అన్వేషించండి

Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !

Sumanth Controversy | సుమంత్ వ్యవహారం లో రోహిన్ రెడ్డి పైన కూడా విచారణ జరపాలన్న డిమాండ్ కొండా వర్గం నుండి రావచ్చు. ఇది సీఎంకు ఇబ్బదికరంగా మారవచ్చు. హై కమాండ్ కూడా ఇంతటితో వదిలేయాలని చెప్పిందా.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మాజీ ఓఎస్డీ సుమంత్ వివాదం మంత్రి కొండా సురేఖ పదవికి ముప్పు తెచ్చింది.
  • బీసీ నినాదం, మహిళా సాధికారత కారణాలతో అధిష్టానం ఆమెపై చర్య తీసుకోలేదు.
  • కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు వివాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైపు మళ్లించాయి.
  • అధిష్టానం జోక్యంతో ప్రస్తుతానికి కొండా సురేఖ వివాదం సద్దుమణిగింది.

Konda Surekha vs Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో ఇరుక్కోవడం, తర్వతా ఆ వివాదం సద్దుమణగడం కొంతకాలం నుంచి రివాజుగా మారింది. అయితే, మాజీ ఓఎస్టీ సుమంత్ వ్యవహరం ఆమె పదవీ గండం వరకు దారి తీసింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వదవి నుండి సురేఖ ను తప్పించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఇదే పరిస్థితుల్లో కొండా సురేఖ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ పిలిచి మాట్లాడడం జరిగింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లు వార్తలు వస్తున్నా... పదవీ గండం నుండి కొండా సురేఖ బయటపడటానికి ప్రధానంగా రెండు కారణాలే దోహదం చేశాయి. ఈ రెండు కారణాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

జరిగిన వివాదం ఏంటంటే...?

మాజీ ఓఎస్డీ సుమంత్ దక్కన్ సిమెంట్ ప్రతినిధులను గన్ పెట్టి బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో సుమంత్ ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ నివాసానికి రావడం, అక్కడ సురేఖ కుమార్తే సుష్మిత వారిని అడ్డగించడం జరిగింది. ఈ సందర్భంలో సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. గతంలోను సినీ ప్రముఖడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రులతోను, వరంగల్ జిల్లా నేతలతోను ఉన్న విబేధాలు కారణంగా ఆమెను పదవి నుండి తొలగిస్తారన్న ప్రచారం బాగా సాగింది. ఏకంగా తనపైన, తన కుటుంబ సభ్యులపైన క్యాబినెట్ మంత్రిగా ఉండి కొండా సురేఖ, ఆమెతో పాటు సుష్మిత ఎలా వాఖ్యలు చేస్తారని సీఎం ఇతర మంత్రుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఏ చర్య తీసుకోకుండా ఉంటే అది తన సమర్థత పైన, తన విశ్వసనీయతపైన అది ప్రభావం చూపిస్తుందని హై కమాండ్ తో కూడా వాదించినట్లు తెలిసింది.


Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !

హైకమాండ్ సైతం పలు మార్లు వివాదాల్లో కొండా సురేఖ పేరు వినపడటం తమకు తలనొప్పిగా ఉందన్న అభిప్రాయంలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖ ఇంటి వద్ద భద్రత తగ్గించడం, ఆమె శాఖ ఫైళ్లన్నింటిని సీఎం తెప్పించారన్న వార్తలు వచ్చాయి. ఇక వేటు మంత్రి పదవి నుండి కొండా సురేఖ ను తొలగించడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సీన్ మారిపోయింది. కొండా వివాదం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ల వద్దకు చేరింది. క్యాబిటెన్ మీటింగ్ ఉన్నప్పటికీ కొండా సురేఖను పార్టీ అధిష్టానం పిలిచి ఈ వివాదంపై చర్చించింది. ఈ వివాదాన్ని తాను హైకమాండ్ కే వదిలేస్తున్నానని, వారే దీన్ని పరిష్కరిస్తామని హమీ ఇచ్చినట్లు ఆ సమావేశం ముగిసాక మీడియా ముందు తెలిపింది. వేటు తప్పదన్న తరుణంలో కొండా సురేఖను రెండు కారణాలు కాపాడాయని తెలుస్తోంది.

మొదటి కారణం - కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న బీసీ నినాదం

హిందుత్వ ఎజెండాతో బీేజేపీ దేశంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుంటే, దానికి విరుగుడుగా కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకుంది. అందుకు తొలి ప్రయోగ శాల తెలంగాణ రాష్ట్రం అయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. కోర్టుల్లో ఇది నానుతున్నా ప్రజల్లోకి మాత్రం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పెద్ద ఎత్తును ఆ పార్టీ తీసుకెళ్తోంది. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ బీసీ మంత్రం తమ పార్టీని కేంద్రంలోను, అధికారంలోను తీసుకువస్తుందన్న ఆశతో హస్తం నేతలు ఉన్నారు. ఈ క్రమంలో క్యాబినెట్ లో బీసీ మహిళా మంత్రి అయిన కొండా సురేఖను తొలగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుదంన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి పట్టుబట్టినా అధిష్టానం మాత్రం నో చెప్పినట్లు సమాచారం.

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ

బీసీ నినాదంతో కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా చర్చ లేవనెత్తుతుంటే క్యాబినెట్ లో ఉన్న బీసీ మహిళా మంత్రిని తొలగిస్తే అది మరింత వివాదం అవుతుందన్న ఆలోచనలో హైకమాండ్ పెద్దలు ఉన్నట్లు అర్థం అవుతుంది. కొండా సురేఖను తొలగిస్తే రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం బీసీలే. ఈ తొలగింపు వ్యవహరం వారికి పార్టీపై నెగిటెవ్ సంకేతాలు పంపుతుందన్న నిర్ణయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్లు సమాచారం. కొండా సురేఖను పదవి నుండి తొలగిస్తే బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అన్న విమర్శను బీసీ సంఘాల నుండి అటు ప్రతిపక్షాల నుండి ఎదుర్కోకక తప్పని పరిస్థితి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పట్టుబట్టినా వద్దని వారించినట్లు సమాచారం.

