అన్వేషించండి

Maoist Encounters: ఈ ఏడాది వరుస ఎన్‌కౌంటర్లు - 37 రోజుల్లో 81 మంది మావోయిస్టుల మృతి

Encounter News | 2025 లో వరుస ఎన్‌కౌంటర్లతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత చర్యను ముమ్మరం చేసింది. కేవలం 5 వారాల వ్యవధిలో జరిగిన ఎన్ కౌంటర్లలో 81 మంది మావోయిస్టులు మృతిచెందారు.

వరుస ఎన్‌ కౌంటర్లు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. మావోయిస్టులకు పట్టున్న ఛత్తీస్ ఘడ్ కేంద్రంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఏరివేత లో భాగంగా ఎన్ కౌంటర్ లు నిత్యకృతయమయ్యాయి. ఒక ఎన్ కౌంటర్ మరువక ముందే మరో ఎన్ కౌంటర్ జరుగుతుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారి పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. నిన్న ఆదివారం ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. పోలీస్ బలగాలు, మావోయిస్టుల తూటాలకు 31 మంది మావోయిస్టులు మృతి చెందగా. మృతుల్లో 11 మంది మహిళలు, 20 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటనలో తెలిపారు. 

పక్కా సమాచారం.. విరుచుకుపడ్డ బలగాలు..

పక్కా సంచారంతో పోలీస్ బలగాలు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. మావోయిస్టుల ఏరివేత లో భాగంగా DRG, STF తో పాటు కేంద్ర బలగాలు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురు పడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టు బస్తర్ ఐజీ తెలిపారు. ఈ ఎన్ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఎన్‌ కౌంటర్ స్థలం నుండి AK 47, SLR, INSAS రైఫిల్, 303 ఆయుధాలతో పాటు మావోయిస్టులు తయారు చేసిన రాకెట్ లాంచర్, బిజిఎల్ లాంచర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ తెలిపారు. 

ఫిబ్రవరి నెలలో రెండు ఎన్ కౌంటర్లు.

ఫిబ్రవరి 1వ తేదీన ఛత్తీస్‌ ఘఢ్‌ బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు జరిగిన జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. 

మరో ఒకటి నిన్న ఫిబ్రవరి 9వ తేదీన ఛత్తీస్ ఘడ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ భారీ సంఖ్యలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు.

జనవరి నెలలో ఆరు ఎన్ కౌంటర్లు..

- జనవరి 29 న జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసా, సోమావా పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలం నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ లు తెలిపారు.

- జనవరి 19 వ తేదీన ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ బలగాలకు, మావోయిస్టుల మధ్య మొదలైన ఎదురుకాల్పులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. ఈ ఎన్ ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కీలక నేతను కోల్పోయింది. కేంద్రకమిటీ సభ్యులు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి మృతి చెందారు.

- జనవరి 16 వ తేదీన ఛత్తీస్ ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో పోలీస్ లకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్ లు వెల్లడించారు. 16 వ తేదీన నుండి 17 వ తేది రెండు రోజుల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ తప్పించుకున్నారు. ఈ ఎన్ ఎన్ కౌంటర్ రెండు రోజులకు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. పూజారి కంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు లేఖ లో పేర్కొన్నారు.

- జనవరి 12 వ తేదీన ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లా నేపనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రత దళాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీస్ తెలిపారు. ఘటన స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ లు వెల్లడించారు.

- జనవరి 5 వ తేదీన నారాయణపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన లో ఒక జవాన్ మృతి చెందినట్లు పోలీస్ లు ప్రకటించారు.

2025 కొత్త సంవత్సరం ప్రారంభమైన మూడు రోజులకే 3 వ తేదీన ఒడిశా సరిహద్దుల్లో బలగాలకు, మావోల కు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు గారియాబాద్ పోలీస్ లు వెల్లడించారు. 

వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టుల ఏరివేత..

మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు, ఆయా రాష్ట్ర పోలీసులు, మావోయిస్టుల ఏరివేతకు ఏర్పాటు చేసిన బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ ను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాన్ని పోలీస్ బలగాలు దండకారణ్యాన్ని జల్లడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టు దళాలు ఎదురు పడడం లేదా పక్క సమాచారంతో బలగాలు మావోయిస్టులను మట్టుపెడుతున్నారు. ఈ సంవత్సరం 2025 జనవరి 3 తేదీన నుండి మొదలైన ఎన్ కౌంటర్లు వరుసగా కొనసాగుతున్నాయి.

అమిత్ షా స్పందన..

నిన్న ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పారు. నిన్న ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టు లు భారీ విజయాన్ని సాధించాయనీ చెప్పారు. అయితే మావోయిస్టు లకు సంబంధించి మాట్లాడిన ప్రతి సారి 2026 కల్లా మావోయిజం లేకుండా చేసామని అమిత్ షా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నట్లు భావించాలి.

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget