అన్వేషించండి

Budget 2024 LIVE: 2024-25 తాత్కాలిక బడ్జెట్‌ సభలో ప్రవేశ పెడుతున్న నిర్మల

Budget 2024 LIVE Updates: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కానున్నారు.

LIVE

Key Events
Budget 2024 LIVE: 2024-25 తాత్కాలిక బడ్జెట్‌ సభలో ప్రవేశ పెడుతున్న నిర్మల

Background

Budget Timeline 1947-2023: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitaraman) ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? ఏ యే వర్గాలకు వర్గాలకు ఊరట కల్పిస్తారు ? పన్ను పరిమితి పొడిగిస్తారా ? ఎన్నికల హామీలు ఏమైనా బడ్జెట్ లో ప్రకటిస్తారా ?  అన్నది ఆసక్తికరంగా మారింది. 

నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్  
బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్...రికార్డును సొంతం చేసుకోనున్నారు. అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిలవనున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జి దేశాయ్ సరసన ఆమె నిలవబోతున్నారు. నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.  ఆర్థిక మంత్రి డాక్యుమెంట్​లోని కీలక అంశాలను క్రోడీకరించి, ప్రతిపాదనల వెనుక ఉన్న ఆలోచనలను ప్రజెంటేషన్ సమయంలో వివరిస్తారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్​ని పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఉభయ సభలు ఆమోదం పొందాక బడ్జెట్​ తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు.

రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి బడ్జెట్ 
రాష్ట్రపతి ఆమోదంతో బడ్జెట్​ అమల్లోకి వస్తుంది. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సెషన్‌కు ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల నుండి గ్రాంట్ల కోసం చివరి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్‌ల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చు ప్రతిపాదనలను కోరింది. 2024 మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి, తన బడ్జెట్ ను ప్రవేశపెట్టే వరకు అమల్లో ఉండేలా, మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ భద్రత
సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కు అప్పగించింది. తాజాగా 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 140 మంది సెక్యూరిటీ సిబ్బందిలో 36 మంది అగ్నిమాపక శాఖ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ప్రస్తుతం లక్షా 70 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధీనంలోని ఇది పని చేస్తుంది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 68 విమానాశ్రయాలు, అణుశక్తి, ఢిల్లీ మెట్రో, ఏరోస్సేస్ కేంద్రాల వద్ద సీఐఎస్ఎప్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి.  సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన గవర్నమెంట్‌ బిల్డింగ్‌ సెక్యూరిటీయూనిట్‌ నిపుణులు, ఫైర్‌ యూనిట్‌ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్‌ భద్రతా బృందాలతో కలిసి కొన్నిరోజుల క్రితం సర్వే చేపట్టారు. కేంద్ర హోం శాఖకు నివేదిక ఇచ్చిన తర్వాత...140 మంది సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా  సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు. 

UNION BUDGET -2024
మనదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను 1947-48 సంవత్సరానికి ఆర్‌.కె. షణ్ముఖచెట్టి ప్రవేశపెట్టారు. మన మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా.. ? 197కోట్లు..! ఇప్పుడు చిన్న మునిసిపాలిటీకి కూడా అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఉంది. 1950-51 బడ్దెట్‌లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ఏర్పడే వరకూ ప్రణాళికా సంఘమే దేశానికి మార్గనిర్దేశనం చేసింది. 

12:37 PM (IST)  •  01 Feb 2024

Budget 2024 LIVE: అన్ని వర్గాలపై దృష్టి సారించిన ఆర్థిక మంత్రి

అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికీ నీరు, అందరికీ విద్యుత్, అందరికీ వంటగ్యాస్, అందరికీ బ్యాంకు ఖాతాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు రికార్డు సమయంలో జరిగాయని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక సేవల ద్వారా ప్రతి ఇంటిని, వ్యక్తిని ఆర్థికంగా నిలదొక్కుకోవడంపై దృష్టి సారించింది. ప్రభుత్వం సాధించిన విజయాలను లెక్కించిన ఆర్థిక మంత్రి, భవిష్యత్తులో అభివృద్ధి చెందిన భారతదేశం రోడ్ మ్యాప్ రూపొందించడానికి కూడా ఈ బడ్జెట్ సహాయపడుతుందని అన్నారు.

12:18 PM (IST)  •  01 Feb 2024

Budget 2024 LIVE: మౌలిక సదుపాయల కోసం 11,11,111 కోట్లు ఖర్చు 

పదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిందని, దేశంలో 1000 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక సదుపాయాలకు రూ.11,11,111 కోట్లు ఖర్చవుతుందని, దాని వ్యయాన్ని 11 శాతం పెంచుతున్నామన్నారు. వందే భారత్ లో 40 వేల కోచ్ లను అప్ గ్రేడ్ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

11:55 AM (IST)  •  01 Feb 2024

Budget 2024 LIVE: మహిళల కోసం ఆర్థిక మంత్రి భారీ ప్రకటన

దేశంలో మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, వాటి వల్ల వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి జరుగుతోందని ఆర్థిక మంత్రి అన్నారు. లఖ్పతి దీదీ పథకం కింద దేశంలో కోటి మంది లబ్ధిపొందుతున్నారు. 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచి 3 కోట్ల మంది మిలియనీర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

11:50 AM (IST)  •  01 Feb 2024

Budget 2024 LIVE: ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు 

పీఎం ఆవాస్ కింద 70 శాతం ఇళ్లను మహిళలకు ఇచ్చాం. పీఎం సంపద యోజన ద్వారా 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్ 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు అందజేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాన్ని ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలందరికీ అందించనున్నారు. మధ్యతరగతి ప్రజల కోసం గృహనిర్మాణ పథకాలను ప్రారంభిస్తామని, కోటి సోలార్ ప్యానెల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ను అందించే ప్రభుత్వ పథకం గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందన్నారు.

11:44 AM (IST)  •  01 Feb 2024

Budget 2024 LIVE: ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం: నిర్మలా సీతారామన్న

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే, సమ్మిళిత వృద్ధికి దారితీసే ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తుంది. ఆర్థిక విధానాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. 3 కోట్ల ఇళ్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తయిందని, వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కింద ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget