అన్వేషించండి

Budget 2024 LIVE: 2024-25 తాత్కాలిక బడ్జెట్‌ సభలో ప్రవేశ పెడుతున్న నిర్మల

Budget 2024 LIVE Updates: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కానున్నారు.

Key Events
Budget 2024 LIVE Updates FM Nirmala Sitharaman Interim Budget Speech Highlights Key Announcment Budget 2024 LIVE: 2024-25 తాత్కాలిక బడ్జెట్‌ సభలో ప్రవేశ పెడుతున్న నిర్మల
ఆరోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

Background

Budget Timeline 1947-2023: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitaraman) ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? ఏ యే వర్గాలకు వర్గాలకు ఊరట కల్పిస్తారు ? పన్ను పరిమితి పొడిగిస్తారా ? ఎన్నికల హామీలు ఏమైనా బడ్జెట్ లో ప్రకటిస్తారా ?  అన్నది ఆసక్తికరంగా మారింది. 

నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్  
బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్...రికార్డును సొంతం చేసుకోనున్నారు. అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిలవనున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జి దేశాయ్ సరసన ఆమె నిలవబోతున్నారు. నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.  ఆర్థిక మంత్రి డాక్యుమెంట్​లోని కీలక అంశాలను క్రోడీకరించి, ప్రతిపాదనల వెనుక ఉన్న ఆలోచనలను ప్రజెంటేషన్ సమయంలో వివరిస్తారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్​ని పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఉభయ సభలు ఆమోదం పొందాక బడ్జెట్​ తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు.

రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి బడ్జెట్ 
రాష్ట్రపతి ఆమోదంతో బడ్జెట్​ అమల్లోకి వస్తుంది. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సెషన్‌కు ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల నుండి గ్రాంట్ల కోసం చివరి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్‌ల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చు ప్రతిపాదనలను కోరింది. 2024 మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి, తన బడ్జెట్ ను ప్రవేశపెట్టే వరకు అమల్లో ఉండేలా, మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ భద్రత
సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కు అప్పగించింది. తాజాగా 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 140 మంది సెక్యూరిటీ సిబ్బందిలో 36 మంది అగ్నిమాపక శాఖ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ప్రస్తుతం లక్షా 70 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధీనంలోని ఇది పని చేస్తుంది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 68 విమానాశ్రయాలు, అణుశక్తి, ఢిల్లీ మెట్రో, ఏరోస్సేస్ కేంద్రాల వద్ద సీఐఎస్ఎప్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి.  సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన గవర్నమెంట్‌ బిల్డింగ్‌ సెక్యూరిటీయూనిట్‌ నిపుణులు, ఫైర్‌ యూనిట్‌ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్‌ భద్రతా బృందాలతో కలిసి కొన్నిరోజుల క్రితం సర్వే చేపట్టారు. కేంద్ర హోం శాఖకు నివేదిక ఇచ్చిన తర్వాత...140 మంది సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా  సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు. 

UNION BUDGET -2024
మనదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను 1947-48 సంవత్సరానికి ఆర్‌.కె. షణ్ముఖచెట్టి ప్రవేశపెట్టారు. మన మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా.. ? 197కోట్లు..! ఇప్పుడు చిన్న మునిసిపాలిటీకి కూడా అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఉంది. 1950-51 బడ్దెట్‌లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ఏర్పడే వరకూ ప్రణాళికా సంఘమే దేశానికి మార్గనిర్దేశనం చేసింది. 

12:37 PM (IST)  •  01 Feb 2024

Budget 2024 LIVE: అన్ని వర్గాలపై దృష్టి సారించిన ఆర్థిక మంత్రి

అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికీ నీరు, అందరికీ విద్యుత్, అందరికీ వంటగ్యాస్, అందరికీ బ్యాంకు ఖాతాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు రికార్డు సమయంలో జరిగాయని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక సేవల ద్వారా ప్రతి ఇంటిని, వ్యక్తిని ఆర్థికంగా నిలదొక్కుకోవడంపై దృష్టి సారించింది. ప్రభుత్వం సాధించిన విజయాలను లెక్కించిన ఆర్థిక మంత్రి, భవిష్యత్తులో అభివృద్ధి చెందిన భారతదేశం రోడ్ మ్యాప్ రూపొందించడానికి కూడా ఈ బడ్జెట్ సహాయపడుతుందని అన్నారు.

12:18 PM (IST)  •  01 Feb 2024

Budget 2024 LIVE: మౌలిక సదుపాయల కోసం 11,11,111 కోట్లు ఖర్చు 

పదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిందని, దేశంలో 1000 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక సదుపాయాలకు రూ.11,11,111 కోట్లు ఖర్చవుతుందని, దాని వ్యయాన్ని 11 శాతం పెంచుతున్నామన్నారు. వందే భారత్ లో 40 వేల కోచ్ లను అప్ గ్రేడ్ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget