అన్వేషించండి

Clean Air Survey: స్వచ్ఛ వాయు సర్వేలో ఇండోర్ మొదటి స్థానం, ఆ తర్వాత స్థానాల్లో ఏ ప్రాంతాలంటే?

Clean Air Survey: ప్రతీ సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఆగ్రా, ఠాణె నిలిచాయి.

Clean Air Survey: కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో పది లక్షల కంటే జనాభా ఎక్కువ గల నగరాల్లో మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా, మూడో స్థానంలో మహారాష్ట్రలోని ఠాణె ఉన్నాయి. ఈ సర్వే వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ గురువారం రోజు వెల్లడించింది. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ఎన్సీఏపీ కింద 131 నగరాల్లో నగర కార్యాచరణ ప్రళాళిక, వాయు నాణ్యత కింద ఆమోదించబడిన కార్యకలాపాల అమలు ఆధారంగా నగరాలకు ర్యాంకులు కేటాయించింది. అలాగే రెండో విభాగంలో మూడు నుంచి 10 లక్షల లోపు జనాభా గల నగరాల్లో మహారాష్ట్రలోని  అమరావతి మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే ఉత్తర ప్రదేశ్ కు చెందిన మొరాబాద్ రెండో స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు మూడో స్థానంలో నిలిచింది. 

మూడు లక్షల లోపు జనాభా గల నగరాల్లో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన పర్వానూ తొలి స్థానం దక్కించుకోగా.. ఆ రాష్ట్రానికి చెందిన కాలా అంబ్ రెండో స్థానం, ఒడిశాలోని అంగుల్ మూడో స్థానాన్ని సంపాదించుకుంది. వచ్చే ఏడాది నాటికి దేశంలో పీఎం 2.5, పీఎం10 సూక్ష్మధూళి కణాల స్థాయిని 20 నుంచి 30 శాతం తగ్గించాలని ఏన్సీఏపీ లక్ష్యంగా పెట్టుకుంది.  

మరోవైపు మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఢిల్లీ నగరంలో కాలుష్యం అత్యంత విపరీతంగా ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న కాలుష్యం స్థాయి ఇదే రీతిలో కొనసాగితే.. ఢిల్లీ నగరంలో నివసించే పౌరుల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గుతుందని హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్.. ఢిల్లీ కాలుష్యంపై ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) నివేదికను విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే ఢిల్లీ నగరంలో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 

భారత దేశంలో 67.4 శాతం మంది ప్రజలు.. కాలుష్య స్థాయిలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పీఎం2.5 కారణంగా దేశ ప్రజల సరాసరి జీవిత కాలం 5.3 ఏళ్లు తగ్గిపోతున్నట్లు షికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడ ఉన్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోబోతున్నారని పేర్కొంది.

పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాను అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించిన షికాగో వర్సిటీ నివేదిక.. అక్కడ కూడా కాలుష్య స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన ప్రమాణాల ( పీఎం 2.5) కంటే 7 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే తీవ్రమైన కాలుష్యం స్థాయిలు కొనసాగితే.. పఠాన్ కోట్ జిల్లా ప్రజల వయస్సు కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక అంచనావేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
Advertisement

వీడియోలు

Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Embed widget