మరో వైపుఈ వివాదాన్ని ఇప్పటికే కొండా సురేఖ వర్గీయులు బీసీ వర్సెస్ రెడ్ల మధ్య పోరుగా అభివర్ణించడాన్ని కూడా అధిష్టానం దృష్టికి వచ్చి కొండా సురేఖపై ఎలాంటి చర్యకు పచ్చజెండా ఊపలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో పాటు మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రతీ చోట మాట్లాడుతోంది. అలాంటిది క్యాబినెట్ నుండి మహిళను తప్పించడం కూడా మహిళలకు తప్పుడు సంకేతాలు పంపుతుందన్న ఆలోచన పార్టీ పెద్దలు చేసినట్లు హస్తం ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇన్ని మైనస్ పాయింట్లు ఉండటంతో ఈ వివాదానికి ప్రస్తుతం ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ కు, మంత్రి కొండా సురేఖకు సర్దిచెప్పినట్లు చెబుతున్నారు.

రెండో కారణం - వివాదాన్ని తన వ్యాఖ్యలతో మలుపు తిప్పిన కొండా సుష్మిత

బీసీ మంత్రి కావడం వల్ల కొండా సురేఖను పదవి నుండి తప్పించకపోవడానికి ప్రధాన కారణం అయితే, రెండో కారణం కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు కూడా ప్రధాన కారణంగా మారింది. మాజీ ఓఎస్టీ సుమంత్ గన్ పెట్టి బెదిరించారన్న ఆరోపణలపై ఆమె మీడియా ముందు మాట్లాడుతూ ఈ వివాదంలోకి సీఎం రేవంత్ రెడ్డిని లాగడం ఇక్కడ కీలక మలుపుగా చెప్పవచ్చు. పోలీలుసులు చెబుతున్నట్లు సుమంత్ గన్ తో బెదిరించిన వ్యవహారం అంతా సీఎం సన్నిహితుడైన రోహిన్ రెడ్డి కార్యాలయంలోనే జరిగింది మీడియా ముందు చెప్పడంతో దీంట్లో సీఎం ను భాగస్వామ్యుడ్ని చెసినట్లయింది. సీఎం రేవంత్ రెడ్డినే గన్ ఇచ్చి పంపారు అన్న వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అంతే కాకుండా సీఎం సోదరులు దందాలు చేస్తున్నారని, వారికి పోలీస్ భద్రత ఎందుకన్న సుష్మిత వ్యాఖ్యలు సీఎంను ఇరకాటంలో పడవేశాయి. అంతే కాకుండా ఢిల్లీలో తన తల్లిని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందే అవమానించారని చెప్పడం కూడా కొన్ని వర్గాల్లో కొండా సురేఖకు సింపతీని అందిచాయి.

రాజకీయంగా సీఎంకు ఇబ్బందికర పరిస్థితి

సుమంత్ వ్యవహారం సాగదీసి విచారణ జరిపితే అక్కడ రోహిన్ రెడ్డి పైన కూడా విచారణ జరపాలన్న డిమాండ్ కొండా వర్గం నుండి రావచ్చు. ఇది రాజకీయంగా సీఎంకు ఇబ్బదికరంగా మారవచ్చు అన్న కారణంతో హై కమాండ్ కూడా దీన్ని ఇంతటితో వదిలేయాలని ఇరు వర్గాలకు చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డే తన తల్లిపై కుట్రకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించడంతో అటు ప్రజల్లోను సీఎం రేవంత్ వ్యవహారంపై ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు మంత్రి పదవి నుండి తప్పించడానికి రెడ్డి మంత్రులు కుట్ర చేస్తున్నారన్న మరో ప్రధాన ఆరోపణ రాష్ట్రంలో కుల పంచాయతీకి తెరలేపినట్లయింది. ఇదే కాకుండా టెండర్ల విషయంలోను తమ వర్గానికి అప్పగించడంలో మంత్రులు జోక్యం చేసుకుంటున్నారన్న అంశాన్ని కూడా సుష్మిత మీడిాయ ముందు చెప్పడం పార్టీకి ఇబ్బంది కలిగించేలా పరిణమించాయి. ఈ క్రమంలోనే కొండా సురేఖ మీడిాయ ముందు మాట్లాడుతుందని సమాచారం బయటకు రాగానే దీన్ని ఇంతటితో ఆపకపోతే పార్టీకి చెడ్డపేరు రావడం ఖాయమన్న ఆలోచనలతో హైకమాండ్ రంగంలోకి దిగింది. పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ఇరు వర్గాలకు సర్దిచెప్పి ప్రస్తుతానికి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది.

అయితే ఏది ఏమైనా కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య తగాదా ప్రభుత్వంలోని లుకలుకలను బయటపెట్టింది. మంత్రుల మధ్య విబేధాలు ఈ వ్యవహారంతో రచ్చకెక్కాయి. అవినీతి, బెదిరింపులు జరుగుతున్నాయన్న మచ్చ కాంగ్రెస్ సర్కార్ పై పడింది. అయితే రానున్న కాలంలో ఈ వివాదాలు, సమస్యలకు రేవంత్ సర్కార్ ఎలా ముగింపు ఇస్తుందో వేచి చూడాల్సిందే.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget