అన్వేషించండి

Stock Market Crash: స్టాక్‌ మార్కెట్లలో HMPV కేస్‌ భయం - సెన్సెక్స్ 1200, నిఫ్టీ 400 పాయింట్లు క్రాష్‌

First HMPV Case In India: దేశంలో తొలి HMPV కేసు వెలుగులోకి రావడంతో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారులు ఒక్క పూటలోనే 9 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు.

Stock Market Crash On HMPV Fear: భారతదేశంలో మొదటి HMPV కేసును గుర్తించడంతో భారతీయ స్టాక్ మార్కెట్లలో భయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి... బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE) సెన్సెక్స్ 1,263 పాయింట్లు పతనమై 77,959.95 స్థాయికి పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ కూడా 402 పాయింట్లు క్షీణించి 24000 దిగువనకు జారిపోయింది, 23,601.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని చూసింది. బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లలో భారీ క్షీణత కనిపిస్తోంది. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో కూడా భారీ క్షీణత కనిపిస్తోంది. మార్కెట్ అస్థిరతను కొలిచే ఇండెక్స్ ఇండియా విక్స్ (INDIA VIX) 13.37 శాతం క్షీణతతో ట్రేడవుతోంది. 

ఈ రోజు (సోమవారం, 06 జనవరి 2025) BSE సెన్సెక్స్ 79,281.65 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. NSE నిఫ్టీ 24,045.80 స్థాయి దగ్గర స్టార్ట్‌ అయింది. 

మార్కెట్‌కు కరోనా గుర్తుకొచ్చింది
బెంగళూరులో తొలి హెచ్‌ఎంపీవీ కేసు నమోదైందని ఉదయం వార్తలు వచ్చిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో పతనం ప్రారంభమైంది. ఈ వైరస్‌ మొదట చైనాలో బయటపడింది, ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కొన్ని రోజులుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడ్డారని ఆ రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తోంది. 

మన దేశంలో, బెంగళూరు మొదటి HMPV కేస్‌ బయటపడ్డట్లు రిపోర్ట్స్‌ రావడంతో, మార్కెట్ పెట్టుబడిదారులకు 5 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి గుర్తుకు వచ్చింది. నిద్రాణంగా ఉన్న కరోనా భయం HMPV రూపంలో బయటికొచ్చే సరికి మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వచ్చినంతవరకు చాలు అనుకుంటూ పెట్టుబడిదారులు షేర్లను అమ్మడం స్టార్ట్‌ చేశారు. 

HMPV వల్ల రూ.లక్షల కోట్ల నష్టం
కర్ణాటకలో HMPV కేసు వెలుగులోకి రావడంతో నేటి సెషన్‌లో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. BSEలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ విలువ గత సెషన్‌లో రూ. 449.78 లక్షల కోట్లుగా ఉండగా, ఈ రోజు అది రూ. 440.74 లక్షల కోట్లకు తగ్గింది. అంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ఒక్క పూటలోనే (ఈ రోజు మధ్యాహ్నానికి) రూ. 9.04 లక్షల కోట్లు తగ్గింది.  

అనూహ్య పతనం తర్వాత, ఇంట్రాడే కనిష్ట స్థాయుల నుంచి మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 937.13 పాయింట్లు లేదా 1.18 శాతం పడిపోయి 78,285.98 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 290.10 పాయింట్లు లేదా 1.21 శాతం క్షీణించి 23,714.65 పాయింట్ల వద్ద కదులుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయంతో మీ రిటైర్మెంట్‌ నాటికి రూ.కోట్ల కొద్దీ డబ్బు 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryakumar Yadav Records: 4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
KCR at BRS Meeting: సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
Mahesh Babu: ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamMS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP DesamThala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryakumar Yadav Records: 4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
KCR at BRS Meeting: సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
Mahesh Babu: ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
IPL 2025 MI vs LSG: రికెల్టన్, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు, లక్నో ముంగిట ముంబై భారీ టార్గెట్
రికెల్టన్, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు, లక్నో ముంగిట ముంబై భారీ టార్గెట్
PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులును కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు, కానీ విచారణకు బ్రేకులు
పీఎస్ఆర్ ఆంజనేయులును కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు, కానీ విచారణకు బ్రేకులు
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ చరిత్ర సృష్టించబోతోంది.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
Embed widget