అన్వేషించండి

Tragedy After Game Changer Event: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ చూసి వెళుతూ ఇద్దరు మృతి.. తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం

Pawan Kalyan on Tragedy After Game Changer Event: ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక అనంతరం చోటు చేసుకున్న విషాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ ఘటనకు ఆయన చెప్పిన కారణం ఏమిటంటే..

రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మాకంటే మీ ఇంట్లో మీ అమ్మనాన్నలు, అన్నదమ్ములు ముఖ్యం. కుదిరితే వారందరినీ అడిగానని చెప్పండి. పెద్దవాళ్ల నుండి ఆశీస్సులు కోరానని చెప్పండి అంటూ.. అభిమానులకు ఒకటికి రెండు సార్లు పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. అంత చేసినా కూడా ఆ ఈవెంట్ చూసి.. ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోయినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గేమ్ చేంజర్ ప్రమోషనల్ ఈవెంట్‌లో దిల్ రాజు చెబుతూ.. మృతుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇద్దరు అభిమానుల మృతి చెందడం ఎంతో బాధగా ఉందంటూ ఆయన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

ఈ ఘటనపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరమని, కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని, గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకున్న నాధుడే లేదని వాపోయారు. బాగా పాడైపోయిన ఈ రోడ్డును ప్రస్తుతం బాగు చేస్తున్నారని తెలిపారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని తెలిపారు. ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ బైక్ మీద వెళ్తుండగా వాహనం ఢీ కొట్టడంతో ప్రాణాలు విడిచారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండు సార్లు విజ్ఞప్తి చేశా. అయినా ఇలా జరగడం నన్ను కలిచి వేసిందని అన్నారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. ప్రభుత్వం తరపున తగిన సహాయం అందించేలా చూస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే..

‘‘గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రహదారులు అద్వాన్నంగా తయారయ్యారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్‌కు విషయం తెలిసి..
తన సినిమా ఈవెంట్ చూసి ఇంటికి వెళుతున్న ఇద్దరు అభిమానులు మృతి చెందారని తెలిసిన రామ్ చరణ్.. వెంటనే తన మనుషులను ఆ మృతుల కుటుంబాల ఇంటికి పంపించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబాలకు కావాల్సిన అవసరాన్ని తీర్చాలని వారికి సూచించినట్లుగా సమాచారం. మరి ఆయన ఎంత ఆర్థిక సాయం అందిస్తారనేది తెలియాల్సి ఉంది. 

Also Read :  క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
Delhi Bomb Blast : ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
Official Apology : క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
Advertisement

వీడియోలు

SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని  సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
Chinnaswamy Stadium RCB | 2026లో  చిన్నస్వామి స్టేడియంపై బ్యాన్‌లో నో ఐపీఎల్ | ABP Desam
Ind vs SA | టాస్ కాయిన్ మార్చాలని డిసైడ్ అయిన బెంగాల్ క్రికెట్ అససియేషన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
Delhi Bomb Blast : ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
Official Apology : క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
Globetrotter Main Cast: ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?
ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?
Chiranjeevi - Ram Charan: సక్సెస్‌ ట్రాక్‌లోకి చిరు - చరణ్... వైరల్ సాంగ్స్‌తో మెగా ఫ్యాన్స్ హ్యాపీ
సక్సెస్‌ ట్రాక్‌లోకి చిరు - చరణ్... వైరల్ సాంగ్స్‌తో మెగా ఫ్యాన్స్ హ్యాపీ
Anirudh Ravichander Kavya Maran: కావ్య మార‌న్‌తో అనిరుధ్ సీక్రెట్‌ ట్రిప్‌... ఇలా దొరికేశారేంటి?
కావ్య మార‌న్‌తో అనిరుధ్ సీక్రెట్‌ ట్రిప్‌... ఇలా దొరికేశారేంటి?
Mancherial Crime News: మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
Embed widget