అన్వేషించండి

Char Dham Yatra Pilgrims Death: చార్​ధామ్ యాత్రలో విషాదాలు, ఇప్పటివరకు 31 మంది భక్తులు మృతి - కారణం ఏంటంటే !

Char Dham Yatra Pilgrims Deaths: చార్​ధామ్ యాత్రలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇప్పటివరకు 31 మంది భక్తులు మరణించారు.

Char Dham Yatra Pilgrims Death: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌ యాత్రగా వ్యవహరిస్తారు. సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయే ఈ ఆలయాల చార్‌ధామ్ యాత్ర ఇటీవల ప్రారంభమైంది. మే 3వ తేదీన చార్​ధామ్ యాత్ర మొదలుకాగా, ఇప్పటికే 31 మంది భక్తులు మరణించారు. మే 13 వరకు ఈ మరణాలు సంభవించాయని ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

భక్తుల మరణానికి కారణాలివే.. 
చార్‌ధామ్ యాత్రలో పాల్గొన్న సందర్భంగా అనారోగ్యానికి గురై భక్తులు చనిపోతున్నారని ఉత్తరాఖండ్ ఆరోగ్య డైరెక్టర్​ జనరల్​ డా.శైలజా భట్ తెలిపారు.  గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట చెందడం, అధిక రక్తపోటు లాంటి కారణాలతో ఈ 31 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. చార్‌ధామ్ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఆయా మార్గాల్లో వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు జారీ చేసినట్లు  పేర్కొన్నారు.   

చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు వైద్య పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను వెబ్‌సైట్లో పొందుపరచాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య పరీక్షల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే, ఆ భక్తులకు ఎంత విశ్రాంతి కావాలో సూచిస్తారు. వైద్యుల సూచన మేరకు అలాంటి భక్తులు తిరిగి తమ చార్‌ధామ్ యాత్ర ప్రారంభించాల్సి ఉంటుందని శైలజా భట్ వెల్లడించారు. 

వైద్య పరీక్షా కేంద్రాలు.. 
రిషికేశ్ ISBT రిజిస్ట్రేషన్ సైట్‌లో చార్‌ధామ్ యాత్రికుల ఆరోగ్య పరీక్షలు ప్రారంభం అవుతాయి. యమునోత్రి మరియు గంగోత్రి యాత్ర మార్గంలో దోబాటా, హీనాల వద్ద, బద్రీనాథ్ ధామ్ యాత్రికుల కోసం పాండుకేశ్వర్ వద్ద ఆరోగ్య పరీక్షా శిబిరాలు ఏర్పాటు చేశామని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శైలజా భట్ పేర్కొన్నారు. 

మే 3న చార్‌ధామ్ యాత్ర ప్రారంభం..
అక్షయ తృతీయ సందర్భంగా మే 3న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవడంతో ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. మే 6న కేదార్​నాథ్​, 8న బద్రీనాథ్​ ఆలయాలు తెరుచుకున్నాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది. గత ఏడాది చార్‌ధామ్ యాత్రలో మూడు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. 

Also Read: Kedarnath Shrine Opens: హరహర మహాదేవ శంభో శంకర- తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం 

Also Read: Delhi Mundka Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27కి చేరిన మృతులు, ప్రధాని మోదీ నష్ట పరిహారం ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Uttar Pradesh Crime News: భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు
భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు 
Embed widget