిన బిగ్​బాస్
నిఖిల్ vs గౌరవ్.. నెక్స్ట్​ లెవెల్​లో కెప్టెన్సీ టాస్క్ పెట్టేసిన బిగ్​బాస్
Embed widget