By: ABP Desam | Updated at : 26 May 2022 07:32 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
హరిద్వారా ఎస్డీఎం కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులను పోషించకుండా వారిని వేధిస్తున్న పిల్లలకు చెంపపెట్టులాటి తీర్పు చెప్పింది. తాము కట్టించిన ఇంట్లోనే ఉంటూ.. తమను వేధిస్తున్నారని కొందరు తల్లిదండ్రులు హరిద్వార్ ఎస్డిఎం కోర్టును ఆశ్రయించారు. వాళ్ల వాదనలు విన్న హరిద్వార్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. తల్లిదండ్రులు కూడబెట్టిన ఇంటి నుంచి వెళ్లిపోమని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా తమను సరిగా చూసుకోని, సంరక్షించని పిల్లలపై SDM కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. చట్టంలోని సెక్షన్ ప్రకారం SDM తరపున విన్నవించిన తర్వాత వాళ్ల వాదనలో న్యాయం ఉంటే పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాంటి ఓ పిటిషన్పై హరిద్వార్ SDM కోర్టు తీర్పు చెప్పింది.
తమను పిల్లలు వేధిస్తున్నారని ఆరుగురు సీనియర్ సిటిజన్లు హరిద్వార్ ఎస్డీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం SDM న్యాయమూర్తి పురాన్ సింగ్ రాణా ఈ కేసులను విచారించారు. జ్వాలాపూర్, కంఖాల్, రావాలి మెహదూద్ తమ పిల్ల లపై పిటిషన్ వేశారు. తాము పిల్లలతో కలిసే ఉంటున్నామని కానీ తమకు ఫుడ్ పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. అడిగితే కొట్టి హింసించారన్నారు. ఈ పరిస్థితులులో తమ వృద్ధాప్య జీవితం నరకప్రాయంగా మారిందన్నారు.
తమ పిల్లల నుంచి ఉపశమనం కలిగించాలని ఈ మూడు వృద్ద జంటలు కోర్టును ఆశ్రయించాయి. పెద్దల పిటిషన్ను విచారించిన పురన్ సింగ్ రాణా... మొత్తం ఆరు కేసుల్లో తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల నుంచి పిల్లలకు చెందకుండా చేయాలని తీర్పు చెప్పారు. 30 రోజుల్లోగా వాళ్లు ఉంటున్న తల్లిదండ్రులకు అప్పగించి ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీళ్లెవరూ ఇళ్లు ఖాళీ చేయకుంటే సంబంధిత స్టేషన్ ఇన్ఛార్జ్లపై చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.
మోసం కేసుల్లో సత్వర నిర్ణయం
మోసపూరితంగా తల్లిదండ్రుల ఆస్తిని కుమారుడు తన పేరున రాయించుకొని వేధిస్తున్నారని... ఇలాంటి కేసుల విచారణ కూడా చివరి దశలో ఉందని పురన్ సింగ్ రాణా తెలిపారు.
అంబులెన్స్ కు దారివ్వని బిహార్ సీఎం సెక్యూరిటీ, ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు
Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు
ESIC Recruitment 2023: ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్లో ఎన్ని పోస్టులంటే?
PM Modi: వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయండి, నెల రోజులు టైమ్ ఇచ్చిన ప్రధాని మోడీ
Ujjain Rape Case: 'నా కొడుకుని ఉరి తీయాలి', ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి డిమాండ్
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ
Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?
Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్బస్టర్ మూవీ సీక్వెల్తో
/body>